Friday, August 1, 2014

Rabhasa Audio Review

Movie: Rabhasa ( రభస )
Music: SS Thaman
Director:  Santosh Srinivas
Producer(s): Bellamkonda Suresh and Bellamkonda Ganesh Babu
Cast: Tarak ( NTR Jr ), Samantha Ruth Prabhu, Pranitha Subhash

Tarak's latest offering is Rabhasa, started in October 2013, this movie audio launch has been getting postponed and finally got released today 1st of August 2014. The movie is slated to release on 14th August 2014, but now seems like finalized to be released on 15th August 2014, on the independence day. They say producers initially started a movie which was sequel to Kandireega but those plans were shelved and decided to do a movie with Tarak and finally titled it as Rabhasa. Even there was some confusion on who was the director ever since movie started as Santosh Srinivas had some health issues, those were too cleared by Koratala Siva that he is not part of this film.

Even in music department there was some confusion as it was thought Anup Rubens would compose music for this film, but finally it was Thaman taking the lead to get into music department. It was thought there would be remix of "Attamadugu vaagulona" from Sr NTR blockbuster movie "Kondaveeti simham" released in 1981. However the audio doesn't have it. may be will have to wait for it or they didnt plan for it not sure.

Coming to Audio, there are absolutely no expectations from Thaman, as he lives upto expectations of delivering same songs. Srimani got bigger share in lyrics department as one song was penned by Ramajogayya Sastry and other was by Ananth Sriram, rest by Srimani. Obviously that song by RJS will be a mix of Hindi, English with few words in Telugu. Coming to Singers, as everyone know and are eagerly waiting to listen to Tarak in a song. In other song there are tons of singers almost 6 of them sang a song. There are 5 songs in the album, guessing they will add the remix later.

Lets review the songs 

1. Maar Salaam
Singer(s): Suchith Suresan
Lyrics: Ramajogaiah Sastry

Guess this is a title song. Starts with some tongue twisting words, then starts the problem with Thaman back in form with his usual template beats, that doesn't have any relation with the start of the song. Wish RJS would have continued with the initial flow rather than HT(Hindi Telugu) words. Suchith Suresan did better than expected, expect for pronouncing ఉండాలి. Thaman was not creating in tunes, he still has issues lack of freshness and each song resembling one or many of his earlier songs, He is not trying to avoid it at all. He still has to get basics in song composing that each song is different. Since title song, its all lecture by RJS of how one needs to be as hero is always a good boy. This song is loud and energetic. Sometimes appears as noise, but it might help to elevate in the movie. With such high energy levels it will be a treat to Tarak's fans. Music wise it doesnt stand tall. Suchith Suresan is only reason to listen to this song.

2. Raakasi Raakasi
Singer(s): Tarak ( NTR Jr )
Lyrics: Srimani

Srimani who wrote decent lyrics in other movies wears a complete mass hat in this album. His lyrics are not what is expected from him. NTR proves he is multi talented, he did better than many professional singers out there. As usual Thaman has nothing to offer in this song too so he used his sound mixer for NTR's voice. The excitement comes from Tarak singing this song, Srimani just filled some words for this song. If not for Tarak this song doesn't have any place.

3. Garam Garam Chilaka
Singer(s): Srikrishna, Deepu, Bindu, Parnika
Lyrics: Srimani

Song starts with typical template music from Thaman. Not sure why he is not getting bored offering same music again and again. May be director/producers are not demanding. Srimani writes perfect mass song. But he should have kept the words of choice in check. He could have avoided many of the words for the half of the song easily. "Jila putti sachentala"  "Love anitchesave o duradala", not sure what these lyricists are thinking. They are for sure thinking in the noise and loudness of the song, these words would not be heard or no one cares? Mass song, strictly for on screen view. Easily avoidable song.

