Saturday, April 21, 2012

Song of the week - Mutyamanta Pasupu

Movie:            Mutyaala Muggu
Presenter:     M. Sukumar
Producer:     Maddali Venkata Lakshmi Narasimha Rao (MVL)
Banner:         Sri Rama చిత్ర
Direction:      బాపు గారు 
Story, Screenplay & Dialogues: Mullapudi Venkata Ramana
Cinematography: Ishan Arya
Lyrics:           Arudra
Music:            KV Mahadevan
Singer(s):      P. Suseela
Year of Release: 1975


ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు  ముంగిల్లలోన  
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ   || ముత్యమంత ||

చరణం 1:
ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే  వారి  అరచేతనుండు   (2)
తీరైన  సంపద  ఎవరింట  నుండు
దిన  దినము  ముగ్గున్న  లోగిల్లనుండు  || ముత్యమంత ||

చరణం  2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి  కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు

కోరినంత పాడి నిండు కడవళ్ళు               || ముత్యమంత ||
చరణం 3:
మగడు మెచ్చిన  చాన  కాపురంలోన
మొగలి  పూలా గాలి  ముత్యాల  వాన    (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత  వైభోగం                 || ముత్యమంత ||




బాపు రమణీయం అంటే గుర్తుకు వచ్చేది ముత్యాల ముగ్గు సినిమా అంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం ఈ సినిమా.  తెలుగు పదాలకి, సినిమాలో పాత్రల నిర్వచననానికి, ఆహార్యానికి, విలన్ పాత్ర సృష్టికి, ఆంజనేయస్వామిని కథ లో వాడుకున్న తీరు, సినిమా తీసిన ప్రదేశాలు, పాటలు ఇలా ఏది చూసిన తెలుగు తనం ఉట్టిపడేలా కుదిరిన సినిమా. భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలి అని నిర్వచించిన   సినిమా  ఇది. ఈ సినిమాని ఈ తరం ఉత్తర రామాయణం గా పోలుస్తారు విశ్లేషకులు. కథలోని సన్నివేశాలు అలా ఉంటాయి మరి. అంతే కాదు సినిమా ఆరంభం లో టైటిల్స్ పడుతున్నప్పుడు మంగళంపల్లి బాలమురళి గారు పాడిన "శ్రీ రామ జయ రామ సీత రామ" అన్న పాట సినిమా కి అంతులేని అందం తెచ్చింది. అసలు ఈ పాట అప్పుడు పెట్టటమే ఒక అద్బుతమైన ప్రయోగం. కథ కథనం, దర్శకత్వం అద్బుతంగా చేసి ఒక అందమైన  దృశ్య కావ్యాన్ని అందించారు బాపు-రమణలు.  


రమణ గారి మాటలు ఆణి ముత్యాలు. ఎన్నోసంభాషణలు కలకాలం గుర్తుండి పోయే లాగ  రాసారు ఆయన. ముఖ్యంగా రావు గోపాల రావు గారికి రాసిన మాటలు చాల ప్రసిద్ది పొందాయి. ఇంక ఈ సినిమాలో అన్ని అద్బుతమైన పాటలే. సినారే, ఆరుద్ర గారు సినిమాకి అమరి ఒదిగి పోయే పాటలు రాసారు. మహదేవన్ గారు తెలుగు వారేనా అన్నట్లు సంగీతం సమకూర్చారు.  ఇన్ని మేలు కలయికలు ఉన్న అందుకే ఈ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమా గా జాతీయ పురస్కారం లభించింది.  బాపు-రమణ వీళ్ళిద్దరూ ఒకరు తనువు అయితే ఒంకొకరు మనసు, అందుకనే వీరి కలయికలో అనేక ఆణిముత్యాలు వచ్చాయి.  వీరిద్దరి కలయిక లో వచ్చిన ఆఖరి సినిమా "శ్రీరామ రాజ్యం".

భాగవతుల సదా శివ శంకర  శాస్త్రి అంటే వారికి చాల మందికి తెలియదు కాని ఆరుద్ర గారు అంటే అందరికి తెల్సు. అయన రాసిన పాటలు గురించి చెప్పాలంటే అర్హత ఉండాలి. అయన రాసిన ఈ పాట ఎంత అద్భుతమైనదో ఈ పాటలోని భావమే చెప్తుంది. సరళ మైన పదాలతో తెలుగు పాటకి నిర్వచనం చెప్పినట్లు ఉంటుంది. సుశీల గారు ఈ పాట పాడిన తీరు పాటలు పాడటం నేర్చుకునే వారికి ఒక నిఘంటువు. ఎందుకంటే ప్రతి పదం అంత స్పష్టంగా ఉంటుంది, భావం అంత స్పష్టం గా ఉంటుంది, అదే రీతిన  అంత తీయగా మనసులని తాకుతుంది. మామ మహదేవన్ గారి గురించి ఇంకా ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అయన తన శిష్యుడు పుహళేంది గారితో తెలుగు వాళ్ళకి లభించిన ఒక గొప్ప వరం.

