Saturday, March 3, 2012

Song of the week - Ee Kshanam oke oka korika


ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)

Movie Name:        ఎలా చెప్పను
Producer:                  స్రవంతి రవి కిషోర్
Director:                    BV రమణ
Music Director:          కోటి 
Singer(s):                  KS చిత్ర 
Lyrics:                      సిరివెన్నెల సీతారామశాస్త్రి 
Year of Release:       2003

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా 

ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంద
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది 
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది 
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక 
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||

రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి  తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం || 

ప్రతి మనిషి జీవితం లో మాటకు అందని భావోద్వేగాలు అనేకం. తను పడుతున్న ఉద్వేగం,ఆరాటం, తపన   కష్టం ఇవన్ని ఇతరులకి తెలియచేయటం చాల కష్టం. అటువంటి భాషకు అందని భావాలు సినిమాలో చూపించటం అసాధ్యమైన పని. ఇలాంటప్పుడే సాహిత్యం పాట రూపంలో తోడు అవుతుంది. అందుకే అంటారు మాట   కరువయినప్పుడు పాట ఆరంభం అవుతుంది అని. కాని ఒక్కోసారి పాట కూడా సరి అయిన భావం తెలియచేయ్యలేక పోవచ్చు, అటువంటి అప్పుడు సంగీతం ఆ భావాన్ని అంద చేస్తుంది. ఈ రెండు తోడయినప్పుడు ప్రేక్షకుడి హృదయం కరిగితే, సంగీతం, సాహిత్యం సఫలీకృతం అయినట్లే. అటువంటి సందర్భానుసారమైన పాటలలో ఈ పాట ఒకటి. పది సరళమైన వాఖ్యలతో మనిషిని అంతులేని భావోద్వేకనికి గురిచెయ్య గలిగిన ఈ పాట    విన్నప్పుడు తెలుగు ప్రేక్షకుడి కంట ఒక్క చుక్క కన్నీరు కారక మానదు.

సిరివెన్నెల గారు నిశీధి వేళలో పాటలు రాస్తారు అని చాల మందికి తెలుసు, అందుకనేనేమో సిరివెన్నెల అయ్యారు. చీకటి వేల వచ్చే చందమామ కురిసేది వెన్నెలే, అందులో పండు వెన్నెల కాంతి బంగారం. ఇటువంటి పాటల సిరులు వెన్నెల రూపం లో రాత్రి వేల కురిపించే సీతారామ శాస్త్రి గారికి సిరివెన్నెల ఇంటి పేరు అవటం చాల సమంజసం. ఎంతో అర్థత నిండిన సాహిత్యానికి కోటి స్వరాల కోటి, సందర్భానికి ఆ సాహిత్యం అర్థం  అయ్యి ఆ అర్థం ప్రేక్షకుడికి చేరేలా సంగీతం సమకూర్చటం ఈ పాటతో తెలుగు ప్రేక్షకుడికి లభించిన వరాలు కోటి.  ఇంక చిత్ర గారి స్వరం లో పలికిన భావం అనితర సాధ్యం అనిపిస్తుంది. పాత్రకి ఒదిగి పోయిన స్వరం అందరిని ఆకట్టుకుంటుంది అనటం లో సందేహం లేదు. 

ఈ సినిమా కి వస్తే శేఖర్ ( కథానాయకుడు ) IIM లో చదివి అవార్డు విన్నింగ్ బిసినెస్ మాన్. తక్కువ సమయం లో ఎంతో ఉన్నతమైన స్తితికి ఎదిగిన ప్రతిభావంతుడు. అతనికి అమర్ వర్మ అనే NRI  (జర్మనీ లో  వర్మ ఇండస్ట్రీస్ అధిపతి )  పరిచయం అవుతాడు. అమర్ శేఖర్ కి తన కంపెనీ లో ఉద్యోగానికి అవకాశం ఇస్తానని మాట ఇస్తాడు. కాని విధి వైపరీత్యం వల్ల, అనుకోని సంఘటనలో శేఖర్ చేసిన కారు ప్రమాదం లో      అమర్ వర్మ చనిపోతాడు. శేఖర్ స్నేహితుడు సునీల్ చేసిన సహాయం వల్ల శిక్ష లేకుండా బయట పడినా పశ్చాత్తాపం తో కుమిలి పోతాడు శేఖర్. ఇంక తన వల్ల కాక సునీల్ తో పాటు జర్మనీ బయలు దేరతాడు. అక్కడ అమర్ వర్మ ఇండస్ట్రీస్ అప్పుల్ల్లో కూరుకు పోయి మూట పడే స్తితి కి వస్తుంది. వర్మ ప్రేమించిన ప్రియ అమర్ ఇండస్ట్రీస్ నడుపుతూ అటు ప్రియుణ్ణి కోల్పోయి, ఇటు కంపనీ మూత పడే స్తితి లో నిస్సహాయమైన స్తితిలో చూసి శేఖర్ ఏమి చేస్తాడు, చివరికి కంపనీ, ప్రియ ఏమి అవుతారు అనేది కథ. ఆ ప్రమాదం విషయం ఎలా చప్పుడు అన్నది తేరా మీద అంశం.

BV రమణ ఈ పాట ద్వారా అమర్-ప్రియల ప్రేమని సినిమాలో తెలియ చేస్తారు, ఆ తరువాత ప్రియ పడే తపన, ఎడబాటు వల్ల ప్రియ లో కలిగిన ఆవేదన చూపించటానికి వాడుకున్నారు సినిమాలో. శేఖర్ జర్మనీ వెళ్లి అమర్ కంపనీ లో చేరిన తరువాత ఒక టెండర్ విషయం లో చొరవ తీసుకొని వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసేలా చేస్తాడు. ఆ సంతోష సమయం లో అమర్ గుర్తుకు వస్తాడు ప్రియకి, అప్పుడు అమర్ ఫోన్ నుంచి తనకు ఫోన్ చేసుకొని అమర్ ఫోటో చూస్తూ ఆ ఫోన్ రింగ్ కి అమర్ ని తలచుకుంటూ పాట ఆరంభిస్తుంది ప్రియ...