4. Hawa Hawa
Singer(s) : Karthik, Megha
Lyrics: Ananth Sriram

When we hear the start of the song, we think did we hear this song else where? Supposed be a romantic duet I guess. But interludes are too loud and noisy. Too crowded there is no pleasantness. I guess Thaman's concept of the song is totally different. He adds whatever sounds he likes in interludes totally unrelated to the song. Did I hear some one say "Check" somewhere in between the song? Not sure its intentional. Anyways Karthik too didn't sound pleasant at places of high pitch. This song didn't sound like Ananth Sriram's song at all. May be I got the info incorrect. This song appeared that Thaman was playing around and experimenting on sounds instead of organizing a song.

5. Dam Damare
Singer(s): Simha, Sooraj Santosh, Nivas, Deepthi Madhuri, Manasa Acharya, Pavani
Lyrics: Srimani

Again one more song that resembles other song that Thaman made earlier. Srimani didnt do well in this movie. He was so so. Song made for Tarak and the team. So many singers in a song not sure who sang what. Thaman's typical singing, shouting is all over the place. The template beats, the saying words all exactly same to same :) Again one another song for on screen rather than audio. Good thing in this album is that Thaman did not alter singers voices as much as he is known for, atleast one less irritating thing for listeners.

Pick(s) of the album: Raakasi, Maar Salaam

This album is once again for Tarak fans, and Thaman met the expectations of music fans out there, by not offering anything new. He is consistent enough and will be. However there is a ray of hope in future as recently I had been to recording of the Paadutaa Teeyaga, where SPB gave some good feedback to Thaman. If Thaman follows that and changes his ways, then there will be good days else we will be hearing the same again and again and he lives upto his name. I cannot say the audio is disaster but one of the low quality albums for Tarak. If the movie goes well, then this music will not be an issue.

Wednesday, May 21, 2014

Manam - Audio Review

Movie: Manam ( మనం )
Music: Anoop Rubens
Director:  Vikram Kumar
Producer(s): Akkineni Nagarjuna
Cast: Dr Akkineni Nageswara Rao, Nagarjuna, Naga Chaitanya, Shriya Saran and Samantha

In one of the rarest happening in Telugu movie history that three generation actors from same family acted in a movie directed by "Ishq" movie fame Vikram Kumar. This movie is produced by Akkineni Nagarjuna. He might not have thought that this would be the last film for his father and that he has to cherish the memories acting with his father there after. Whoever acted in this movie or associated with this movie will be a part of a history of Telugu film. When film lovers came to know about this movie first time, they were thrilled to see all of them on the same screen. Now knowing that Legend is not with us anymore, this movie will be embraced for legacy.

The way Dr Akkineni Nageswara rao garu completed this movie is heartening. The way he fought the battle with deadly disease and knowing that his days are counted, planning and completing his portion in the movie is pure inspiration for everyone. Whatever the movie is, now it doesnt matter. This will provide a last chance to Telugu audience to see their favorite actor on the silver screen for one last time.

Music and Dr ANR. have been synonymous. Music has been one of the great factor in many of his movies. Anoop Rubens must be lucky getting once in a life time opportunity to be part of the history. This movie provides 5 songs with an additional track with theme of the movie. There is a song sung by Master Bharath, which has an adult version. So basically its 4 songs. Vanamali wrote one song, Anoop Rubens penned one and the rest goes to Chandrabose.

Lets see whether these songs will be a tribute to Dr. ANR or not. 


1. "Kanulanu Thaake"  
Lyrics: Vanamali
Singer(s): Arijit Singh

Arijit Singh is not a stranger completely for telugu audience or music fraternity. He sung earlier in Uyyala Jampala ( Der thak chala ), Swamy rara and couple of other songs. This song inspite of having a distinct Alien to Telugu feeling, is an instant winner. Arijit, Vanamali and Anoop combined effort paid off. A very soft song, is for melody lovers. A solo song for Arijit with Chorus is appealing. Anoop did very well with interludes and chorus. Guitar, violin and beats are very soft and supports the lead singer very well. Arijit usually had issues with Telugu, but the tune and his scintillating voice covers it up. Over all a good start for the album. The ending of the song is also done quite well.