ఇంక సినిమా కథలోకి వస్తే, జమిందారు, ధనవంతుడు, రాజ రావు బహద్దూర్ ( రామ దాసు ). ఆయన అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అందులో అతని కొడుకు అయిన శ్రీధర్ స్నేహితుడికి (హరి) ధన సహాయం చేసి చదివిస్తాడు.  శ్రీధర్ కూడా అన్ని విధాల యోగ్యుడు, తండ్రి మాట కి విలువనిచ్చే కొడుకు. హరి తన చెల్లెలు లక్ష్మి పెళ్ళికి ఆహ్వానిస్తే, శ్రీధర్ వెళ్లి అనుకోని పరిస్తితి లో లక్ష్మి ని వివాహం చేసుకొని తన ఇంటికి తీసుకు వస్తాడు. తన కూతురు వివాహం శ్రీధర్ తో చెయ్యాలని అనుకున్న రాజ వారి బావ మరిది ఈ వివాహం నచ్చక ఒక కాంట్రాక్టర్ ( రావు గోపాల రావు) సహాయం తో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసి వాళ్లు విడిపోయేలా చేస్తాడు. విడిపోయిన లక్ష్మి ఇద్దరు కవలలు కానీ వారిని పెంచుతూ ఉంటుంది. చివరికి శ్రీధర్ లక్ష్మి ఎలా కలుస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎలా కలుపుతారు అన్నది కథ. ఈ సినిమా లో లక్ష్మి కూతురు ఆంజనేయస్వామి వారితో సంభాషణలు, రమణ గారి ఊహ శక్తికి నిదర్శనం. ఇంకా బాపు గారు కాంట్రాక్టర్ పాత్ర నడిపిన తీరు, అతనికి రమణ గారు రాసిన సంభాషణలు కల కాలం గుర్తుంది పోతాయి. సూర్యోదయం చూస్తూ,  "సూర్యుడు నెత్తుటి గడ్డలా లేదు? ఆకాసంలో  మర్డర్ జరిగినట్లు లేదు?", "మడిసన్న తర్వాత కూస్తంత కళా పోసన   ఉండాల" ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాలు జనాల నోట్లో నానాయి.

ఈ పాట సందర్భానికి వస్తే లక్ష్మి పెళ్లి ఐన తరువాత అత్త వారింటికి వచ్చి పొద్దున్న లేచి వాకిట కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతూ పాడిన పాట. లక్ష్మి ఈ పనులన్నీ చేస్తుంటే ఇంటిల్లి పాడి ఆశ్చర్య పోతూ చూస్తుంటారు. ఇంక పాట లోకి వెళ్తే.

ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంతా ఛాయ
ముద్దు మురిపాలోలుకు  ముంగిల్లలోన
మూడు పువ్వులు ఆరు కాయళ్ళు కాయ 



పసుపు మన భారత దేశపు సొత్తు. పసుపు వల్ల కలిగే లాభాలు మనకి తెల్సినట్టు గా ఎవరికీ తెలియదు. అలాగ పసుపు మనం వాడినట్టు గా ఇంక ఎవరు వాడరేమో. అందులో తెలుగింటి ఆడపడుచులు పసుపు పాదాలకి ముఖానికి రాసుకోవటం చూస్తాం, దీని వల్ల ముఖానికి, చర్మానికి వన్నె పెరగటం సర్వ సాధారణం. ఈ పాట 1975 లో వచ్చింది కాబట్టి అప్పటి తరం వ్యవహార శైలి కి అద్దం  పడుతుంది ఈ పాట. ఈ రోజుల్లో ఈ విషయం మనం చూడం కాబట్టి ఇప్పటి పద్ధతులకి ఈ పాట అన్వయించలేము. అలాగే కుంకుమ పెట్టుకోవటం ముత్తైదువ లక్షణం. ఆరుద్ర గారు ఇక్కడ అప్పటి పద్ధతులకి అన్వయిస్తూ రాసిన పాట అప్పటి వ్యవహార శైలికి అద్దం పడుతుంది.  ముత్యమంత పసుపు రాసుకుంటే ముఖానికి ఎంత వన్నె తెస్తుందో, అలాగే నుదుట, పాపిట కుంకుమ పెట్టుకున్న తెలుగింటి ముత్తైదువ జీవితం కూడా అంతే అద్బుతంగా ఉంటుంది. ముత్యమంత పసుపు అని ఎందుకు అన్నారంటే ఆ మాత్రం  పసుపు చాలు వన్నె తేవటానికి. అలాగే ముంగిళ్ళు ఆ రోజుల్లో ప్రతి ఇంటా సర్వ సాధారణం. ముంగిళ్ళ లో ముద్దు మురిపాలు ఉన్నాయి ఆంటే ఆ ఇల్లు  ఆనందానికి  ప్రతీక. మనుషులు కలిసి ఆనందిస్తున్నారు అనటానికి తార్కాణం. అటువంటి ఇంటిలో అరమరికలు ఉండవు, అపార్థాలు కోప తాపాలు ఉండవు. ఇటువంటి ఇంటిలో అన్ని ద్విగుణీ కృతం అవుతాయి. కాని ఇవి అన్ని ఇంటి ముత్తైదువ వల్లనే సాధ్యం. ఎక్కడ ఇంటి ఇల్లాలు ముఖం లో లేక జీవితం లో వన్నె ఉంటుందో ఆ ఇంట్లో అన్ని చక్కగా అభివృద్ధి చెందుతాయి.  ఒక ఇల్లు ఎలా ఉండాలో ఎంత చక్కగా చెప్పారో కదా. 


