Friday, February 24, 2012

Song of the week - Pandu Vennello ee venugaanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:        జానకి weds శ్రీరామ్
Producer:                  S. రమేష్ బాబు
Director:                    అంజి శ్రీను
Music Director:     ఘంటాడి కృష్ణ
Singer(s):                  టిన కునాల్
Lyrics:                       సిరివెన్నెల సీతారామశాస్త్రి

Year of Release:       2003

పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను  నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక      || పండు వెన్నెల్లో ||
కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి కరిగేలా
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా                                                                         || పండు వెన్నెల్లో ||

జానకి వెడ్స్ శ్రీరామ్, సినిమా లోని ఈ పాట సిరివెన్నెల గారు రాసిన సందర్భోచితమైన మరొక్క పాట. ఆయన ఏ పాట రాసిన సందర్భానికి సరిగ్గా సరిపోతుంది, అది ఆయన ప్రజ్ఞ. ఇంతకు ముందు ఇలాంటి కథలతో చాల సినిమాలు చూసి ఉంటాము. కథ క్లుప్తం గా చూస్తె, శ్రీరామ్, జానకి బావ మరదళ్ళు. ఉమ్మడి కుటుంబం లో ఉన్న వాళ్ళు కొన్ని కుటుంబ కారణాల వలన రెండు కుటుంబాలు విడిపోతాయి. విడి విడిగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాని వాళ్ళ మదిలో ఉన్న ప్రేమ అలా ఉంది పోతుంది. మిగిలిపోతుంది. అది తెలియటానికి కూడా వాళ్ళకి చాల సేపు పడుతుంది. ఈ లోపల వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు రావటం కథ అటు ఇటు అయ్యి చివరికి వాళ్ళు ఎలా ఒకటి అవుతారు అనేది సినిమా కథ.
సాధారణం గా మనం కోరుకునే వాళ్ళు చాల ఏళ్ళ తరువాత మనల్ని చూడటానికి వస్తుంటే మనసు వాళ్ళని ఎప్పుడు కలుస్తామా అని ఉవ్విల్లూరుతుంది. ఇంకా వాళ్లతో కలయిక ఎలా ఉండాలా అనే ఆలోచన తో సతమతం అవుతుంది. ఇదే ఇద్దరు ప్రియుల మధ్య ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. మది కలవరం చెందుతుంది, కంటికి  కునుకు ఉండదు, ఆలోచనలు అలలు పొంగినట్లు పొంగుతాయి, జలపాతలలా జారుతుంటాయి, అలాగే మది కూడా ఎక్కడికెక్కడో తిరిగి అలసి పోతుంది, క్షణం యుగం లాగ నడుస్తుంది, ఎవరు కనిపించిన ప్రియుడి లాగ కనిపించటం, ఊహల్లో కలల్లో వాళ్ళ తలపులు కలుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలు చాల చూసి ఉంటాము, ఇలాగ వాళ్ళలో కలిగే ఇన్ని భావాలని ఒక పాట లో రాయటం కష్టమే. ఇలాంటి పాటలు చాల చూసాం, కాని ఈ పాట విశిష్టత ఈ పాటదే  అలాగ రాయగలటం సిరివెన్నెల గారి ఆలోచన ద్రుక్పదానికి చిహ్నం. సాధారణంగా  సినిమాలలో ఎందుకనో ప్రేయసి ప్రియుడి కోసం పాడటం చూస్తాం కాని ఎప్పుడు ప్రియుడు ప్రేయసి కోసం వేచి చూస్తూ పాట పాడటం చూడం.
ఈ పాట మాధుర్య ప్రధానంగా అద్భుతంగా చేసారు ఘంటాడి కృష్ణ, అలాగే వింటూ ఉండిపోయే పాటకి అందమైన మాటల కూర్పు చేసారు సిరివెన్నెల. జానకి ఈ సినిమాలో రాజమండ్రిలో ఉండటం, తెలుగు ఆహార్యం ఎక్కువగా ధరించటం వలన తెలుగు తనం ఉట్టి పడుతుంది. సిరివెన్నెల పదాల అందాలు, గోదావరి జిల్లా అందాలు ఒకటికి ఒకటి పోటీ పడతాయి అంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు జానకి పాత్ర వేసిన గజాల ముఖంలోని అమాయకత్వం పాటకి సరికొత్త అందం తీసుకొని వస్తుంది. దర్శకుడు ఈ పాట చిత్రీకరణకి జన రంజనం కోసం కావాల్సిన హంగులు అన్ని సమకూర్చారు. పాట పాడిన టినా కునాల్, గొంతులో మాధుర్యంతో పాటకి న్యాయం చేసిన, అక్కడక్కడ తెలుగు మాటలు పలుకటంలో స్పష్టత కనిపించకపోవటం(నేస్తం,అన్నప్పుడు), ఉచ్చ స్థాయి లో పాడినప్పుడు కష్టపడినట్లు అనిపించినా, ఈ  పాట మల్లి మల్లి వినాలి అనుకున్నప్పుడు మనల్నిపెద్దగా ఇబ్బంది పెట్టవు.   ప్రియరాలు తన ప్రియున్ని పదే పదే తలచుకొని పాడే పాట ఇది. ఇంక పాటలోకి వెళ్దాం.
పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం

ప్రేమికులకి వెన్నెలకి విడతీయలేని అనుభంధం ఉంటుంది. ఆ వెన్నెల రాత్రుల్లో ఏకాంతం గా వాళ్ళిద్దరూ చేసే చిలిపి ముచ్చట్లు, ఆడే చిలిపి చేష్టలు, ఒకరికొకరు చెప్పుకునే కబుర్లు, సేద తీరుతూ చేసే సరసమైన సంబాషణలు ఇవన్ని వాళ్లకు తరువాత మిగిలే తీపి జ్ఞాపకాలు. అలాంటి వెన్నెల రాత్రుల్లో తన ప్రియుని మాట వేణు గానం లాగ హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారి మాటలు తీయగానే వినిపిస్తాయి ఎప్పుడైనా. అందుకనే అనేకమైన తియ్యనైన జ్ఞాపకాలు తిరిగి నెమరు వేసుకుంటే ఆ జ్ఞాపకాలు తీయ్యదనం నింపుకున్న జలపాతల్లా మదిలో జారుతూనే ఉంటాయి. మౌనంగా ఎదురు చూస్తున్న ఆమె మనసు చేసే సంగీతం ఎలా ఉంటుంది అంటే తన ప్రియమైన అతని పేరు వినిపించే కమ్మని వేణుగానం లాగ, ఆ వేణు గాన సంగీతం ఏమిటి అంటే అది అతని మాట అతని జ్ఞాపకం. అవి ఒక జలపాతం లాగ పారుతూ ఉంటె నీ కోసం నా తనువూ మనసు వేచి చూస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాయి ఓ ప్రియ నేస్తం అనే అద్బుతమైన భావం తో పాటని ఆరంభిస్తారు సిరివెన్నెల. ఈ మాటలకు అదే భావం కలిగేలాగా స్వరం నింపుతారు ఘంటాడి కృష్ణ.

ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక || పండు వెన్నెల్లో ||

కవులకు ప్రియమైన జంటలు చిలుకా గోరింకలే. ఇక్కడ కూడా కథ నాయకుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనిని తన దగ్గరకు తీసుకొని రావాలి, ఆ భావం అద్భుతం గా చెప్తారు సిరివెన్నెల. ఏ పక్షి అయినా ఎప్పటికి ఎగిరి పోలేదు గా, ఎగిరి ఎగిరి అలసి పోయి ఎక్కడో అక్కడ వాలి పోవాలి. తన గూటికి చేరలేకపోతే. కాని అన్ని పక్షులు తిరిగి గూటికే చేరాలి. ఇక్కడ కూడా కథ నాయిక భావం అతని గూడు తన మనసే కదా, ఎక్కడ తిరిగిన తన దగ్గరకే రావాలి అనే భావం తో ఈ పల్లవి సుందరం గా చెప్తారు. ఒకవేళ దూరం గా వెళ్ళిపోయినా, నేను నిన్ను నా దగ్గరకు రాప్పించుకుంటాను, అది ఎలా చెయ్యాలో నాకు తెలుసు, నిన్ను ప్రేమిస్తున్ననేను నిన్ను ఎలా వదులుకుంటాను అన్న విషయం ఎంత అద్భుతం గా వివరిస్తారో ఈ చరణం చూస్తె తెలుస్తుంది. ఓ గోరింకా నువ్వు ఎగిరిపోయవు సరే, కాని అలా ఎగిరి ఎంతసేపు ఉంటావు ఎంత దూరం పోతావు, ఎగిరి ఎగిరి నీ రెక్కలు అలసి పోయి గూడు చేరుకొనే సమయం దగ్గర పాడినప్పుడు నా గుండె కదా నీ గూడు అది పోల్చుకొని తిరిగి వస్తావు కదా. ఇక్కడ ఆమె లో ధీమా కనిపిస్తుంది, అతని మీద తనకున్న విశ్వాసం కూడా కనపడుతుంది. అతనికి ఈమె ప్రేమ విషయం తెలియకపోయినా అది తెల్సుకొని వస్తాడు లే అనే విశ్వాసం కనిపిస్తుంది ఈ పదాలలో.అంటే కాదు ఒకవేళ నీకు తెలియక పోయిన, అది గుర్తించటానికి గుర్తులు లేకపోయినా నేను నీకు నా ప్రేమ కు దారి చూపి నిన్నునా దగ్గరకు రాప్పించుకోనా అన్న ఆమె భావాన్ని, గోరింక తో పోల్చి మనకి అందమైన భావం మిగులుస్తారు సిరివెన్నెల. అందుకే ఓ గోరింకా నీ గూడు ( తన మనస్సు ) కి తిరిగి వచ్చే దారి మర్చి పొతే, నేను దగ్గర ఉంది దారి చూపిస్తూ నా దగ్గరకు రప్పించు కోనా అని మొదటి చరణం అద్బుతం ముగిస్తారు సిరివెన్నెల.

కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
ఇంక రెండవ చరణం లోకి వస్తే సినిమా లో జానకి శ్రీరాం అనేవి పాత్రల పేర్లు, అది కాక అందరికి  ఆదర్శం అయిన సీతారాములే కవుల వర్ణనలకి ఆదర్శం. సీతారాముల కథని అందం గా సినిమా కి అల్లుకోవటం, వర్ణించటం మనకి అంతులేని మధురమైన భావనని మిగులుస్తుంది. సీతమ్మ వారి పెళ్లి కథ ఒక రమణీయమైన గాధ. అలవోకగా శివధనుస్సు కదిపిన సీతమ్మ వారికి అది ఎత్తిన వారికి సీతమ్మ వారితో పెళ్లి అన్న చాటింపు ఏడు లోకాలకి వెళ్తుంది. అదే సందర్భాన్ని తన చరణం లో వాడుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయిస్తారు అవి భూలోకం లో జరుగుతాయి అంటారు, అలాగే సీత తనకోసమే పుట్టింది అని శ్రీరామునికి తెలియదా? సినిమా కథ లో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ జానకి ఆ శ్రీరాం కోసమే పుట్టింది అని అతనికి తెలియదా అని ఆమె అనుకోవటం సమంజసమే. 

వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి విరిగేల
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా
ఈ రెండు వాఖ్యాలు రాసిన సిరివెన్నెల ఊహ శక్తికి, పదాల పొందికకు ఆయనలోని సరస్వతికి శత కోటి నమస్సుమాంజలులు. ఇద్దరి మధ్య ఎడబాటు వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం వల్ల ఇద్దరికీ విరహం కలిగితే ఆ విరహమే శివధనుస్సు అయ్యింది. వాళ్ళిద్దరూ కలవాలి అంటే ఆ విరహం కరగాలి అది ఎలా అంటే ఆ విరహం విల్లువై విరిగితే కాని వరమాల సీతమ్మ వారి మెడలో పడదు. ప్రాయాన్ని పాలతో పోలుస్తారు ఎందుకంటే ఆ పొంగుని ఆపటం కష్టమే. పొంగటం ఆరంబిస్తే ఆగవు, అలాగే కడలి అలలు అవి వస్తూనే ఉంటాయి. ఆ రెండిటికి ముడి వెయ్యటం సిరివెన్నెల గొప్పతనం. ఇంక సినిమా లో కథ నాయికా, నాయకులు శారీరికంగా ఇద్దరు దూరమైనా వాళ్ళ మనస్సులు, ఆలోచనలతో ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు, అది చెప్పటానికే విడిపోని బంధం అంటారు. ఇంతకన్నా గొప్పగా ఎవరైనా ఆలోచించగలరా ??? శివధనస్సు విరిగి సీతమ్మ వారి మేడలో వరమాల పడితే వారి విడిపోని బంధం కలిసి, వయసు లో ఉన్న వాళ్ళిద్దరి కలయిక పాల సముద్రం అలల లాగ పొంగుతాయి కదా. ఈ ఊహ కథానాయిక ద్వారా మనకి కలుగ చేయటం అయన తో పాటు మన జన్మ ధన్యం.