2. "Chinni Chinni Aasalu"  
Lyrics: Chandrabose
Singer(s): Shreya Ghoshal, Ashwin, Hari

Anoop has done quite well in instruments in this song too. Quite refreshing. Another soft song. There are too many chinni's, chiru's that sounded very well. Seems like the music of this movie is following mood of the movie which is kind of feel good. Anoop followed a pattern/theme for the songs, which should go well with movie. Shreya Ghoshal makes mistakes pronouncing Telugu words, which are unforgivable/unacceptable any more for her caliber. In-spite of singing more than a decade in Telugu she makes blunders, it does not matter how great her voice is, she is the turn off for this song. "బహుమతిచ్చావే" not "బహుమతి చావే". The way she sang, Instead of giving gift, its like take gift and die. It is Hari and Ashwin's show in this song. One voice was very unique and other's was soft and cool. Not sure which one is who. It will take time to realize who is who. Again a good effort by Anoop.

3. "Manam (Theme)"  
Theme Music
Singer(s): Chaitra H. G.

Theme music is being heard over promos and trailers. This theme is carried for all the songs. Chaitra has done well for the given scope. This music definitely depicts the theme of the movie. 

4. "Kani Penchina Maa Ammake"  
Lyrics: Chandrabose
Master Bharath, Chorus

This song is sung by a kid and an adult version comes later in the album. May be kind of family song or a love song goes thru family? Anoop brings in a little classical flavor to the song, Master Bharath and chorus did decent. Egasina Bigisina katha idi, Jolalu naake paadaru gaa aa jaalini marichi polenugaa, only Chandrabose can write such words :) Bigisina katha and jola paadedi jaali tonaa not sure whether it is right to say, Who ever sings lullaby will not sing with sympathy, they sing with Love and effection. Just to find rhythmic pattern of words, Chandrabose might have used it, other wise it doesn't make much sense. Anyway other than few hiccups like these, he did fine and away from his routine songs which doesn't make much sense, this one is better for sure.


5. "Piyo Piyo Re"  
Lyrics: Anoop Rubens
Singer(s): Anoop Rubens Jaspreet Jasz, Anoop Rubens, Rap by Meghraj, Rahul & Chorus

Complete energetic song. This song will be a party song going forward. Rap is mixed as usual. Adding ANR's evergreen song with original voice will leave good feel. The tune reminds another famous Hindi song, but stays for very short, as the ANR song will take over the memory lane. A short length song compared to regular format. But fans will go in ecstasy. One of the male voice was dull in this otherwise energetic song. Leaving ANR song as it is and mixing it, wrapping around it was clever thing done by Anoop Rubens. 

6. "Idi Prema"  
Lyrics: Chandrabose

Singer(s): Haricharan

Haricharan sings the adult version of Idi Prema sung by Master Bharath. Somehow Haricharan sounded odd in base voice. Some good feel is missing in Haricharan's voice. May be that was the limitations that Haricharan had with his voice and singing. He did his best though. Personally, I feel Karthik would have been a better choice for this song as he comes with fluent and effortless singing in this kind of songs. Again Anoop did very good in terms of orchestration and instruments, choose the right ones at right places. Guess there was a note missed by instrument at the ending of first interlude. Thought I heard an apasruti in a hurried ending. Anyways this is like looking at a magnifying glass for issues, for other wise a feel good song. Hero of the song is Anoop.

Pick(s) of the album: Kanulanu Taake, Piyo Piyo Re, Chinni Chinni Aasalu. 

ANR was lucky that he always had tremendous musical hits whichever decade he acted. Even in modern era he had so many musical hits. Its either his choice or good music fell into his lap always. 

Manam is the last movie of one of the two eyes of Telugu Industry, Dr ANR. The music has to be at the level that it should be a tribute to the Legend. The standards of movie music in the modern era has gone too low, but this one stands little tall compared to the latest albums in this year. Whether this is a tribute to Dr. ANR or not, music lovers and ANR fans will decide. The music meets the movie theme and tells about the movie for us. Anoop was successful in that part. Rest is in listeners hand.