ఆరనయిదోతనము ఏ చేతనుండు
అరుగులలికే  వారి  అరచేతనుండు   (2)
తీరైన  సంపద  ఎవరింట  నుండు
దిన  దినము  ముగ్గున్న  లోగిల్లనుండు



ఆరని అయిదోతనం, అరుగులు అరచేతన అలకటం, లోగిళ్ళలో ముగ్గులు ఇవి తెలుగు తనానికి ప్రతీక. పల్లెటూర్లో ప్రతి ఇంటికి అరుగులు ఉండేవి. అలాగే అందరు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ప్రతి ఉదయం పేడతో అలికి కళ్ళాపి ( నీరు ) చల్లి ఆ నీళ్ళు ఆరిన తరువాత ముగ్గులు పెడ్తే ఆ వాతావరణ సౌందర్యం చూడటానికి కంటికి ఇంపుగా ఉండేది.   అయిదోతనం ఆంటే సుమంగళి అయిన  స్త్రీకి ఉన్న ఆభరణాలు. అవి ఏంటి ఆంటే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వకు ( చెవి ఆభరణాలు ). ఇవి అన్ని ఉంటె ఆ స్త్రీ ముత్తైదువ గా ఉన్నట్లే. సాధారణం గా మనం స్త్రీ భర్తని కలిగి ఉంటె సుమంగళి, కొంచెం పెద్ద వయసు కలిగిన వాళ్ళని ముత్తైదువ అంటాం. ఇంక పాట విషయానికి వస్తే ఆరని అయిదోతనం ఎవరి వల్ల సాధ్యం ఆంటే, ప్రతి రోజు అరుగులు అలికి తన కుటుంబం బాగా ఉండేలాగా చూసుకునే ముత్తైదువ చేతి లో ఉంటుంది. అలాగా ముగ్గు వలన అనేకమైన లాభాలు ఉన్నాయి. అవి ఇంటికి సౌందర్యం తీసుకు రావటమే కాక, ఎవరి ఇంటిలో ముగ్గు ఉంటుందో వారి ఇంటికి లక్ష్మి దేవి వస్తుంది అనే ప్రతీక ఉంది తెలుగు నాట. ఇది ఎందుకు ఆంటే ఆ ఇల్లు పద్దతి గా ఉండి అన్ని అవలక్షణాలు లేకుండా ఇంట్లో అందరు కష్టపడి పని చేస్తారు అని అర్థం. ఎవరు పని చేస్తే వల్ల ఇంట లక్ష్మి దేవి ఉండటం సహజం కదా.  ఇన్ని వివరిస్తూనే వీటి అన్నిటికి కారణం ఇంటి ఇల్లాలే అని మల్ల చెప్తారు ఆరుద్ర గారు.



కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి  కొలిచేవారి కొంగు బంగారు (2 )
గోవు మాలక్ష్మికి కోటి దండాలు
కోరినంత పాడి నిండు కడవళ్ళు   