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తీయగా (2 )
తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడునావు అంటోంది ఆశగా

తను అత్యంత ఇష్టం గా ప్రేమించిన మనిషి తాత్కాలికంగా దూరం అయిన ఎడబాటే అత్యంత కఠినం. అటువంటిది శాశ్వతం గా దూరం అయితే ఒక స్త్రీ పడే వేదన ఎంత కష్టమైనదో చూసే వాళ్ళకి అంత తొందరగా అర్థం      అవ్వదు స్వయం గా అనుభవిస్తే తప్ప. అటువంటి మానసిక స్తితిని వేరే వాళ్ళకి తెలియ చెప్పటం చాల కష్టం. ఈ పాట చూస్తె సిరివెన్నెల గారు కఠినమైన పదాలు ఎక్కడ వాడలేదు. కాని ఆ భావం అద్బుతం కళ్ళకి       కట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ప్రియకి తెలుసు అమర్ ఇంక ఈ ప్రపంచంలో లేడు అని, కాని జ్ఞాపకాలు మరచి  పోయటం  చాల కష్తమైన పని. ఎవరికైనా సంతోషం కాని దుఖం కాని వచినప్పుడు తనకు ప్రియమైన వాళ్ళని తలచుకోవటం సాధారణం గా చేసే పని. అలాగే కంపనీకి జరిగిన మంచి అమర్ కి చెప్తూ అతని నుంచి ఏదో వినాలని ప్రియ అనుకోవటం ఈ పాట ఆరంభం. అమర్ తిరిగి రావాలని అనుకోవటం అనే విషయం తరువాత అయిన ఇప్పుడు మాత్రం నీ తీయటి గొంతు వినాలని తప్ప వేరే ఏ కోరిక లేదు నాకు అని "ప్రియ" అనటం ఆ వాఖ్యానికి కోటి గారు, చిత్ర గారు అద్దిన సుందరమైన స్వరాల సుమాంజలి హృదయాలని కరిగించక మానవు. అనంత తీరాలకి వెళ్ళిన అమర్ ఎంత దూరం లో ఉన్నాడో తెలియదు. అయినా ఆ దారి తెలిస్తే అందరు తన వాళ్ళని వెతుక్కొని రావచ్చు     వాళ్ళని కలవచ్చు అందుకనే భగవంతుడు ప్రపంచం నుంచి తీసుకెళ్ళే వాళ్ళని మనకి తెలియని చోటికి తీసుకొని వెళ్తాడు, తెలిస్తే మనం వెళ్లి తెచ్చేసుకుంటాము అని. ఆ తెలియని దారులలో ఎంత దూరం వెళ్తే, వెళ్తే దూరం తరుగుతుంది? ఇది తెల్సిన "ప్రియ" మనసు ఆశగా ఎక్కడున్నాడో తన అమర్ అనుకుంటుంది. ఎంత అద్భుతమైన భావం? 


ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది 
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది 
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది 
మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక 
ఆరాటంగా కొట్టుకున్నది || ఈ క్షణం ||

ఎడబాటు తెల్సిన వారికి తెల్సు నిమిషం గడవటం ఎంత కష్టమో, ఒక్కో క్షణం ఒక యుగం అవుతుంది. కలిసే వరకు నిమిషాలు లెక్క పెట్టుకోవటం మామూలే, కాని ఇలా తిరిగి రాని లోకాలకి వేల్లోపోయిన అమర్ కోసం ప్రియ  పడుతున్న మానసిక సంఘర్షణని అడుగడున తెలియచేస్తారు సిరివెన్నెల. రాదు అని తెల్సిన మనసు పడే ఆవేదన, తనని కలవచ్చు అనే ఆశ ఈ చరణం. తనను ఒంటరి గా వదిలి వెళ్లి పోయాడు అని అంగీకరించని మనసు, అతను తిరిగి వస్తాడు అని వేచి చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటోంది. కాని అది ఎంతసేపు అని చెప్పవేంటి? అయిన నువ్వు  నన్ను వదిలేసి వెళ్లి ఏంటో సేపు అవ్వలేదు గా, ఆరు నెలలు అయిన అది నిన్ననే జరిగినట్లు ఉంది, నిన్ను చూసే దాక నా మనసు స్తిమితం లేక ఆరాటం తో అటు ఇటు పరిగెడుతోంది, అందుకనే నీ స్వరం ఒక్కసారి వినిపించవు అని దీనం గా కోరుకోవటం చాల ఉదాత్తం గా ఉంటుంది. దర్శకుడు కూడా అమర్ తో ప్రియ గడిపిన క్షణాలని చూపించి ఆమె పడుతున్న సంగర్షణ ఆవేదన చూపిస్తారు సినిమాలో.

రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి  తలచుకొని
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది || ఈ క్షణం || 

ఇంకా అదే ఆలోచనలతో కొనసాగుతుంది ఈ పాట. మరల తన మనసు ఏమను కుంటుందో అమర్ కి తెలియ   చెప్పే తపన. మనసు పడే ఆవేదన, ఆ ఆరాటాన్ని తగ్గించటం చాల కష్టమే. కలిసిన తీపి క్షణాలు, చిలిపి చేష్టలు, ఇవన్ని గురుతుకు వచ్చి మనసులోని ఆలోచనలు తగ్గటం లేదు, ఒక్క క్షణం కూడా తగ్గటం లేదు, నిద్ర పొతే ఆలోచనలు తగ్గుతాయి, కాని ఆలోచనలే ఆగనప్పుడు నిద్ర ఎలా పడుతుంది, అందులో ఏదో         చేసెయ్యాలి  అన్నప్పుడు నిద్ర దరిదాపుల్లోకి రాదు. అందుకనే ఈ దూరం వాళ్ళ కలిగిన ఎడబాటు లో ఏదో అమర్ వస్తే ఏదో చెప్పాలి, ఏదో పంచుకోవాలి అని ఆతర పడే మనసుకి విరామం ఒక్క అతను వచినప్పుడే     కలుగుతుంది. అందుకని వచ్చిన తరువాత నచ్చ చెప్తే, ఆ తరువాత మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తే కాని మనసు తేలిక పడదు, కాబట్టి నువ్వు వచ్చి నీ తీయని స్వరం వినిపించమని వేడుకుంటుంది "ప్రియ".