Friday, May 9, 2014

Song of the Week - Ramachakkani Seetaki

ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)

Movie Name:         గోదావరి 
Song Name :         రామ చక్కని సీతకి
Music Director:      K. M. రాధాకృష్ణన్
Singer(s):             గాయత్రి  
Lyrics:                  వేటూరి సుందర రామమూర్తి
Director:               శేఖర్ కమ్ముల
Producer :             G.V.G. రాజు
Year of Release:    2006

ఈ పాట తెలుగు సినీ చరిత్రలోని ఒక అధ్యాయం లోని చివరి పంక్తుల నుంచి జాలువారిన పాట. ఆ అధ్యయమే వేటూరి సుందర రామ మూర్తి గారు. ఒక గాయకుని గొంతు కైనా ఆయు: పరిమితి ఉంటుందేమో, ఒక దర్శకుని ప్రతిభకి నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందేమో, ఒక సంగీత దర్శకుని కైనా పరిమితులు ఉంటాయేమో కాని, ఒక కవి భాష యొక్క పదునికి, కవి ఆలోచన/ఊహా శక్తికి వయో పరిమితి ఉండదు. అందుకు నిదర్శనమే వేటూరి గారు, ఆయన రాసిన ఈ పాట. ఈ పాట గొప్పతనం ఏమిటి అని అడిగితే ఒక్క మాటలో చెప్పలేము. ఖచ్చితం గా మనసును తాకి ఆహ్లాద పరిచే పాట, సీతా రాముల జంటని ఊహింప చేసే పాట. రామాయణం మొత్తం ఒక్క సారి స్పృశించే పాట, గోదావరి తో ఉన్న అనుభందం జ్ఞాపికకు వచ్చేలా చేసే పాట. ఒక కవి తన ఊహా శక్తి తో పదాలను తన గుప్పిట ఉంచుకొని ఎటు పడితే అటు అందంగా ఉపయోగించుకొనే పాట, విన్న శ్రోత తాదత్యం చెందే పాట. ఇలా అంతులేని అనుభూతుల్ని ఇచ్చి శ్రోత తో ఆనంద భాష్పాలు రాల్చే పాట.

ఇంకో పక్క చూస్తె, అర్థ వంతమైన పాటని అంతే అర్థవంతంగా సినిమాలో సందర్భం ప్రకారం ఉపయోగించుకొనే దర్శకులు మనకి బాపు విశ్వనాథ్ గార్లతో అంతమై పోయిందా అనిపించే పాట. అర్థవంతమైన పాటని ఎంతో  అందం గా చూపించ గలిగిన దర్శకులు జంద్యాల, వంశీ గార్లతోనే ముగిసిందా అనిపించే పాట  ఇది. ఎందుకంటే ఇంత అందమైన, అర్థవంతమైన పాట సినిమాలో నేపధ్యం లో వినపడి వినపడనట్టు వచ్చి వెళ్ళిపోతుంది. పాత్రల సంభాషణల్లో ఈ పాట  కొట్టుకుపోతుంది. ఇంకో పక్క దర్శకుడు ఈ పాటని సినిమాలో ప్రవేశ పెట్టినందుకు ఆనందం కూడా కలుగుతుంది, ఇందుకోసమైనా దర్శకుడు శేఖర్ కమ్ములని అభినందించక తప్పదు. సంగీతం అందించిన K.M . రాధాకృష్ణన్ మనకి వంద, యాభై సినిమాలకి సంగీతం అందించి శ్రోతల చేత తిట్టించుకునే కన్నా, ఇటువంటి చిరాయువు కలిగిన పాట చేస్తే సినిమా చరిత్ర లో చిరంజీవిగా నిలబడి పోగలుగుతాడు అని నిరూపిస్తాడు 