తెలుగు వాళ్ళు పసుపు కుంకుమ కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఆంటే ప్రాధాన్యం ఇంట్లో తులసికి ఉంటుంది. తులసి చెట్టుని దేవత లాగ పూజించడం తెలుగు వారి పద్దతి. తులసి లేని ఇల్లు తెలుగు నాట ఉంటుంది ఆంటే ఊహించలేము. ఇంట్లో పాటించే పద్దతులు ఈ తులసి మొక్క పెరుగుతున్న తీరు బట్టి చెప్పొచ్చు అంటారు. అందుక ఆరుద్ర గారు. కొందరు తులసిని కోటలో పెంచితే, కొందరు కుండీలలో పెంచితే, కొందరు సాధారణం గా ఇంటి ఆవరణలో పెంచితే, కొందరు పూజ మందిరం లో ఉంచుతారు. ఎవరు ఎలా పెంచినా, ఆ మొక్కకి ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఇంటిని చెప్పొచు. ఇంక తులసెమ్మ ఎంత కోరితే అంత ఇచ్చే దేవత. మన ఇంతో ఇంతే కొంగుకి ముదేసుకున్నట్టే, లక్ష్మి, బంగారం ఇచ్చే దేవతే మన ఇంట్లో ఉండే బంగారం. ఇంక తెలుగు వారు తరువాత పూజించేది ఆవుని. పల్లెటూర్లో ప్రతి వారింట పాడి తప్పని సరిగా ఉంటుంది. పాడిని శ్రద్దగా చూసుకుంటే పాలు/పాడి బిందెలు నిండా వస్తుంది. ఇల్లు అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం అందరికి తెల్సినా అందం గా చెప్పటం ఆరుద్రా గారి గొప్పతనం. 

మగడు మెచ్చిన  చాన  కాపురంలోన
మొగలి  పూలా గాలి  ముత్యాల  వాన    (2 )
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత  వైభోగం  

ఇంట్లో అన్ని సమకూర్చేది బాద్యత వహించేది ఇల్లాలు అయినా మగాడు ఆ ఇల్లలికి ఆదరణ, ప్రాముఖ్యత, ఆనందం ఇవ్వక పొతే ఇంటిలో ఆనందం వెల్లి విరియటం కష్టమే. అందుకే భర్త ఎంత మెచ్చుకుంటే ఇంట్లో అంత ఆనందం ఉంటుంది. ఈ విషయం మొగలి పూల గాలి, ముత్యాల వాన అని కవితా ధోరణి లో అందం గా చెప్పటం చూస్తాం. మొగలి పూలు చక్కటి సువాసనని ఇస్తాయి, సాయంత్రం ఈ పరిమళ ఆస్వాదిస్తే ఆ ఆనందం వివరించనలవి కాదు. అందుకనే ఇంటి ఆనందానికి ఆ పోలిక. అలాగే ముత్యాల వాన. చివరికి పాట ఇంటికి ఇల్లాలి యొక్క ప్రాముఖ్యత చెప్తూ ముగిస్తారు ఆరుద్ర. ఇల్లాలు సౌభాగ్యం గా ఉంటేనే ఇంటికి ఆనందం అని, అభివృద్ధి అని, సకల సంతోషాలు అని.

కొసమెరుపు:  ఈ పాట ఎన్ని ఏళ్ళ తరువాత విన్న  తెలుగు వారికి ఏదో తెలియని అనుభూతిని మిగులుస్తుంది. ఇటువంటి అనుభూతిని ఇచ్చిన బాపు, రమణ గారికి మనం ఏమాత్రం గౌరవించక పోవటం మన తెలుగు వారి దౌర్భాగ్యం. తెలుగు సాహిత్యానికి, తెలుగు కళకి విశేషమైన సేవ చేసిన వీరిలో ఒక్కరికైన కనీసం పద్మశ్రీ గా సత్కరించకపోవటం తెలుగు వారి కళల పట్ల నిరాదరణకి తాత్కారం. NTR గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాపు రమణ గార్లని తెలుగు వీడియో పాఠాలు చెయ్యమని చెప్తూ అవి ఎలా ఉండాలి ఆంటే, "ముత్యాల ముగ్గు" లోని తెలుగు తనం లా, అంత అందం గా ఉండాలి అని. ఈ ఒక్క నిదర్సనం చాలు వీరిద్దరూ ఏమిటి తెలుగు సినిమాకి ఆంటే.

Sunday, April 15, 2012

Gabbar Singh - Music Review

Audio/Music Review

Movie:                 Gabbar Singh ( 2012 )
Director:             S Harish Shankar
Producer:           Bandla Ganesh
Cast:                   Pawan Kalyan, Sruti Hassan
Music:                 Devi Sri Prasad
When Pawan is casted in any movie, the take away from movie is only Pawan. Rest all becomes redundant. I guess thats how fans look upto Pawan. Pawan's movie in general are musical hits. Most of the movies had inspiring songs, songs that made fans crazy about him. DSP is one of the high profile music directors who has worked with Pawan to give musical hits in Pawans earlier movies. So obviously there are high expectations on the Gabbar Singh Audio that released on 15th April 2012. Lets see how songs fared.
1. Dekho Dekho Gabbar Singh