అద్బుతమైన భావం తో పాట రాసిన సిరివెన్నెల గారు, అత్యంత మధురం గా స్వరపరచిన కోటి గారు, ఈ పాటకి అంతే న్యాయం చేకూర్చిన చిత్ర, వీళ్ళు సిని చరిత్రలో ఈ పాటతో చిరాయువు ని పొందారు.

కొసమెరుపు: ఈ సినిమా మాతృక హిందీ సినిమా "तुम बिन". ఈ సినిమాకి బలం సంగీతం, మనసు కదిలించే పాటలు. సిరివెన్నెల, కోటి ఈ సినిమాకి గొప్ప వరం, పెద్ద బలం. ఈ సినిమాలో ఇంకో పాట అప్పుడప్పుడు కదిలించి వెళ్ళిపోయే పాట "మంచు తాకిన ఈ వనం".


Saturday, February 25, 2012

Nuvva Nena - Music Review

Movie:  Nuvva Nena
Cast :  Allari Naresh,Sharwanand,Shriya Sharan,Vimala Raman
Director :  P Narayana
Music Director :  Beems 
BGM: Mani Sharma
Producer :  Vamsikrishna Srinivas

Actors Allari Naresh and Sharwanand, who first appeared together in the critically acclaimed Gamyam which went on to win the Nandi Award in 2008, are back. After three years, they are playing the heroes in director P. Narayana's Nuvva Nena, a complete entertainer produced by Vamsi Krishna. Gamyam won best lyricist award for Sirivennela Seetaramasastry along with the movie. That story was different. Not sure what this movie is about. This movies casts Shriya and Vimala Raman and is set to be released in March.  Beems is the music director of the film and Mani Sharma is composing the background score. In Thaman's wave it was hard to listen other music directors name  recently and for a change Beems is the music director. This film as Naresh mass and Sharwanand know in city audience. So the music guess would be that this would a perfect mix of mass, melody which makes difficult stage for Beems. Lets see how he utilizes. The music is released on 18th February 2012 and has standard six songs.

01 - Blackberry 
Singer(s): Kailash Kher
Kailash Kher constantly gets chances in Telugu. This song starts in typical style that perfectly suits him. The lyrics are mostly non-Telugu even its Telugu we don't need to focus and pay attention much, so he does complete justice to the song. He has a different voice and if rightly used, he brings a lot of value to the song. Beems did exactly the same. This song has all the elements, Beems perfectly mixes them rightly, that makes mass dance to this tune. The beats are good so are the instruments which go along with the song. Gone are those days where the songs started with strawberry and other fruits. Now is the modern age, gadgets have become target of lyricists. To sync with berry, Halle Berry made into this lyric.

02 - Ayomayam 
Singer(s): Ranjith,Suchitra
The tune of this song is a routine and standard. Beems doesn't deviate much for this song. Singers did their job as required, however there is nothing much in this song to make it big. 

03 - Tha Tha Thamara 
Singer(s): Neha Bhasin,Sriram Chandra
This song reminds of couple of other songs, Beems brings variations to make it look different. Neha Bhasin shines in between but is not consistent. Her voice is different which brings in some vibrations however she had voice strained at places. We can hear that and feel it. Sriram sounded all togather different. Beems brings in some good interludes which adds to the song. Overall a good attempt by  Beems if Female singer did perfect justice by putting some more effort to the song and sung it effortlessly, it would have been in a different league. Need to see who gets this song in movie, will it be Sharwanand or Naresh. 

04 - Oy Pilla  
Singer(s): Karunya
We might have heard many similar songs. Though this tune from Beems doesn't sound fresh, Karunya is all the difference to this song. His effortless singing is all makes us to listen this song. Not sure why he doesn't get many chances. Only Manisharma and Koti likes of directors gives one or two songs to him, good to see Beems too add to the list. Catchy, fast paced and a peppy dance number. This is for sure a song will be a repeat in Radio. Trailer shows its on Naresh and Shriya and looks promising dance number. 

05 - Polavaram  
Singer(s): Naveen,Kalpana
Again another routine song. Naveen Kalpana did their job well. Song goes all so so.. Nothing much to say about this song.


06 - Neeli Neeli  
Singer(s): Haricharan
Here comes the melody number. Haricharan is another promising singer.  Beems fills the song with good melody. Thought little slow tempo would have been better. Singer voice also could have been left open. Chorus was different. Best lyric in this album obviously this song demands such. 

Pick(s) of the album: Blackberry, Oy Pilla, Tha tha thamara, Neeli Neeli.

Beems delivers a decent album and tells that he is here to stay for long time and deliver. Though Naresh or Sharwanand's movies doesn't demand rich or superficial music content, this movie gets a decent music from  Beems. Hope this adds value to the movie along with story content and performances from the lead actors.