కొసమెరుపు: ఘంటాడి కృష్ణ, ఇంజనీరింగ్ చదివినా, సంగీతాన్ని తన వ్రుత్తి గా మార్చుకొని సినిమా రంగం లోకి అడుగు పెట్టిన తెలుగు సంగీత దర్శకుడు. సిని పరిశ్రమలో ఎంతో ఎత్తు ఎదగలేక పోయిన, తనకంటూ ఒక ముద్ర తో సిని రంగం లో గుర్తింపు పొందాడు. ఈ మధ్య టీవీకి పరిమితం అయిపోయిన, ఇటువంటి కొన్ని మంచి పాటలు అందించాడు మంచి అభిరుచి గల సంగీత దర్శకుడిగా మిగిలిపోయాడు . ఇతను చేసిన పాటలలో 6teens నుంచి "దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే" బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట కుమార్ షాను తో పాడించాడు ఎందుకో మరి.

Wednesday, February 15, 2012

Song of the week - Chinukulaa Raali

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:            నాలుగు స్తంభాలాట
Producer:                           N Krishnam Raju
Director:                   జంధ్యాల 
Music Director:                   రాజన్-నాగేంద్ర 
Singer(s):                            బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
Lyrics:                                  వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:                 1982

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా     || చినుకులా రాలి ||

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే                                                         || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||
నాలుగు స్తంబాలాట ఈ రోజుల లో చాల మందికి తెలియదు కాని ఒక 20-30 సంవత్సరాల క్రితం, పల్లెటూర్లలో మండువా లోగిలి ఇళ్ళలో, ఉమ్మడి కుటుంబం లో సాదారణం గా పిల్లలు ఆడే ఆట. ఈ సినిమా కి ఈ పేరు ఎందుకు పెట్టారో, సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఆట తెల్సిన ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది. సినిమా గురించి తెలియాలంటే ఆట  గురించి తెలియల్సిందే. ఈ ఆట ఎలా ఆడతారంటే, నాలుగు స్తంబాలు, అయిదు ఆట ఆడేవాళ్ళు ఉండాలి, నలుగురు స్తంబాలకి అంటి ఉంటె, చివరి ఆటగాడు మధ్యలో ఉంటాడు( దొంగ అంటారు కొన్ని చోట్ల). ఆ నాలుగు స్తంబాలకి అంటి ఉన్న ఆటగాళ్ళు మధ్యలో ఉన్న ఆటగాడికి అంటకుండా స్తంబాలు మారాలి. ఎవరైనా స్తంబానికి అంటుకోకుండా దొరికి పొతే అతను స్థలం మారి మధ్యలోకి వస్తాడు. ఆట మరల కొనసాగుతుంది. సినిమా లో కూడా నాలుగు పాత్రలు, వాళ్ళు రెండు జంటలు, వీళ్ళతో ఆడే ఆ ఐదో ఆటగాడే విధి. ఆ విధి ఆడిన ఆటలో ఎవరి జీవితాలు ఎలా మారతాయి అన్నదే ఈ కథ.

జంధ్యాల గారు తెలుగు సిని పరిశ్రమకి దొరికిన ఒక వైడూర్యం. అయన తీసిన సినిమాలలో ఆయన తీసిన హాస్య చిత్రాలే గుర్తుండి పోయినా మనకి ఆయన లోని సృజనాత్మకత, సాహితి సంపద, సంగీత ప్రజ్ఞ్య చాల ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. ఈ "నాలుగు స్తంబాలాట" సినిమాతో అయన చాలా మందిని సినీ పరిశ్రమకి పరిచయం చేసారు. ఈ సినిమా ఆ రోజులలో యువతని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ పాట యువతకి జాతీయ గీతం లాగ కొన్ని సంవత్సరాలు మారు మ్రోగింది. సినిమా ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. ఇందులో దర్శకుడు, పాట రచయిత, సంగీత దర్శకుడు ఒకే భావం తో ఏకమైతే ఎలాగా ఉంటుందో తెలియ చెప్పే పాట. బాలు గారు, సుశీల గారు పాట పాడిన, పాత్రలు పాడాయా అనిపిస్తాయి. వాళ్ళ గాత్రం అంత తీయగా, హాయిగా, ప్రేమగా పలకరిస్తాయి. దానికి తోడు  ఈ పాట చిత్రీకరణ అడుగడుగునా పాట లోని ప్రతి పదానికి అర్థం ఇదే అన్నట్టు చిత్రీకరించిన పాట. రాజన్-నాగేంద్ర జంట సంగీతం సమకూర్చిన ఈ పాటకి వేటూరి గారు కాక ఇంకెవరు రాయగలరు? వేటూరి గారు ప్రేమకి నిర్వచనం. ఆయన వర్ణించినట్లు ప్రేమని మనం ఎక్కడ వినం, అనుభవించం. ప్రేమ గురించి ఆయన చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరేమో. అంత అత్యద్భుతమైన పాట ఇది. ప్రేమికులకి గొప్ప వరం అప్పటికి ఎప్పటికి ఏ నాటికి. భావుకత తన శరీరమంతా నింపుకున్న పాట ఇది. అంత భావం ఉన్న ప్రేమ పాటలు చాల తక్కువగా చూస్తాం. ఈ రోజుల్లో ఇంతటి తీయని మెలోడి ఇంక వినలేమేమో, ఇలాంటి స్వచమైన తెలుగు పాటలు మరల రావేమో..