Artist(s): Baba Sehgal, Naveen Madhav
Lyricist: Rama Jhogaya Sastry

Not sure when the relation of DSP and Baba Sehgal has started for title song or a song on hero to elevate the character. However its high time for DSP to revisit his thought process to make him to sing the same stuff again and again. At the same, he needs to revisit the tunes and come out of the routine stuff. This song has become monotonous. Rama jogayya sastry has infused many words so that it would become easy to Baba Sehgal to sing. By the way DSP every Singh song doesnt need to be Singh is king.
2. Akasam AmmayaitheArtist(s): Shankar Mahadevan, Gopika Poornima
Lyricist: Chandrabose
DSP mostly in this album reminds other songs. This song is no different. The only different in this song is beats/rhythm. Shankar Mahadevan had nothing much to do in this song. Chandrabose the way he talks in music shows doesnt reflect in his songs. He needs to work on his lyrics. He tries to bring in rhyming words, but doesnt work all the time.

3. Mandu BaabulamArtist(s): Kota Srinivasa Rao
Lyricist: Sahithi
Sahithi gets another song in this album. Making Kota singing this song is an experiment by DSP which succeeded. Song Beat, Kota, Chorus, lyrics suited aptly for this type of the song. A short bit, but very well executed.

4. PillaaArtist(s): Vaddepalli Srinivas, Pawan Kalyan
Lyricist: Devi Sri Prasad
This song is rehash of earlier song, lacks freshness. However DSP added his own lyrics and Pawan's voice to make this presentable to fans. Vaddepalli's voice sounded like Kailash Kher. Routine song from DSP only Pawan's screen presence will add value to this song.
5. Dil SeArtist(s): Karthik, Shweta Mohan
Lyricist: Bhaskarabhatla Ravikumar
Karthik and Shweta Mohan gets a melody number and did their job perfectly. This song again lacks freshness.  Other than that, this song goes well. Will be hummable. Bhaskarabhatla came up with decent lyrics. However in the modern era love definition, Bhaskarbhatla tells "gunde jaari gallantayyinde, teera chooste nee daggara unde" was a beautiful way of telling the feeling but the line following that, neelo edo teeyani vishamunde, naa vontloki sarruna paakinde, didnt suit well with the flow. Anyway as long as song goes well, these are fine. This song is winner in this album.
6. Kevvu KekaArtist(s): Mamta Sharma, Kushi Murali
Lyricist: Sahithi
When DSP has become a master of item songs, each high profile movie will have high expectations not only to make another song and also beat the earlier songs. However it will be a tough task for DSP to meet his expectations each and every time. He for sure gave a different number. Since its an item song, can never predict how huge it is. Sahithi's lyrics are decent, but this song definetely lacks energy levels and the momentum that this type of song requires when comparision comes. But this song has its own merits. Need to see how this song fares after the movie released. Kevvu Keka is mostly used across the world. So the song will be catchy thats for sure.
Pick(s) of the Album: Dil Se, Mandu Babulam, Pilla
DSP tried to cater to the fans of Pawan, delivered to them, comes out as winner. However he forgot that there will be different expectations for his music albums. He satisfied one sector but disappointed other sector by lacking freshness in the album. The songs are catchy, pacy, but doesnt appeal general audience whose expectations are different from DSP.

Saturday, April 7, 2012

Song of the week - Karige loga ee kshanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:     ఆర్య 2
Producer:                 Aditya Babu & BVSN Prasad
Director:                   Sukumar
Music Director:        Devi Sri Prasad
Singer(s):                 Kunal Ganjawala, Megha
Lyrics:                       Vanamali
Year of Release:      2009



కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ    (2)

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 

ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .

మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..                                || కరిగే లోగా ||

ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యి విజయవంతం అయితే అటువంటి ఇంకో సినిమా తీయటం చూస్తూ ఉంటాము. అటువంటి "సీక్వెల్" కోవకు వచ్చేదే ఆర్య - 2. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆర్య, అజయ్ చిన్న నాటి స్నేహితులు అనేకంటే ఆర్యని అజయ్ శత్రువుగా భావిస్తే, ఆర్య మటుకు అజయ్ కి ప్రాణం పెట్టే స్నేహితుడు. అనాధలైన ఇద్దరు ఒకే చోట పెరుగుతూ ఉంటే స్నేహితుడు కావాల్సి రావటం వాళ్ళ అజయ్ స్నేహితుడు అవుతాడు కాని అజయ్ మటుకు ఆర్యని శత్రువు గా నే చూస్తాడు. ఒక జంట వీరిలో ఒకరిని పెంచుకుందామని వస్తే, అజయ్ ని పంపిస్తాడు ఆర్య. కాలక్రమేనా అజయ్ మంచి స్తితిమంతుడిగా స్థిరపడి తనకంటూ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. ఆర్య అదే అజయ్ కంపెనీ లో ఒక ఒప్పందం మీద ఉద్యోగి గా స్థిరపడతాడు. అక్కడ పనిచేస్తున్న గీతని  ఇద్దరు ప్రేమిస్తారు. అజయ్ ఆడిన నాటకం వల్ల గీత అజయ్ ని ప్రేమిస్తుంది, కాని ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏమిటి చివరికి అజయ్ ఆర్య ల స్నేహం ఏమవుతుంది, ఆర్య గీతల  ప్రేమ కథ ఏమవుతుంది అన్నది సినిమా.