Friday, February 24, 2012

Song of the week - Pandu Vennello ee venugaanam

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:        జానకి weds శ్రీరామ్
Producer:                  S. రమేష్ బాబు
Director:                    అంజి శ్రీను
Music Director:     ఘంటాడి కృష్ణ
Singer(s):                  టిన కునాల్
Lyrics:                       సిరివెన్నెల సీతారామశాస్త్రి

Year of Release:       2003

పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను  నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక      || పండు వెన్నెల్లో ||
కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి కరిగేలా
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా                                                                         || పండు వెన్నెల్లో ||

జానకి వెడ్స్ శ్రీరామ్, సినిమా లోని ఈ పాట సిరివెన్నెల గారు రాసిన సందర్భోచితమైన మరొక్క పాట. ఆయన ఏ పాట రాసిన సందర్భానికి సరిగ్గా సరిపోతుంది, అది ఆయన ప్రజ్ఞ. ఇంతకు ముందు ఇలాంటి కథలతో చాల సినిమాలు చూసి ఉంటాము. కథ క్లుప్తం గా చూస్తె, శ్రీరామ్, జానకి బావ మరదళ్ళు. ఉమ్మడి కుటుంబం లో ఉన్న వాళ్ళు కొన్ని కుటుంబ కారణాల వలన రెండు కుటుంబాలు విడిపోతాయి. విడి విడిగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాని వాళ్ళ మదిలో ఉన్న ప్రేమ అలా ఉంది పోతుంది. మిగిలిపోతుంది. అది తెలియటానికి కూడా వాళ్ళకి చాల సేపు పడుతుంది. ఈ లోపల వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు రావటం కథ అటు ఇటు అయ్యి చివరికి వాళ్ళు ఎలా ఒకటి అవుతారు అనేది సినిమా కథ.
సాధారణం గా మనం కోరుకునే వాళ్ళు చాల ఏళ్ళ తరువాత మనల్ని చూడటానికి వస్తుంటే మనసు వాళ్ళని ఎప్పుడు కలుస్తామా అని ఉవ్విల్లూరుతుంది. ఇంకా వాళ్లతో కలయిక ఎలా ఉండాలా అనే ఆలోచన తో సతమతం అవుతుంది. ఇదే ఇద్దరు ప్రియుల మధ్య ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. మది కలవరం చెందుతుంది, కంటికి  కునుకు ఉండదు, ఆలోచనలు అలలు పొంగినట్లు పొంగుతాయి, జలపాతలలా జారుతుంటాయి, అలాగే మది కూడా ఎక్కడికెక్కడో తిరిగి అలసి పోతుంది, క్షణం యుగం లాగ నడుస్తుంది, ఎవరు కనిపించిన ప్రియుడి లాగ కనిపించటం, ఊహల్లో కలల్లో వాళ్ళ తలపులు కలుగుతుంటాయి. ఇలాంటి సందర్భాలు చాల చూసి ఉంటాము, ఇలాగ వాళ్ళలో కలిగే ఇన్ని భావాలని ఒక పాట లో రాయటం కష్టమే. ఇలాంటి పాటలు చాల చూసాం, కాని ఈ పాట విశిష్టత ఈ పాటదే  అలాగ రాయగలటం సిరివెన్నెల గారి ఆలోచన ద్రుక్పదానికి చిహ్నం. సాధారణంగా  సినిమాలలో ఎందుకనో ప్రేయసి ప్రియుడి కోసం పాడటం చూస్తాం కాని ఎప్పుడు ప్రియుడు ప్రేయసి కోసం వేచి చూస్తూ పాట పాడటం చూడం.
ఈ పాట మాధుర్య ప్రధానంగా అద్భుతంగా చేసారు ఘంటాడి కృష్ణ, అలాగే వింటూ ఉండిపోయే పాటకి అందమైన మాటల కూర్పు చేసారు సిరివెన్నెల. జానకి ఈ సినిమాలో రాజమండ్రిలో ఉండటం, తెలుగు ఆహార్యం ఎక్కువగా ధరించటం వలన తెలుగు తనం ఉట్టి పడుతుంది. సిరివెన్నెల పదాల అందాలు, గోదావరి జిల్లా అందాలు ఒకటికి ఒకటి పోటీ పడతాయి అంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు జానకి పాత్ర వేసిన గజాల ముఖంలోని అమాయకత్వం పాటకి సరికొత్త అందం తీసుకొని వస్తుంది. దర్శకుడు ఈ పాట చిత్రీకరణకి జన రంజనం కోసం కావాల్సిన హంగులు అన్ని సమకూర్చారు. పాట పాడిన టినా కునాల్, గొంతులో మాధుర్యంతో పాటకి న్యాయం చేసిన, అక్కడక్కడ తెలుగు మాటలు పలుకటంలో స్పష్టత కనిపించకపోవటం(నేస్తం,అన్నప్పుడు), ఉచ్చ స్థాయి లో పాడినప్పుడు కష్టపడినట్లు అనిపించినా, ఈ  పాట మల్లి మల్లి వినాలి అనుకున్నప్పుడు మనల్నిపెద్దగా ఇబ్బంది పెట్టవు.   ప్రియరాలు తన ప్రియున్ని పదే పదే తలచుకొని పాడే పాట ఇది. ఇంక పాటలోకి వెళ్దాం.
పండు వెన్నెల్లో ఈ వేణు గానం నీదేనా ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
యద నీ రాక కోసం పలికే స్వాగతం

ప్రేమికులకి వెన్నెలకి విడతీయలేని అనుభంధం ఉంటుంది. ఆ వెన్నెల రాత్రుల్లో ఏకాంతం గా వాళ్ళిద్దరూ చేసే చిలిపి ముచ్చట్లు, ఆడే చిలిపి చేష్టలు, ఒకరికొకరు చెప్పుకునే కబుర్లు, సేద తీరుతూ చేసే సరసమైన సంబాషణలు ఇవన్ని వాళ్లకు తరువాత మిగిలే తీపి జ్ఞాపకాలు. అలాంటి వెన్నెల రాత్రుల్లో తన ప్రియుని మాట వేణు గానం లాగ హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన వారి మాటలు తీయగానే వినిపిస్తాయి ఎప్పుడైనా. అందుకనే అనేకమైన తియ్యనైన జ్ఞాపకాలు తిరిగి నెమరు వేసుకుంటే ఆ జ్ఞాపకాలు తీయ్యదనం నింపుకున్న జలపాతల్లా మదిలో జారుతూనే ఉంటాయి. మౌనంగా ఎదురు చూస్తున్న ఆమె మనసు చేసే సంగీతం ఎలా ఉంటుంది అంటే తన ప్రియమైన అతని పేరు వినిపించే కమ్మని వేణుగానం లాగ, ఆ వేణు గాన సంగీతం ఏమిటి అంటే అది అతని మాట అతని జ్ఞాపకం. అవి ఒక జలపాతం లాగ పారుతూ ఉంటె నీ కోసం నా తనువూ మనసు వేచి చూస్తూ నీకు స్వాగతం పలుకుతున్నాయి ఓ ప్రియ నేస్తం అనే అద్బుతమైన భావం తో పాటని ఆరంభిస్తారు సిరివెన్నెల. ఈ మాటలకు అదే భావం కలిగేలాగా స్వరం నింపుతారు ఘంటాడి కృష్ణ.