ఇంక పాటలోకి వస్తే, అక్షరాలూ అత్యంత అద్బుతం గా పేర్చి కూర్చిన ప్రేమ మాల ఇది. జలపాతం లా సాగి మదిని అటు ఇటు కదిలించి ఊహ లోకం లో విహరింప చేసే పాట. చరణం లో అన్ని వాఖ్యలు "లే" తో అంతం అవుతాయి, ఇంక చరణం "మ" తో అంతం అవుతుంది. ఏదో ప్రాస కోసం రాసినట్టుగా లేకుండా అత్యంత అర్థవంతమైన అక్షరాలు పొదిగి మన్మధ బాణం విసురుతారు రసజ్ఞుల మీద. ఇంక ప్రేమ అనేది నిర్వచనం లేని అనుభూతి, వివరింపలేని అనుభవం. అందుకనే మనం అనేక రకాల వివరణలు చూస్తాం వింటాం. ఇన్ని రకాల సినిమాలు చూడగలుగుతున్నాం.  కొంత మంది (వేటూరి గారు) ప్రేమని వివరిస్తుంటే ఆ వివరణ ఒక మంచి అనుభూతి మిగులుస్తుంది. అందుకే కథానాయికా నాయకుడు ఒకరి దగ్గరకు ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు మనం కూడా పాటలోకి వెళ్ళిపోదాం.

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
పాట ఆరంభం లో రాజన్-నాగేంద్ర గారు మొదలు పెట్టిన తీరు చాల బాగుంటుంది. జంధ్యాల గారి చిత్రీకరణ సంగీతానికి తోడవుతుంది. చాల మంది నమ్మే ప్రేమ ఎప్పుడైనా ఒకరి చూపులు ఇంకొకరివి కలిసి, ఆ చూపులు భావాలు గా మరి, ఆ భావాలు మాటలు గా మారి, మాటలు అనుభూతులు గా మారి, అనుభూతులు అనుబందాలు గా మారి, చివరికి ఒకరి మనసు ఇంకొకరిది అయితే అదే ప్రేమ. కలకాలం నిలిచే అనుబందం. శరీరాలకి అతీతంగా మిగిలేది నిజమైన ప్రేమ. అందుకనే ఈ ప్రవాహాన్ని వేటూరి గారు ప్రక్రుతి సహజమైన తీరుతో పోలుస్తూ ఈ పాట రూపొందించారు. సముద్రం పురుషుడైతే, నది స్త్రీ  అవుతుంది. అందుకే స్త్రీ పురుషుడి కలయిక అలా పోలుస్తారు. పాట లో కూడా నేను సముద్రం అయితే నువ్వు నదివి అది మర్చిపోకు అని చేతి లో చెయ్యి వేయించుకుంటాడు కథానాయకుడు. నీ మమత తో నన్ను నీలో చేర్చుకొని ఆనందం తో ఉప్పొంగి పోయేలా చెయ్యి అంటాడు. నీరు ఆవిరై మబ్బు వాన గా మారినట్టు, ఆలోచనలు ఆవిరై అవి చూపులు అయినట్టు ప్రేమ చినుకులా రాలి, ఆ వాన నీరు నది లాగ మారి నది వరదై, సముద్రం లో నది కలిస్తే , సముద్రం ఆనందం తో ఉప్పొంగితే అదే ప్రేమ అంటారు వేటూరి. నా ప్రేమ కి వేరే నిర్వచనం లేదు నీ పేరు తప్ప, నా ప్రేమ అంటే నువ్వే. ఎంతటి చక్కటి నిర్వచనం చెప్తారు వేటూరి గారు ప్రేమ గురించి? జంధ్యాల గారు, నదిని సముద్రాన్ని చూపించారు కాని వానని చూపించలేదు ఎందుకనో?

ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

మరల ప్రకృతినే ఆశ్రయిస్తారు వేటూరి గారు ప్రేమికులకి ప్రేమిస్తున్నాము అని ఒకరికి ఒకరు అర్థం అయ్యేసరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్తితికి వస్తారు. ఆ విరహం లో ఆ ఆలోచనల వేడిమి లో కలిగే తాపం లో వచ్చే నిట్టూర్పులు ఎంత వేడిగా ఉంటాయి అంటే, ఆకులు రాలే కాలం లో వేసవి గాలి వేడి అంత.  మరి అంత వేడి, తాపం తగ్గేది ఎలా అంటే కుంకుమ పువ్వు పూసే పొద్దున్న లాగ ఉండాలి అని. కుంకుమ పువ్వు చాల తక్కువ కాలం ఉంటాయి అవి కూడా చల్లని ప్రదేశాలలో మాత్రమె పూస్తాయి. మరల కొంచెం వేడి తగిలినా ఆ పూలు పాడయిపోతాయి. అలాంటి చల్లదనం తో వచ్చే కుంకుమ పువ్వు తనకి ఇచ్చే బలం అతనికి ఓదార్పు కావాలి. ఎక్కడినించి ఎక్కడికి వెళ్లారు వేటూరి గారు? ఇంకా జన్మ జన్మల బందం మన ప్రేమ. నీ కోసం వేచి ఉంటాను అనటం సాధారణం గా ప్రేమికులు వాడే పదమే. కాని ఆ జన్మలు ఎలా ఉండాలి? ప్రేమలు కొరేవి గానే ఉండాలి. అందులోనే నీకోసం వేచి ఉంటాను అంటూనే, ఆ జన్మల తో సంభందం లేకుండా, అవి దాటి నీ దానిని అవుతాను అంటుంది కథానాయిక. సినిమాలో జంధ్యాల గారు కథానాయిక వేచి ఉండటం చూపిస్తారు. 
 హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా  

మరల ప్రేమ ప్రవాహం గురించి చెప్తారు ఈ సారి వేరే విధంగా, అది కూడా మల్ల ప్రకృతిని ఉదాహరణ గా తీసుకొని. మంచు కరిగి నదులు గా మారతాయి అని మనకి తెలుసు, అనేక నదుల ఉద్భవం హిమాలయాల మీద ఉన్న మంచు, అవి కరిగి నదులు అయ్యి, ప్రవహిస్తే, మొక్కలకు పువ్వులు పూస్తే, ఆ పువ్వుల నవ్వులు మనకి ఋతువులు గా కవ్విస్తే, ఆ పువ్వులనుంచి తేనే పొంగితే వచ్చే సహజ సౌందర్యం, ఆహ్లాదం ఆనందం నీ నా ప్రేమ. అది శరీరం శిధిలమైన కాని, కష్టాలు వచ్చిన కాని ఒకరికొకరి దూరం గా పోకుండా, ఒకరిని ఇంకొకరు విడిచి పెట్టకుండా ఉండేలాగా ఉండిపోవాలి అని కోరుకుంటారు ప్రేమికులు. ఈ పద ప్రవాహం కమనీయ సుందర కావ్యం, అదే వేటూరి సుందర కావ్యం.