ఈ సినిమాలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. సినిమాలో మొత్తం పాటలు అన్ని జనాలని ఉర్రూతలు ఊగించింది. ఈ సినిమా తరువాత ఒకే సినిమాలో మొత్తం అన్ని పాటలు జనాదరణ పొందిన సినిమా ఇప్పటివరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదు. "రింగ రింగా" అనే పాట అయితే ఉత్తర భారత దేశం లో పండుగలప్పుడు విశేషాదరణ లభించింది. అంతే కాదు క్రికెట్ మాచ్ లోను, ఎక్కడ పడితే అక్కడ .  బాష తో సంబందం లేకుండా ప్రజా దరణ పొందింది. ఇటువంటి పాటలని అందించిన దేవి శ్రీ ప్రసాద్ మనకున్న ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు. అన్ని రకాల పాటలు అందరిని అలరించేలాగా అందించగల సమర్ధుడు. అందుకనేనేమో అందరి కథా నాయకుల తోనూ పనిచేసే అవకాశం లభించటం ఒక ఎత్తు అయితే అవి సద్వినియోగ పరచుకోగలటం దేవిశ్రీ  ప్రతిభకి నిదర్శనం.

కరిగేలోగా ఈ క్షణం పాట నేపధ్యం సినిమాలో ఆర్య తన ప్రేమని స్నేహితుడి కోసం వదులుకొని వాళ్ళని విదేశం పంపించాలని అనుకోవటం, వాళ్ళని ఒప్పించి స్నేహితుడి గా మిగిలి పోతున్న క్షణం లో వచ్చే పాట ఇది. తన ప్రాణమైన గీతని, అత్యంత ప్రాణం గా స్నేహించే అజయ్ కోసం ఒప్ప చెప్పటం ఆ ఆవేదన భరిత ఆలోచనలో సాగిన పాట ఇది.  వైవిద్యం ఏమిటంటే ఈ పాట ట్యూన్ కంపోసే చేసిన రీతి, వనమాలి గారు రాసిన విలక్షణ సాహిత్యం హృదయాన్ని స్పర్సిస్తుంది. ఆర్య ఈ సినిమా మొత్తం లో ఎవరికీ అర్థం కాక పోయినా, ఈ పాట అతని మనస్తత్వం తెలియచేస్తుంది, అతను  పడే సంఘర్షణ తెలియచేస్తుంది. 


అలాగే దేవి శ్రీ చేసిన ఒక విలక్షణ ప్రయోగం ఈ పాట. ఈ పాట మొత్తం సముద్రం, నది, అలలు అంటూ ఎలా సాగుతుందో, పాట కూడా అలాగే సాగుతుంది. ఇంక మొదలు ఎలా సాగుతుంది అంటే, ఒక అల ఒడ్డుని తాకేటప్పుడు ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది. ఆ వయోలిన్ సంగీతం. ఆ హెచ్చు తగ్గులు అలల్లాగా ప్రవహించి వేగం పెంచుతూ, శబ్దం హోరు పెరుగుతూ తగ్గుతూ కోరస్ తో పోటి గా సాగుతూ చివరికి అల ఒడ్డుకోచ్చేసరికి ఎలా వేగం పెరిగి పెరిగి ఒడ్డుని తాకుతుందో అలాగా సాగి ముగుస్తుంది. అప్పుడు పాట మొదలు అవుతుంది. ఈ పాటలో ఇంకో విలక్షణమైన ప్రయోగం ఏమిటంటే, అందమైన విరుపులు, ఒక రకమైన "different intrumentation" , పదాల తరువాత  సరళమైన  నిశ్శబ్దం సరికొత్త పరిమళం అందిస్తాయి. ఈ పాటకి రిథం కూడా సరికొత్తగా ఉంటుంది, ఇవ్వన్ని సరిగ్గా సమకూడి పాట విన్న తరువాత ఒక రకమైన మధురమైన  అనుభూతి కలిగించి మరల  మరల వినేలా చేస్తుంది.  ఇంతంటి అందమైన ప్రయోగం చేసిన దేవి శ్రీ ప్రసాద్ అభినందనీయుడు. ఇంక పాట సాహిత్యానికి వస్తే ఈ సినిమా లో కొన్ని పాటలు సినిమాలోని సందర్భానికి సరిపోయే లాగ సరిగ్గా సరిపోయాయి. కాని ఈ పాట మొత్తం సినిమాలో అన్ని పాటలకన్న శ్రేష్టమైనది. అది ఎందుకో చూద్దాం.

కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం..
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ (2)

మనిషి మనస్తత్వం ఎలాగా ఉంటుంది అంటే, ఏదైనా ఇష్టమైనది ఆనందం కలుగ చేసే సమయం ఉంటే, అది ఎప్పటికి తరగ కుండ ఉండాలని, ఆ సమయం అలాగే నిల్చి పోవాలి కలకాలం అని కోరుతుంది. అదే ఏదైనా దుఖం కాని, మనసుకి నచ్చనిది రాబోతోంది అంటే, ఆ క్షణం రాకుండా ఉండేలాగా వేయి విధాలుగా కోరుతుంది. ఈ పాట ఆరంభం లో ఆర్య మనసులోని ఆలోచన, ఈ పాట రూపం లో రాసారు వనమాలి గారు. తను ప్రేమించే గీత, తను విడిచి ఉండలేని స్నేహితుడు ఇద్దరు ఇంక తనకి కనపడరు అన్న చేదు నిజం ఒక వైపు, తను అమితం గా ప్రేమించే గీత ఇంక తనకి దక్కదు అన్న విషయం తెల్సిన తరువాత తన హృదయం స్పందించకుండా మిగిలిపోతుంది అనే సత్యం సాక్షిగా అజయ్, గీత చేతులు కలిపిన క్షణం లో ఇలాగే తన జీవితం గడిపేయాలి అన్న ఆలోచన ఆర్య కి కలగటం ఎంతైనా సమంజసం. ఇంక ఓటమి అనేది రెండు సార్లు కలిగితే ఆ ఆలోచనతో కలిగిన దుఖం కలుగుతుంది ఆర్య కి. ఒక మనిషికి కలిగే దుఖం పోల్చటానికి కన్నీరు కొలత ఐతే ఆ కన్నీరు సముద్రం అంత పొంగితే మనిషి లోని దుఖం ఎంతో మనం ఊహించుకోవచ్చు.  ఈ మానసిక స్థితిని ఎంతో అద్బుతం గా వర్ణిస్తారు. కన్నులలోంచి జారే కన్నీరు, సముద్రం అంత అయితే ఆ సముద్రం లోంచి వచ్చే అలలు, తన జ్ఞాపకాలు. గడచిన ప్రతి నిమిషం గాయం గా మిగిలిపోతే, ఆ గాయం గమ్యం అయితే ప్రతి గమ్యం గీత పట్ల తనకున్న ప్రేమ కి గుర్తుగా మిగిలిపోతుంది, అటువంటి ప్రయాణం, ఈ క్షణం మిగిలిన జీవితం అంత గడిపేయాలి అనుకుంటాడు ఆర్య. ఇంతటి మధురానుభూతి మిగిల్చిన వనమాలి గారు అక్కడితో ఆగకుండా పదాలతో తన ప్రయాణం చరణాల్లో కొనసాగిస్తారు.



పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను 
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను?
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను?
నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా
నేడే ఈ  బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా   || కరిగే లోగా ||


వనమాలి గారు ఈ చరణం తో ఈ పాట విన్న వారిని ఆకట్టుకుంటారు అనటం లో సందేహం లేదు, ఆర్యకి తన జీవితం లో మిగిలనిది ఇద్దరు, ఒకడు తన ప్రాణం అయిన స్నేహితుడు అజయ్ ఒక వైపు, మరో వైపు ప్రేమించిన గీత. ఈ సంఘర్షణ ఈ చరణం. అదే అత్యంత అద్బుతమైన పోలిక తో వివరిస్తారు. నది ప్రవహిస్తూ ఉంటే నదికి రెండు వైపులా తీరం ఉంటుంది. ఆ నదికి ఏ తీరం కి దగ్గర అవుతుంది ఆంటే జవాబు దొరకదు, అలాగే ఆర్య కి అజయ్, గీతాలలో ఎవరికీ దగ్గర ఆంటే ఎలా చెప్తాడు, నదికి రెండు తీరాలు ఎలాగో ఆర్య కి అలాగే. ఇంక ఆర్య జీవితం కూడా ఒక కలే. అతనికి అజయ్, గీత తన జీవితం లో ప్రవేశించటం ఒక కల. నిద్ర దాటి వచ్చే కల మెలుకువగా ఉన్నప్పుడు ఏ కంటి లోంచి వచ్చిందో ఆ కంటి కి సొంతం అవుతాము ఆంటే జవాబు దొరకదు, ఎందుకంటే రెండు కళ్ళు మూసుకుంటేనే నిద్ర,. ఆ నిద్ర లో వచ్చేదే కల. ఇంక మెలుకువ వచ్చిన తరువాత ఈ కన్ను నాది ఆంటే ఏమని చెప్తాం? ఇంక తరువాత వాఖ్యాలు విన్న తరువాత వనమాలి పద సౌందర్యానికి అచ్చెరువు పొందాల్సిందే. ప్రేమ నేస్తం అవుతుంటే, తనలోని సగం  ప్రశ్న గానే మిగిలి పోతుంది కదా, ఆంటే ప్రేమ సఫలీకృతం అయితే ఆ ప్రేమ తనలో సగం అయ్యేది, అది అవ్వకుండా ప్రశ్న గా మిగిలిపోతుంది. అప్పుడు ఆ బంధం విడిపోకుండా ఉండటానికి వీలు లేకుండా ఉంటుందా అని ఆర్య అనుకోవటం సినిమా లో అతని పాత్ర గురించి ఇంత కన్నా చక్కని వివరణ ఉండదు.