ఎగిరే గోరింక ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావు నేను చూస్తాగా చాల్లే ఎంత సేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపులు నేనేగా, రప్పించు కోన నిను నా దాక || పండు వెన్నెల్లో ||

కవులకు ప్రియమైన జంటలు చిలుకా గోరింకలే. ఇక్కడ కూడా కథ నాయకుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనిని తన దగ్గరకు తీసుకొని రావాలి, ఆ భావం అద్భుతం గా చెప్తారు సిరివెన్నెల. ఏ పక్షి అయినా ఎప్పటికి ఎగిరి పోలేదు గా, ఎగిరి ఎగిరి అలసి పోయి ఎక్కడో అక్కడ వాలి పోవాలి. తన గూటికి చేరలేకపోతే. కాని అన్ని పక్షులు తిరిగి గూటికే చేరాలి. ఇక్కడ కూడా కథ నాయిక భావం అతని గూడు తన మనసే కదా, ఎక్కడ తిరిగిన తన దగ్గరకే రావాలి అనే భావం తో ఈ పల్లవి సుందరం గా చెప్తారు. ఒకవేళ దూరం గా వెళ్ళిపోయినా, నేను నిన్ను నా దగ్గరకు రాప్పించుకుంటాను, అది ఎలా చెయ్యాలో నాకు తెలుసు, నిన్ను ప్రేమిస్తున్ననేను నిన్ను ఎలా వదులుకుంటాను అన్న విషయం ఎంత అద్భుతం గా వివరిస్తారో ఈ చరణం చూస్తె తెలుస్తుంది. ఓ గోరింకా నువ్వు ఎగిరిపోయవు సరే, కాని అలా ఎగిరి ఎంతసేపు ఉంటావు ఎంత దూరం పోతావు, ఎగిరి ఎగిరి నీ రెక్కలు అలసి పోయి గూడు చేరుకొనే సమయం దగ్గర పాడినప్పుడు నా గుండె కదా నీ గూడు అది పోల్చుకొని తిరిగి వస్తావు కదా. ఇక్కడ ఆమె లో ధీమా కనిపిస్తుంది, అతని మీద తనకున్న విశ్వాసం కూడా కనపడుతుంది. అతనికి ఈమె ప్రేమ విషయం తెలియకపోయినా అది తెల్సుకొని వస్తాడు లే అనే విశ్వాసం కనిపిస్తుంది ఈ పదాలలో.అంటే కాదు ఒకవేళ నీకు తెలియక పోయిన, అది గుర్తించటానికి గుర్తులు లేకపోయినా నేను నీకు నా ప్రేమ కు దారి చూపి నిన్నునా దగ్గరకు రాప్పించుకోనా అన్న ఆమె భావాన్ని, గోరింక తో పోల్చి మనకి అందమైన భావం మిగులుస్తారు సిరివెన్నెల. అందుకే ఓ గోరింకా నీ గూడు ( తన మనస్సు ) కి తిరిగి వచ్చే దారి మర్చి పొతే, నేను దగ్గర ఉంది దారి చూపిస్తూ నా దగ్గరకు రప్పించు కోనా అని మొదటి చరణం అద్బుతం ముగిస్తారు సిరివెన్నెల.

కన్నె సీతమ్మకి పెళ్లీడు వచ్చిందని కబురు వెళ్ళింది గా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుంది గా కళ్యాణ రామయ్య కి
ఇంక రెండవ చరణం లోకి వస్తే సినిమా లో జానకి శ్రీరాం అనేవి పాత్రల పేర్లు, అది కాక అందరికి  ఆదర్శం అయిన సీతారాములే కవుల వర్ణనలకి ఆదర్శం. సీతారాముల కథని అందం గా సినిమా కి అల్లుకోవటం, వర్ణించటం మనకి అంతులేని మధురమైన భావనని మిగులుస్తుంది. సీతమ్మ వారి పెళ్లి కథ ఒక రమణీయమైన గాధ. అలవోకగా శివధనుస్సు కదిపిన సీతమ్మ వారికి అది ఎత్తిన వారికి సీతమ్మ వారితో పెళ్లి అన్న చాటింపు ఏడు లోకాలకి వెళ్తుంది. అదే సందర్భాన్ని తన చరణం లో వాడుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయిస్తారు అవి భూలోకం లో జరుగుతాయి అంటారు, అలాగే సీత తనకోసమే పుట్టింది అని శ్రీరామునికి తెలియదా? సినిమా కథ లో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ జానకి ఆ శ్రీరాం కోసమే పుట్టింది అని అతనికి తెలియదా అని ఆమె అనుకోవటం సమంజసమే. 