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే   

మండు వేసవి తరువాత వచ్చే మొదటి వాన కోసం భూమి పరితపిస్తుంది, అలాగే మొక్కలు, చెట్లు, చేలు, ఆ వాన పడగానే అవి పులకరించి పోతాయి పరవశించి పోతాయి. మన్ను సువాసన వెదచల్లుతుంది. అలాంటి వాన అన్నింటి లో కొత్త శక్తిని నింపుతుంది. నేను కూడా అలాగే ఒక తొడిమ పువ్వు పూయటం కొరకు వాన కోసం వేచి చూసే లాగ నీ కోసం వేచి ఉంటున్నాను అంటుంది కథ నాయిక. నింగి నెల కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్య సమయాన రెండు ఎకమైనట్టు ఉంటాయి. నిన్న ఇవ్వాళ అయితే అదే రేపటికి వెన్నంటి ఉంటుంది ఇవ్వాళ. నీడ అవుతుంది అంటే సినెమా లో ఇక్కడ నీడ చూపిస్తారు జంధ్యాల గారు. రేపటికి నీడలా వెంటాడి ఆ పొద్దు సమయం లో నా ముద్దు తీరుతుంది లే అనే ఆశ అందుకనే ఇద్దరు కలిస్తే తీరం చేరినట్టే.   ఆ తీరాలు చేరాలిలే అని ఇద్దరినీ పాటలో కలిపేస్తారు.


మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి అనగానే, ఇద్దరినీ ఒక బోర్డు దగ్గర నిలబెడతారు జంధ్యాల గారు అందులో "Those who in love tell each other a thousand things without talking " అని చూపిస్తారు. నిజమే ప్రేమికుల చూపులలో కొన్ని వేల సందేశాలు, మాటలు దాగి ఉంటాయి, అవి వాళ్ళకే అర్థం అవుతాయి. మౌనమే గానము అవుతుంది ఆ గానం తో ఒకరిని ఒకరు పిలుచుకొంటే, ఆ తరువాత వచ్చే కళలు ఉప్పెన లా ఎగసి, ఆ అలల అలజడికి మనసి అలసి పొతే, ఆ అలసటని తీర్చటానికి నీ నా ప్రేమ తారడితే, ఈ ప్రపంచం అంటే మనమే, మన ప్రేమ తో నిండిపోయి అంతటా మనమే కదా అని ముగుస్తారు వేటూరి గారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు తనదైన శైలి లో.

కొసమెరుపు: ఈ పాట మొదట "రాజన్-నాగేంద్ర" గార్లు 1977కన్నడ సినిమా "Bayaludari" లో ఈ పాట చేస్తే కొంచెం మార్చి 1982 లో "నాలుగు స్తంభాలాట" కి మరల చేసారు. ఇదే పాటని 1992 హిందీ లో "ऐसी दीवानगी" అనే పాట గా    కాపీ కొట్టిన నదీం శ్రావణ్ కి ఫిలిం ఫెయిర్ అవార్డు రావటం విచిత్రం.

ఈ సినిమా తో సుత్తి అనే పదానికి సృష్టి కర్త అయ్యారు జంధ్యాల గారు, ఆ పదం ఇంటి పేరు గా మారింది, వేలు గారికి వీరభద్ర రావు గారికి.

Tuesday, February 7, 2012

Dhoni 2012 (Telugu) - Music Review

Dhoni is an upcoming Tamil/Telugu sports drama film written and directed by Prakash Raj. The film cast is Akash Puri and Radhika Apte, along with Prakash Raj. The film is about the conflict of interests of a father and his son; the father wants his son to study MBA, but his son is more interested in sports and wants to become a famous cricketer like Mahendra Singh Dhoni.
An inspirational movie with Sirivennela seetaramasastry as a single lyricists, Ilayaraja as music director and SPB singing a song will raise the bar so high that the music lovers will eagerly try to embrace the album. With all these positives, did the music meets the expectations? Did Ilayaraja provide musical feast? Did Sirivennela provide the lyrics that are expected?

This movie has 5 songs. However one song has male and female versions reducing the songs count to 4. This shows the formula of the movies of 6 and more is not followed and the songs are more kind of situational. Except one song all 4 song are sung by single singers.

Now lets look at the songs.
Endaaka Nee Payanam (M)
Artist(s): Sathyan
Lyricist: Sirivennela Sitarama Sastry
Typical Ilayaraja start of the song. Excellent chorus, the violins mesmerizes. Ilayaraja and chorus are unbeatable combinations. The flow between chorus and violin is marvellous. The soothing music and then the singer starting the song is fabulous. Sirivennela infuses thoughtful words to bring ths song to a different level. His thoughts are like gaalipatam, goes wherever he wants as long as it is controlled by him. In other review I was talking about how a melody should sound, it goes the way it is defined, Singer gets the focus and the music takes on when the singer stops. Perfect interludes for the song and when the singer takes control back, they silence off. How these words comes to Sirivennela's mind? తనకి ఉన్న తోడొక్కటే సన్ననైన ఓ దారం, నమ్ముకున్న అది తెగితే ఏది ఆధారం, ఏనాడూ కంచికి చెరక తిరిగే కథలా. The singer brings the emotion with his singing and his unique voice is apt for this song. The only issue is that when saying payanam, gaali patam he sounded tamil. Also ఆకారం has become ఆ కారం with a slight gap in between. This song will leave a mark to listeners.

Mattiloni Chettu
Artist(s): SP. Balasubramaniam
Lyricist: Sirivennela Sitarama Sastry

All the new age singers should listen to this song and learn on how to render a song. The way SPB carries the song effortlessly and brings in variations, expressions, energy and enthusiasm is unmatchable. He makes the song so pleasant that this song disappoints us that it is over so soon. Wish it has one more stanza. Ilayaraja could have done this type of song many times before but this songs still looks as fresh as one can imagine. Ilayaraja's guitar cannot sound any better than this. SPB and Guitar go hand in hand and a feast to hear. Simple orchestration, but does get the entire effect. Rhythm does bring the needed effect on the song. Yet another song that remains haunting us to keep us humming. Sirivennela again writes yet another song perfectly.