సీతారాముల మీద కవిత్వం రాయని కవి ఉండడు.అలాగే సీత రామ కథలని చెప్పని రచయిత ఉండడు. ఈ రెండు పాత్రలు భారతీయ సంస్కృతి లో ఎంతగా ఇమిడి పోయాయో చెప్పనలవి కాదు. రామ నామం వినగానే పరవసించని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రాముడు దేవుడయ్యింది అవతార పురుషుడు కాబట్టి అనే కంటే, అటువంటి పరిపూర్ణమైన పురుషుణ్ణి మనం ఇప్పటి వరకు చూడలేదు అంటే సరిపోతుంది ఏమో. అందుకనే ఏ పోలికైన రాముడి వైపు వెళ్తుంది, ఏ వర్ణన అయినా రాముడి వైపు వెళ్తుంది. అన్ని రకాలుగా అందరిని మెప్పించిన రాముడు దేవుడు అయ్యాడు. ఒక రాజు గా, ఒక కొడుకు గా, ఒక శిష్యుడి గా, ఒక స్నేహితుడిగా ఒక భర్త గా, ఒక అన్న గా, ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని విధాలా పరిపూర్ణమైన వాడు రాముడు. సీతా రామ జంట ఎంత కన్నుల పండుగా ఉంటుందో కవి ఊహా శక్తికి అందనటువంటి జంట. అందుకనే ప్రతి కల్యాణం సీతారామ కళ్యాణమే, అది తలచుకొంటే మనకి కలిగే ఆనందం అంతు లేనిది. వేటూరి గారు సినెమా లోని సీతా మహాలక్ష్మి ( సీత ), రామ్ ల జంట కోసం ఆ సీతారాముల మీద సరసం గా, సీతమ్మ వారి వేదనగా, విరహంగా, ఒక్కో వాక్యంతో రామకథని మనకి చెప్తారు. ఆ సమకూర్చిన సాహిత్యానికి అత్యద్భుతమైన సంగీతంతో  చక్కని తెలుగు తనం అడుగడునా ఉట్టిపడే పాటని అందించారు వేటూరి, రాధాకృష్ణన్ కలిసి. ఉడతా భక్తి గా తనవంతు సహకారం అందిస్తారు శేఖర్ కమ్ముల ఈ పాటని సినిమా ద్వారా అందించటంతో.

 అందించటంతో  సినిమా విషయానికి ఈ పాట సందర్భానికి వస్తే, శ్రీ రామ్ చాల నియమాలు కలిగి అవి పాటించి అందరి చేతా చులకలన పొందే వ్యక్తి. తన మరదలు తో పెళ్లి కోసం ఆశ పడతాడు కాని ఆమె తల్లి తండ్రులు రామ్ దగ్గర ఏమి లేదని ఒక ఐ పి ఎస్ ఆఫీసర్ కి ఇచ్చి భద్రాచలం లో పెళ్లి చెయ్యటానికి నిశ్చయిస్తారు. నిరాశ  తో ఆ పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక పోయిన తప్పని సరి అయి రాజమండ్రి నుంచి లాంచి లో వెళ్ళటానికి సిద్దమవుతాడు. ఇంకో పక్క సీతా మహాలక్ష్మి ( సీత ) జీవితం లో కలిగిన వైఫల్యాలతో విసిగి ( పెళ్లి కొడుకు సీతని తిరస్కరించటం, చేసే వ్యాపారం ముందుకు వెళ్లకపోవటం) విరామం కోసం అదే లాంచి లో భద్రాచలానికి వెళ్తుంది. ఆ ప్రయాణం అనేక మలుపులు తిరుగుతూ ఆడ వాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవటానికి లాంచి ఒక చోట ఆగుతుంది, అప్పుడు అందరి మధ్య జరిగే సంభాషణల నేపధ్యం లో వచ్చే పాట ఇది. అందరు బామ్మల లాగానే ఒక జంట పెళ్ళికి సిద్దం గా ఉన్నారంటే వాళ్ళ దృష్టి ఆ జంట మీదే ఉంటుంది. అందులో తనవాళ్ళు అయితే ఇంక వాళ్ళకి అడ్డే ఉండదు. ఈ సినెమా లో బామ్మ ,కూడా అంతే , మన ఇంట్లో బామ్మ/అమ్మమ్మ లాగ :)