వేధించే దూరమంతా కరిగేలా విరహాల విల్లువెత్తి విరిగేల
విడిపోని బంధమేదో కలిపేల మేడలోన వాలనున్న వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలాగా
ఈ రెండు వాఖ్యాలు రాసిన సిరివెన్నెల ఊహ శక్తికి, పదాల పొందికకు ఆయనలోని సరస్వతికి శత కోటి నమస్సుమాంజలులు. ఇద్దరి మధ్య ఎడబాటు వల్ల, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం వల్ల ఇద్దరికీ విరహం కలిగితే ఆ విరహమే శివధనుస్సు అయ్యింది. వాళ్ళిద్దరూ కలవాలి అంటే ఆ విరహం కరగాలి అది ఎలా అంటే ఆ విరహం విల్లువై విరిగితే కాని వరమాల సీతమ్మ వారి మెడలో పడదు. ప్రాయాన్ని పాలతో పోలుస్తారు ఎందుకంటే ఆ పొంగుని ఆపటం కష్టమే. పొంగటం ఆరంబిస్తే ఆగవు, అలాగే కడలి అలలు అవి వస్తూనే ఉంటాయి. ఆ రెండిటికి ముడి వెయ్యటం సిరివెన్నెల గొప్పతనం. ఇంక సినిమా లో కథ నాయికా, నాయకులు శారీరికంగా ఇద్దరు దూరమైనా వాళ్ళ మనస్సులు, ఆలోచనలతో ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు, అది చెప్పటానికే విడిపోని బంధం అంటారు. ఇంతకన్నా గొప్పగా ఎవరైనా ఆలోచించగలరా ??? శివధనస్సు విరిగి సీతమ్మ వారి మేడలో వరమాల పడితే వారి విడిపోని బంధం కలిసి, వయసు లో ఉన్న వాళ్ళిద్దరి కలయిక పాల సముద్రం అలల లాగ పొంగుతాయి కదా. ఈ ఊహ కథానాయిక ద్వారా మనకి కలుగ చేయటం అయన తో పాటు మన జన్మ ధన్యం.

కొసమెరుపు: ఘంటాడి కృష్ణ, ఇంజనీరింగ్ చదివినా, సంగీతాన్ని తన వ్రుత్తి గా మార్చుకొని సినిమా రంగం లోకి అడుగు పెట్టిన తెలుగు సంగీత దర్శకుడు. సిని పరిశ్రమలో ఎంతో ఎత్తు ఎదగలేక పోయిన, తనకంటూ ఒక ముద్ర తో సిని రంగం లో గుర్తింపు పొందాడు. ఈ మధ్య టీవీకి పరిమితం అయిపోయిన, ఇటువంటి కొన్ని మంచి పాటలు అందించాడు మంచి అభిరుచి గల సంగీత దర్శకుడిగా మిగిలిపోయాడు . ఇతను చేసిన పాటలలో 6teens నుంచి "దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే" బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట కుమార్ షాను తో పాడించాడు ఎందుకో మరి.

Wednesday, February 15, 2012

Song of the week - Chinukulaa Raali

ముందు మాట : Instead of posting same matter every time, providing the link to one of the earlier posts. ( What inspired me to write this series)
Movie Name:            నాలుగు స్తంభాలాట
Producer:                           N Krishnam Raju
Director:                   జంధ్యాల 
Music Director:                   రాజన్-నాగేంద్ర 
Singer(s):                            బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
Lyrics:                                  వేటూరి సుందరరామ మూర్తి
Year of Release:                 1982

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా     || చినుకులా రాలి ||

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే                                                         || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||
నాలుగు స్తంబాలాట ఈ రోజుల లో చాల మందికి తెలియదు కాని ఒక 20-30 సంవత్సరాల క్రితం, పల్లెటూర్లలో మండువా లోగిలి ఇళ్ళలో, ఉమ్మడి కుటుంబం లో సాదారణం గా పిల్లలు ఆడే ఆట. ఈ సినిమా కి ఈ పేరు ఎందుకు పెట్టారో, సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఆట తెల్సిన ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది. సినిమా గురించి తెలియాలంటే ఆట  గురించి తెలియల్సిందే. ఈ ఆట ఎలా ఆడతారంటే, నాలుగు స్తంబాలు, అయిదు ఆట ఆడేవాళ్ళు ఉండాలి, నలుగురు స్తంబాలకి అంటి ఉంటె, చివరి ఆటగాడు మధ్యలో ఉంటాడు( దొంగ అంటారు కొన్ని చోట్ల). ఆ నాలుగు స్తంబాలకి అంటి ఉన్న ఆటగాళ్ళు మధ్యలో ఉన్న ఆటగాడికి అంటకుండా స్తంబాలు మారాలి. ఎవరైనా స్తంబానికి అంటుకోకుండా దొరికి పొతే అతను స్థలం మారి మధ్యలోకి వస్తాడు. ఆట మరల కొనసాగుతుంది. సినిమా లో కూడా నాలుగు పాత్రలు, వాళ్ళు రెండు జంటలు, వీళ్ళతో ఆడే ఆ ఐదో ఆటగాడే విధి. ఆ విధి ఆడిన ఆటలో ఎవరి జీవితాలు ఎలా మారతాయి అన్నదే ఈ కథ.

జంధ్యాల గారు తెలుగు సిని పరిశ్రమకి దొరికిన ఒక వైడూర్యం. అయన తీసిన సినిమాలలో ఆయన తీసిన హాస్య చిత్రాలే గుర్తుండి పోయినా మనకి ఆయన లోని సృజనాత్మకత, సాహితి సంపద, సంగీత ప్రజ్ఞ్య చాల ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. ఈ "నాలుగు స్తంబాలాట" సినిమాతో అయన చాలా మందిని సినీ పరిశ్రమకి పరిచయం చేసారు. ఈ సినిమా ఆ రోజులలో యువతని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ పాట యువతకి జాతీయ గీతం లాగ కొన్ని సంవత్సరాలు మారు మ్రోగింది. సినిమా ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. ఇందులో దర్శకుడు, పాట రచయిత, సంగీత దర్శకుడు ఒకే భావం తో ఏకమైతే ఎలాగా ఉంటుందో తెలియ చెప్పే పాట. బాలు గారు, సుశీల గారు పాట పాడిన, పాత్రలు పాడాయా అనిపిస్తాయి. వాళ్ళ గాత్రం అంత తీయగా, హాయిగా, ప్రేమగా పలకరిస్తాయి. దానికి తోడు  ఈ పాట చిత్రీకరణ అడుగడుగునా పాట లోని ప్రతి పదానికి అర్థం ఇదే అన్నట్టు చిత్రీకరించిన పాట. రాజన్-నాగేంద్ర జంట సంగీతం సమకూర్చిన ఈ పాటకి వేటూరి గారు కాక ఇంకెవరు రాయగలరు? వేటూరి గారు ప్రేమకి నిర్వచనం. ఆయన వర్ణించినట్లు ప్రేమని మనం ఎక్కడ వినం, అనుభవించం. ప్రేమ గురించి ఆయన చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరేమో. అంత అత్యద్భుతమైన పాట ఇది. ప్రేమికులకి గొప్ప వరం అప్పటికి ఎప్పటికి ఏ నాటికి. భావుకత తన శరీరమంతా నింపుకున్న పాట ఇది. అంత భావం ఉన్న ప్రేమ పాటలు చాల తక్కువగా చూస్తాం. ఈ రోజుల్లో ఇంతటి తీయని మెలోడి ఇంక వినలేమేమో, ఇలాంటి స్వచమైన తెలుగు పాటలు మరల రావేమో..