Endaaka Nee Payanam (F)
Artist(s): Surmukhi
Lyricist: Sirivennela Sitarama Sastry

Female version of earlier song sung by Sathyan. She exactly delivers what is needed. Both versions compete each other but the result is same, we will want to hear again for the content, tunes and singing. 
Gayam Tagili
Artist(s): Illayaraja
Lyricist: Sirivennela Sitarama Sastry

Typically I will not appreciate any Music director singing himself any song. Ilayaraja had sung many songs which I like, and many songs I dont like, Sometimes I dont like the telugu he sings, but not much to complain about this song. This song did suit Ilayaraja.  Sirivennela brings yet another meaningful lyrics for this song. Ilayaraja sings exactly what is required for this song and his voice brings special effect on the song. Ilayaraja is master to tune this type of songs and he does effortlessly.


Chitti Chitti Adugaa
Artist(s): Naresh Iyer, Shreya Ghoshal
Lyricist: Sirivennela Sitarama Sastry

Not sure why Shreya Ghosal is hyped so much and given so many chances in Telugu. How great her voice is doesnt matter, she cannot sound Telugu and cannot sing Telugu, Inspite of singing past more than 6-7 years, she still doesnt sound Telugu. Its better for Telugu sake, somebody stop her singing telugu songs, though it might sound too harsh. She single handedly ruined many songs, and she does the same again,

Ilayaraja tunes are fantastic but atleast Naresh Iyer should have got more chance and Shreya ghosal could have been limited to chorus or one or two lines repeating Naresh. Alas!!!! this song is ruined.

Pick(s) of the Album: Mattiloni Chettu, Endaaka Nee payanam(both versions), Gaayam tagili

The songs of this movie are not regular commercial songs. These songs will not appeal the masses. These are for Ilayaraja fans and Seetaramastry's fans as they steal the show for this album. Aso those who has an ear to soft and slow melodies(music). This songs will  definetely help the movie to carry the emotions in the situations and elevate the scenes to a new level. This kind of music has been the core strength of Ilayaraja and he does it again for nth number of time. Sirivennela maintains his standards of lyrics.

Friday, February 3, 2012

Song of the week - Kaliki Chilakala koliki

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:             సీతారామయ్యగారి మనవరాలు
Producer:                             V.M.C. Productions
Director:                   క్రాంతి కుమార్
Music Director:                   కీరవాణి MM
Singer(s):                            చిత్ర
Lyrics:                                  వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:                 1991
కలికి చిలకల కొలికి మాకు  మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)

అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి 
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి) 

ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి  కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి) 

మసకబడితే నీకు మల్లెపూదండ 
తెలవారితే  నీకు  తేనే నేరెండ
ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు 
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)

 గడచిన వారం సీతారామయ్య గారి మనవరాలు సినిమా లోని పూసింది పూసింది పున్నాగ గురించి రాయటం జరిగింది. ఈ సినిమా లో వేటూరి సుందరరామ మూర్తి గారు రాసిన అన్ని పాటలు మణి మాణిక్యాలే. అయన రాసిన ఈ "కలికి చిలకల కొలికి" పాట ఆడవాళ్ళ హృదయాలనే కాదు అందరి హృదయాలను కదిలుస్తుంది. ఆయన రాసిన తీరు చూస్తె అందరిని సున్నితం గా మందలించటమే కాదు, ఒక కోడలు ఎలా ఉంటుందో, ఆమె అత్త వారింట్లో పడే కష్టం, పుట్టింటి కోసం వాళ్ళు ఎప్పుడు ఎలా ఎదురు చూస్తారో తెలియచెప్తుంది. అంతే కాదు సీత ఎవరిని ఎలా అడగాలో, ఎలా అడిగితె తన అత్తయ్య ని తనతో పంపిస్తారో అలా అడిగిన విధానం మహాద్భుతం గా చెప్పటం జరుగుతుంది. ఇంతలా ఒక్కొక్కరిని కదిలించి రెండు కుటుంబాలు తిరిగి కలిసే లాగ చేస్తుంది. సినిమా లో సీత పాత్రని చాల గొప్పగా చూపించటానికి ఈ పాట చాల దోహద పడుతుంది. సీత సీతారామయ్యగారి మనవరాలి గా సాధించిన అనేక విజయాలలో ఇది ఉత్తమ స్థానం లో నిలిచి పోవటానికి దోహద పడుతుంది.

సినిమా లో ఈ పాట ముందు జరిగిన సన్నివేశాలు చూస్తె, సీతారామయ్యగారికి, ఆయన వియ్యంకుడికి ఏదో స్థలం విషయం లో వివాదం మొదలు అవుతుంది. గ్రామ పెద్దగా ఆ స్థలం ఇవ్వటానికి సిద్ధపడరు సీతారామయ్య గారు. కాని అదే కావాలని మంకు పట్టు పట్టిన వియ్యంకుడు గర్భవతి అయిన తన కోడలు, సీతారామయ్యగారి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెల్లిపోవటానికి సిధపడతాడు. అప్పుడు ఆ అమ్మాయిని ఆపకుండా, పెళ్లి అయిన తరువాత ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటమే సమంజసం అని పంపించేస్తారు సీతారామయ్య gaaru. ఆ మాట పట్టింపుతో రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్ళకుండా ఉండి పోతారు. అమ్మాయిని కూడా తన పుట్టింటికి వెళ్ళకుండా కట్టడి చేస్తారు. ఈ విషయలేమి తెలియని సీత వాళ్ళింటికి వెళ్ళటానికి సీతారామయ్య గారి అనుమతి తీసుకొని కాశితో కారులో బయలుదేరుతుంది. దారిలో ఈ విషయాలన్నీ సీతకి చెప్తాడు కాశి.  ఆ ఇంట్లో అందరి తోనూ కలసి పోయి సరదాగా మాట్లాడుతూ తన అత్తయ్య తో పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది సీత, ఆ ప్రశ్నకి బాధతో నాకు రావాలనే ఉందమ్మ, కాని అత్త మామలు అంటూ సమాధానం చెప్పకుండా దాటేస్తుంది అత్తయ్య. కాని విషయం తెలిసిన సీత ఆ ఇంట్లో అందరిని అత్తయ్యని తన ఇంటికి పంపమని కోరుతూ పాట ఆరంభిస్తుంది. 