అడిగినవన్నీ కాదని పంచిస్తునే .
మరు నిముషం లో అలిగే పసివాడివిలే 
నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ..
నా  బాధంతటి అందంగా ఉందే..
ఈ  క్షణమే నూరేల్లవుతానంటే ఓ ..
మరు జన్మే క్షణమైనా చాలంతే..      || కరిగే లోగా ||

ఇంక ఈ పాట కొనసాగుతూ చివరి చరణం లో పతాకానికి చేరుకుంటుంది. ఆర్య తన స్నేహితుని కోసం అన్ని చేస్తాడు, కాని తను అడుగడుగునా అతనికి బాధ కలిగే విషయాలే జరుగుతూ ఉంటాయి. పెదవుల పై నవ్వుని, పువ్వు తో పోల్చటం కవి ఆలోచన శక్తి కి నిదర్సనం. వికసించిన పువ్వులు ఎంత అందం గా ఉంటాయో ఆ చిరు నవ్వు కూడా అంతే అందం గా ఉంటుంది కాని కన్నీటి తో ఆ పువ్వులని పెంచటం అన్నది ఏందో అందమైన వర్ణన ఆర్య పాత్ర కి.  గీత మనసులో ఆర్య పట్ల కలిగే సానుభూతి కి జరిగే పరిణామాలకి ఈ వాఖ్యం నిదర్సనం. ఇక్కడ ఆలోచిస్తే గీతకే కాదు ప్రేక్షకుడికి కూడా ఆర్య పట్ల సానుభూతి కలుగుతుంది. ఇక్కడ వరకు గీత గురించి చెప్తే మరల ఆర్య దగ్గరకి, ఆ సన్నివేశానికి వచ్చేస్తారు వనమాలి,. గీత అజయ్ వెళ్లిపోతుంటే, ఆ దృశ్యం ఆర్య లో కలిగే ఆవేదన తో పోల్చటం ఆ తరువాత ఆ క్షణం అలాగ తన జీవితం అంతా ఉండిపోతే, ఎన్ని జన్మలైన ఇలాంటి క్షణాలు ఉండిపోతాయి అనటం అక్కడే పాట అంతం అయిపోవటం, అందరిలోనూ ఒక అందమైన అనుభూతి మిగిలి పోతుంది.

కొసమెరుపు:  ఆర్య -2 ఆడియో లో ఇదే పాట దేవి శ్రీ సోదరుడు సాగర్ ఇంకో వెర్షన్ పాడతాడు (D-Plugged). ఈ పాటకి సాగర్ గళానికి తోడుగా గిటార్ మాత్రమే ఉంటుంది.  ఈ పాట సినిమాలో వచ్చే పాట అంత వేగం గా, ఉండకపోయినా కొంచెం సున్నితం గా సాఫ్ట్ గా ఉండి విన్న వాళ్ళకి ఏమాత్రం తగ్గని అదే అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా లో ఎన్ని పాటలు జనాదరణ పొందినా, ఇటువంటి పాటలు హృదయానికి హత్తుకు పోతాయి. ఈ సినిమా లో మిగితా పాటలు ప్రాచుర్యం పొందినంత గా ఈ పాత కి గుర్తింపు లభించలేదేమో అనిపిస్తుంది . ఈ పాటకి తగ్గ గుర్తింపు లభిస్తే, వనమాలి, దేవిశ్రీ, గాయకులు పడిన శ్రమ కి ఫలితం దక్కినట్టే.