ఇంక పాటలోకి వస్తే, అక్షరాలూ అత్యంత అద్బుతం గా పేర్చి కూర్చిన ప్రేమ మాల ఇది. జలపాతం లా సాగి మదిని అటు ఇటు కదిలించి ఊహ లోకం లో విహరింప చేసే పాట. చరణం లో అన్ని వాఖ్యలు "లే" తో అంతం అవుతాయి, ఇంక చరణం "మ" తో అంతం అవుతుంది. ఏదో ప్రాస కోసం రాసినట్టుగా లేకుండా అత్యంత అర్థవంతమైన అక్షరాలు పొదిగి మన్మధ బాణం విసురుతారు రసజ్ఞుల మీద. ఇంక ప్రేమ అనేది నిర్వచనం లేని అనుభూతి, వివరింపలేని అనుభవం. అందుకనే మనం అనేక రకాల వివరణలు చూస్తాం వింటాం. ఇన్ని రకాల సినిమాలు చూడగలుగుతున్నాం.  కొంత మంది (వేటూరి గారు) ప్రేమని వివరిస్తుంటే ఆ వివరణ ఒక మంచి అనుభూతి మిగులుస్తుంది. అందుకే కథానాయికా నాయకుడు ఒకరి దగ్గరకు ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు మనం కూడా పాటలోకి వెళ్ళిపోదాం.

చినుకులా రాలి నదులుగా సాగి  వరదలై  పోయి  కడలిగా పొంగు నీ ప్రేమ ...నా  ప్రేమ  నీ  పేరే నా  ప్రేమ
నదివి  నీవు  కడలి  నేను  మరిచి  పోబోకుమా ...హ ...మమత  నీవే  సుమా   || చినుకులా రాలి ||
పాట ఆరంభం లో రాజన్-నాగేంద్ర గారు మొదలు పెట్టిన తీరు చాల బాగుంటుంది. జంధ్యాల గారి చిత్రీకరణ సంగీతానికి తోడవుతుంది. చాల మంది నమ్మే ప్రేమ ఎప్పుడైనా ఒకరి చూపులు ఇంకొకరివి కలిసి, ఆ చూపులు భావాలు గా మరి, ఆ భావాలు మాటలు గా మారి, మాటలు అనుభూతులు గా మారి, అనుభూతులు అనుబందాలు గా మారి, చివరికి ఒకరి మనసు ఇంకొకరిది అయితే అదే ప్రేమ. కలకాలం నిలిచే అనుబందం. శరీరాలకి అతీతంగా మిగిలేది నిజమైన ప్రేమ. అందుకనే ఈ ప్రవాహాన్ని వేటూరి గారు ప్రక్రుతి సహజమైన తీరుతో పోలుస్తూ ఈ పాట రూపొందించారు. సముద్రం పురుషుడైతే, నది స్త్రీ  అవుతుంది. అందుకే స్త్రీ పురుషుడి కలయిక అలా పోలుస్తారు. పాట లో కూడా నేను సముద్రం అయితే నువ్వు నదివి అది మర్చిపోకు అని చేతి లో చెయ్యి వేయించుకుంటాడు కథానాయకుడు. నీ మమత తో నన్ను నీలో చేర్చుకొని ఆనందం తో ఉప్పొంగి పోయేలా చెయ్యి అంటాడు. నీరు ఆవిరై మబ్బు వాన గా మారినట్టు, ఆలోచనలు ఆవిరై అవి చూపులు అయినట్టు ప్రేమ చినుకులా రాలి, ఆ వాన నీరు నది లాగ మారి నది వరదై, సముద్రం లో నది కలిస్తే , సముద్రం ఆనందం తో ఉప్పొంగితే అదే ప్రేమ అంటారు వేటూరి. నా ప్రేమ కి వేరే నిర్వచనం లేదు నీ పేరు తప్ప, నా ప్రేమ అంటే నువ్వే. ఎంతటి చక్కటి నిర్వచనం చెప్తారు వేటూరి గారు ప్రేమ గురించి? జంధ్యాల గారు, నదిని సముద్రాన్ని చూపించారు కాని వానని చూపించలేదు ఎందుకనో?