కీరవాణి గారికి చాల పేరు తెచ్చిన సినిమా ఇది. అలాగే చిత్ర కి కూడా. సినిమా లో పాత్ర నిజం గా పాడుతున్నట్టు ఒదిగిపోతుంది ఆమె గాత్రం. ఈ పాటకి చిత్ర కి రాష్ట్ర పురస్కారం లభించింది. ఈ పాట లో చిత్ర గారు పాడిన విధానం చాల అద్భుతం. అందుకనేనేమో సినిమాలో అన్ని పాత్రలు కరిగి కోడలిని పుట్టింటికి పంపించేస్తారు. ఇంక ఈ పాట ని చిత్రీకరించటం లో సఫలం అవుతారు దర్శకులు. పాటకి దగ్గరగా ఉంటుంది ఈ చిత్రీకరణ.

ఈ పాటను చిత్రీకరించిన ఇల్లు చూస్తె తెలుగు వారి ఇంటికి ప్రతీక. అందుకే ఈ పాట ఎప్పుడు చూసిన అందరికి ఏవో అనుభూతులు తిరిగి గుర్తు రాకుండా ఉండవు. ఒకరికి ఒకరు జడలు వెయ్యటం, రోట్లో దంచటం, వేలు నలిగితే నోట్లో పెట్టుకోవటం, పూలు దారం తో మాలగా చెయ్యటం, మండవా లోగిలి, స్తంబాలు, ముఖ్యం గా ఊయల. తెలుగు తనం అడుగడుగునా నిండి ఉన్న పాట. పాట పక్కన పెడితే ఇప్పుడు ఇవ్వన్ని ఏమయిపోతున్నాయో అనే ఆలోచన మిగిల్చే పాట.
ఇంక పాటలోకి వెళ్తే వేటూరి గారు వేసిన పాటల పందిరి లో మనం కూడా కొంచెం సేపు అటు ఇటు నడిచి కొంత  ఆహ్లాదం పొందుదాము.

కలికి చిలకల కొలికి మాకు  మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి (కలికి)
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు  ఎరుగని  పసి  పంకజాక్షి 
మేనాలు తేలేని మేనకోడల్ని అడగవచ్చా మిమ్ము అడకుతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య మా ఇంటికంపించవయ్య మావయ్య ఆ ..ఆ ..(కలికి)  
ఎప్పుడైనా ఇంటికి పెద్ద తో మొదలు పెట్టటం సాంప్రదాయం. ఇంటికి పెద్ద ఎవరు, ఆ మామయ్య కి తండ్రి అయిన తన తాత గారు. కాబట్టి ఆయనతోనే మొదలు పెడితే సరి. కాని ఆయన్ని ఎలా అడిగేది? దానికి సమాధానం కూడా చెప్తారు వేటూరి గారు. తన అత్తయ్య ఎలాంటిదో ముందు ఆయనకి చెప్పి కొంచెం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి, మా అత్తయ్య కూడా తక్కువేమీ కాదు మా ఇంటికి పంపించవయ్య అనటం లో వేడుకోలు ఉంది, లాలిత్యం ఉంది, సున్నితత్వం ఉంది, పొగడ్త ఉంది. ఇన్ని కలబోసి మొదలు పెడతారు వేటూరి గారు. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, అంటే తన అత్తయ్య వనితలకే తల మాణికం, అందునా మీ లాంటి కలవారి కోడలు, సీతారామయ్య గారి కూతురు సాక్షాత్తు లక్ష్మి దేవి, ఇంత మంచి ఉన్నతురాలైన అత్త మామలని దైవం గా కొలుస్తూ, అందరికి అణిగి మణిగి ఉంటూ ఆ ఇంటికే మహాలక్ష్మి అయిన అందమైన మా అత్త, పుట్టిల్లు ఎరుగదు. వేటూరి గారి పదాల అల్లిక ఎంత అందం గా మారుతుందో అత్తయ్య ని వివరించటానికి వాడిన పదాలు చూస్తె తెలుస్తుంది, కలికి చిలకల కొలికి, కనకమాలక్ష్మి, అందాల అతివ, పసి పంకజాక్షి. ఇంత ఉన్నతమైన స్త్రీ మీకు సేవ చేస్తోంది, ఐన మీరు ఆమెకి పుట్టిల్లు ఎరుగకుండా చేస్తున్నారు మీకు భావ్యమేనా అనే ప్రశ్న వేస్తున్నట్టు ఉంటుంది. ఇంక సీత అడుగుతోంది అత్తయ్య తరుపున, మీకు నేను ఏమి ఇచ్చుకోలేను, మేనాలు తేలేను, ఆడ కూతురిగా అడుగుతన్నాను ఆ ఇంటి కోడలి గా అడుగుతున్నాను, సీతమ్మ లాంటి మా అత్త మీ ఇంట్లో ఉంటోంది, వాల్మికినే మించిన వాడివి తాతయ్య, ఇంకా ఆ అమ్మని మా ఇంటికి పంపించవయ్యా,, అంత ఉదాత్తం గా అడుగుతుంటే ఎవరి గుండె కరుగదు? వేటూరి గారి కవిత్వానికి చలించని హృదయాలు ఉంటాయ? ఉండలేవు. ఇక్కడ వేటూరి గారు మేనకోడలి కోసం మేనాలు అని వాడారో, మేనాలు కోసం మేనకోడలిని వాడారో కాని ఎంతో అందం గా ఉంటుంది ఆ వాఖ్యం.
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి  కోడలివే
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మా చంటి పాపను మన్నించి పంపు (కలికి)  
సరే తాత గారు అయ్యారు ఇంకా ఇంట్లో రెండొవ పెద్ద అత్తకి అత్తగారు, సరే ఇంక అక్కడికి వెళ్తారు వేటూరి గారు. దర్శకులు కూడా పాటకి అనుగుణంగా సాగుతారు. ఒక్క సారి ఇంట్లోకి కోడలు అడుగు పెడితే పని అంతా కోడలిది, పెత్తనం అంత అత్తగారిది. అప్పటి వరకు ఇంటికి కావాల్సినవి అన్ని చేసిన అత్త గారి పనులన్నీకోడలు చెయ్యటం మొదలు అవుతుంది. అలాగ అత్తగారి రెండు చేతులు అయి మసలుకుంటుంది కోడలు. కాని ఏ మాట వచ్చిన ముందు అనేది పెద్ద కోడలినే. చిన్న కోడళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం కనికరం ఉంటుంది. అందుకే పెద్ద కోడలు పని చాల కష్టం ఎవరింట్లో ఐన. మొత్తం కుటుంబం లో జరిగేవి అంత సుళువుగా చెప్పేస్తారు వేటూరి గారు. అలా చెప్తూ చిన్నగా మందలిస్తూ ఆలోచన రేకేత్తిస్తారు అత్తగారికి. ప్రపంచం లోని అత్త కోడళ్ళ మద్య ఉన్న కలహాలు కాని మనస్పర్థలు కాని, వేటూరి గారు చెప్పిన ఈ ఒక్క విషయం పాటిస్తే చాల తగ్గుతాయేమో. ఒక అత్త తను కోడలిగా  ఎంత అనుభవించిందో అది గుర్తు ఎరిగి మసలు కుంటే, తర తరాలు మధ్య అంతరాలు తగ్గుతాయేమో. నేటి అత్తమ్మ నాటి కోడలివే, తెచుకో మాయమ్మ నీవు ఆ తెలివి అని ఎంత సున్నితం గా హేచ్చరిస్తారో ( ఇక్కడ దర్శకుడు ఆ పాత్ర ఆలోచన లో పడినట్టు చూపిస్తారు), అల అంటూనే మా అత్త నీ తలలో నాలిక లాగ ఉంది, అంటే అత్త మనసు ఎరిగి మెదిలే కోడలు మా అత్త, నీ ఆలోచనలని తన మాటలతో చేతలతో నిన్ను తల్లిలాగా చూసుకుంటోంది. అలాగే పూలు ఎన్ని ఉన్న దండ కావాల్సి వస్తే దారం కావాలి, ఇంక కుటుంబం లో ఎంత మంది ఉన్న ఆ కుటుంబం సవ్యం గా నడవాలి అంటే మా అత్త లాంటి కోడలు కావాలి, మా అత్త అంత కంటే సేవ చేస్తోంది మీ కుటుంబానికి. తన కాపురం చేసుకుంటున్న తన అత్త మమల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటోంది, ఇంక మీకు ఏమి కావాలి, ఆ అత్త ఎంత ఎదిగిన మాకు ఇంకా మా ఇంటి పాపే, అలాగ ఇన్ని సుగుణాలున్న మా అత్తని ఇంకా ఏమైనా తప్పులుంటే మన్నించి మా ఇంటికి పంపించు అని హృద్యం గా అడుగుతుంది సీత. 