ఆకులు  రాలే  వేసవి  గాలి  నా  ప్రేమ  నిట్టూర్పులే  
కుంకుమ  పూసే  వేకువ  నీవై  తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే  నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే

మరల ప్రకృతినే ఆశ్రయిస్తారు వేటూరి గారు ప్రేమికులకి ప్రేమిస్తున్నాము అని ఒకరికి ఒకరు అర్థం అయ్యేసరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్తితికి వస్తారు. ఆ విరహం లో ఆ ఆలోచనల వేడిమి లో కలిగే తాపం లో వచ్చే నిట్టూర్పులు ఎంత వేడిగా ఉంటాయి అంటే, ఆకులు రాలే కాలం లో వేసవి గాలి వేడి అంత.  మరి అంత వేడి, తాపం తగ్గేది ఎలా అంటే కుంకుమ పువ్వు పూసే పొద్దున్న లాగ ఉండాలి అని. కుంకుమ పువ్వు చాల తక్కువ కాలం ఉంటాయి అవి కూడా చల్లని ప్రదేశాలలో మాత్రమె పూస్తాయి. మరల కొంచెం వేడి తగిలినా ఆ పూలు పాడయిపోతాయి. అలాంటి చల్లదనం తో వచ్చే కుంకుమ పువ్వు తనకి ఇచ్చే బలం అతనికి ఓదార్పు కావాలి. ఎక్కడినించి ఎక్కడికి వెళ్లారు వేటూరి గారు? ఇంకా జన్మ జన్మల బందం మన ప్రేమ. నీ కోసం వేచి ఉంటాను అనటం సాధారణం గా ప్రేమికులు వాడే పదమే. కాని ఆ జన్మలు ఎలా ఉండాలి? ప్రేమలు కొరేవి గానే ఉండాలి. అందులోనే నీకోసం వేచి ఉంటాను అంటూనే, ఆ జన్మల తో సంభందం లేకుండా, అవి దాటి నీ దానిని అవుతాను అంటుంది కథానాయిక. సినిమాలో జంధ్యాల గారు కథానాయిక వేచి ఉండటం చూపిస్తారు. 
 హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా  

మరల ప్రేమ ప్రవాహం గురించి చెప్తారు ఈ సారి వేరే విధంగా, అది కూడా మల్ల ప్రకృతిని ఉదాహరణ గా తీసుకొని. మంచు కరిగి నదులు గా మారతాయి అని మనకి తెలుసు, అనేక నదుల ఉద్భవం హిమాలయాల మీద ఉన్న మంచు, అవి కరిగి నదులు అయ్యి, ప్రవహిస్తే, మొక్కలకు పువ్వులు పూస్తే, ఆ పువ్వుల నవ్వులు మనకి ఋతువులు గా కవ్విస్తే, ఆ పువ్వులనుంచి తేనే పొంగితే వచ్చే సహజ సౌందర్యం, ఆహ్లాదం ఆనందం నీ నా ప్రేమ. అది శరీరం శిధిలమైన కాని, కష్టాలు వచ్చిన కాని ఒకరికొకరి దూరం గా పోకుండా, ఒకరిని ఇంకొకరు విడిచి పెట్టకుండా ఉండేలాగా ఉండిపోవాలి అని కోరుకుంటారు ప్రేమికులు. ఈ పద ప్రవాహం కమనీయ సుందర కావ్యం, అదే వేటూరి సుందర కావ్యం.

తొలకరి కోసం తొడిమను  నేనై  అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే   

మండు వేసవి తరువాత వచ్చే మొదటి వాన కోసం భూమి పరితపిస్తుంది, అలాగే మొక్కలు, చెట్లు, చేలు, ఆ వాన పడగానే అవి పులకరించి పోతాయి పరవశించి పోతాయి. మన్ను సువాసన వెదచల్లుతుంది. అలాంటి వాన అన్నింటి లో కొత్త శక్తిని నింపుతుంది. నేను కూడా అలాగే ఒక తొడిమ పువ్వు పూయటం కొరకు వాన కోసం వేచి చూసే లాగ నీ కోసం వేచి ఉంటున్నాను అంటుంది కథ నాయిక. నింగి నెల కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్య సమయాన రెండు ఎకమైనట్టు ఉంటాయి. నిన్న ఇవ్వాళ అయితే అదే రేపటికి వెన్నంటి ఉంటుంది ఇవ్వాళ. నీడ అవుతుంది అంటే సినెమా లో ఇక్కడ నీడ చూపిస్తారు జంధ్యాల గారు. రేపటికి నీడలా వెంటాడి ఆ పొద్దు సమయం లో నా ముద్దు తీరుతుంది లే అనే ఆశ అందుకనే ఇద్దరు కలిస్తే తీరం చేరినట్టే.   ఆ తీరాలు చేరాలిలే అని ఇద్దరినీ పాటలో కలిపేస్తారు.


మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ.....  ప్రేమమనమే సుమా   || చినుకులా రాలి ||

మౌనమై మెరిసి అనగానే, ఇద్దరినీ ఒక బోర్డు దగ్గర నిలబెడతారు జంధ్యాల గారు అందులో "Those who in love tell each other a thousand things without talking " అని చూపిస్తారు. నిజమే ప్రేమికుల చూపులలో కొన్ని వేల సందేశాలు, మాటలు దాగి ఉంటాయి, అవి వాళ్ళకే అర్థం అవుతాయి. మౌనమే గానము అవుతుంది ఆ గానం తో ఒకరిని ఒకరు పిలుచుకొంటే, ఆ తరువాత వచ్చే కళలు ఉప్పెన లా ఎగసి, ఆ అలల అలజడికి మనసి అలసి పొతే, ఆ అలసటని తీర్చటానికి నీ నా ప్రేమ తారడితే, ఈ ప్రపంచం అంటే మనమే, మన ప్రేమ తో నిండిపోయి అంతటా మనమే కదా అని ముగుస్తారు వేటూరి గారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు తనదైన శైలి లో.

కొసమెరుపు: ఈ పాట మొదట "రాజన్-నాగేంద్ర" గార్లు 1977కన్నడ సినిమా "Bayaludari" లో ఈ పాట చేస్తే కొంచెం మార్చి 1982 లో "నాలుగు స్తంభాలాట" కి మరల చేసారు. ఇదే పాటని 1992 హిందీ లో "ऐसी दीवानगी" అనే పాట గా    కాపీ కొట్టిన నదీం శ్రావణ్ కి ఫిలిం ఫెయిర్ అవార్డు రావటం విచిత్రం.

ఈ సినిమా తో సుత్తి అనే పదానికి సృష్టి కర్త అయ్యారు జంధ్యాల గారు, ఆ పదం ఇంటి పేరు గా మారింది, వేలు గారికి వీరభద్ర రావు గారికి.