మసకబడితే నీకు మల్లెపూదండ 
తెలవారితే  నీకు  తేనే నేరెండ
ఎడుమల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు 
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకోమనసున్న మామ సయ్యోధ్యనేలేటి సాకేతరామా (కలికి)
ఇంక వేటూరి గారు మిగిలిన మామ దగ్గరకి వెళ్తారు, మనం కూడా వెళ్దాం, అడుగుదాం. ఏమని అంటే వేటూరి గారు ఏమంటే అదే. మగవాడు పగలు ఎంత బెట్టు చూపించినా ఎంత పట్టు చూపించిన చీకటి పడితే అంతా మారిపోతుంది. శృంగార విషయం సున్నితమైన, చాటుగా చెప్తారు, ఎంతైనా అల అడుగుతున్నది అమ్మాయి కదా, అందుకనే ఆ పదాలు, మల్లె పూదండ, తేనే నీరెండ వాడతారు. భార్యకి ఉన్నలక్షణాలు అన్ని మా అత్త లో ఉన్నాయి,  ఏడు మల్లెలు సరి తూగుతుంది మా అత్త అంటే, అంత స్వచ్చమైన, సున్నితమైన మా అత్త, నీకు ఎన్నో జన్మల నోముల పంట. ఎంత పేరు తెచ్చుకున్న, ఆడదాని మనసు ఎప్పుడు పుట్టింటి కోసమే పరితపిస్తుంది. ఈ విషయం తెలుసుకో రాముడి లాంటి మామ, అనటం లో మా అత్త సీతమ్మ లాంటిదే అని చెప్పటమే. ఇంకో విషయం ఇక్కడ మామ కి సలహానే ఇస్తుంది కాని పంపించ మని అర్థించటం ఉండదు ఈ చరణం లో. అదే వేటూరి గారి చమత్కారం. ఒక కుటుంబం లో ఎవరిని ఎలా అడగాలో అన్న విషయం కూడా చెప్పినట్టు అయ్యింది. ఇంటికి పెద్దాయనని అడగొచ్చా అంటూనే అడుగుతారు, ఇంక అత్తగారిని మన్నించమని అడుగుతారు, చివరిగా మామకి సలహా మాత్రమె. ఇంతటి ఆలోచనలతో కూడిన పాటని రాయటానికి ఎంత సమయం తీసుకున్నారో? మొత్తం కథ, కథనం తెలిస్తే కాని, అది తెలిసి సందర్భోచితం గా రాయటం సామాన్యమైన విషయం కాదు.

ఇంతటి సందర్భోచితమైన పాట అందున ఇంతటి ఉన్నతమైన భావం, సరళమైన పదజాలం తో అందరిని ఆకట్టుకునేల చేయ్యగాలటం ఒక్క వేటూరి గారికే సాధ్యం అనిపిస్తుంది. వేటూరి గారు రాసిన కొన్ని పాటలతో ఆయనే మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న వాళ్ళు చాల మంది ఉన్నారు కాని, ఇలాంటి పాటలు వింటుంటే అందరు అనేది నిజమే, ఆయన కాలానికి అన్ని వైపులా పదునే. సిని విలాకాసంలో ఒక చంద్రుడే. 


కొసమెరుపు 
ఈ  సినిమా లో ఇంక మిగితా పాటలు కూడా ఒకదానికి ఇంకోటి పోటి పడతాయి. వెలుగు రేఖల వారు, సమయానికి తగు పాట, కూడా ఎంతో అద్భుతం గా రాసారు. ఇంక మాయాబజారు లోని "సుందరి నీ వంటి" కి పెరోడి గా " సుందరి నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు సెర్చిన లేదు కదా" అన్న కామెడీ పాట కూడా అదే సుందరం గా రాసి తన నామదేయానికి సార్థకత చేకూరుస్తారు వేటూరి సుందరరామమూర్తి గారు.