ఈ పాటలోనే కాదు సినెమా మొత్తం గోదావరి అందాలు చెప్పనలవి కానివి. గోదావరితో  పరిచయం ఉన్నవాళ్ళకి అర్థం అవుతుంది ఇది మాటల్లో వివరించలేనిది అని. ఆ లాంచీ రేవు గోదావరి గట్టు, గోదావరి ప్రవాహం, నది మధ్యలో లంకలు, తెర చాపలు, చుట్టూ ఉండే పచ్చదనం, నది ఒడ్డులో పిల్లల ఈతలు, పాపి కొండల మెరుపులు, ఇవన్ని గోదావరి తో జీవితం ముడిపడి ఉన్న వాళ్ళ మధురానుభూతులు. వేదంలా ఘోషిస్తుంది, ఉప్పొంగి చేలల్లో పచ్చదనం తెచ్చి అందరిని అలరిస్తుంది, అందరి కష్టాలు తీరుస్తుంది, బ్రతుకు తెరువు కలిగిస్తుంది, అటువంటి గోదావరి తలచుకున్నప్పుడల్లా అనుభందం ఉన్న వాళ్ళ కళ్ళలో మెరుపు తప్పకుండా ఉంటుంది. ఇంక వేటూరి గారి పాటలోకి వెళ్దాము 

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

KM రాధాకృష్ణన్ ఈ పాటకి అడుగడునా న్యాయం చేకూర్చారు. గాయని, వాయిద్యం, నేపధ్యం అన్ని సరిగ్గా సమకూరాయి ఈ పాటలో. ప్రతి చరణం ముగించిన తీరు చాల బాగుంటుంది. ప్రశాంతం గా ఉండే గోదావరి లాగ ప్రారంభించి  మనసు తట్టి లేపి ఉప్పొంగిన గోదావరి లాగ కదిల్చి వేస్తుంది. నెమ్మది గా ప్రసాంతం గా సాగుతున్న నావ ఒక్క సారి జోరు అందుకున్నట్టు ప్రతి చరణం సాగుతుంది. మధ్యలో వచ్చే సంగీతం అలల్లాగా పలకరించి వెళ్లి పోతుంది.

సీతమ్మ వారి వర్ణన వింటాము పల్లవి లోని మొదటి రెండు వాఖ్యాలతో. నీల గగన అంటే నీల ఆకాశ వర్ణం కలిగిన సీత, మనోహరమైన ( రమ ) ఘన విచలన అంటే నెమ్మది గా/ భారం గా నడిచేది అని, ఇక్కడ నెమ్మది  గా అంటే సున్నితంగా, వయ్యారంగా, దీన్నే మార్చి మంద గమన అంటారు చివర్లో. ధరణిజ అంటే భూదేవి కి కూతురు, మధుర వదన, ఇందు వదన అన్ని సీతమ్మ వారికి ఉపమానలే. నలిన నయన అంటే పద్మము వంటి కనులు కలదానా అని. సీతమ్మ వారి గురించి ఇంత వివరించి, అటువంటి మా సీతమ్మ సీత మనవి వినవా రామ అని పాట ప్రారంభిస్తారు వేటూరి గారు. సీతమ్మ మనవి ఏంటి అనేది మనకి తెల్సిందే రాముడిని కలవాలని, చూడాలని.

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట  || రామచక్కని సీతకి ||

తెలుగు నాట గోరింటాకు పెట్టుకోవటం ఒక చెప్పలేని అనుభూతి. ప్రతి వనిత ఎంతో కష్టపడి ఆకులు కోసి ఆ ఆకులని రుబ్బి, ఇష్టపడి చేతికి పెట్టుకొనేది గోరింటాకు. ఇది పెట్టుకోనని మారాము చేసిన కన్యల కోసమే అన్నట్టు గోరింటాకు పండిన విధానంకి ఆ కన్యకి రాబోయే వరుడికి ముడి పెట్టి ప్రోత్సహిస్తారు పెద్దలు. ఆ కన్య తన ఊహల్లో తనకి వచ్చే రాకుమారుడిని ఊహించుకుంటూ పండిన చెయ్యిని చూస్తూ మురిసిపోతుంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు మందారం లా పూస్తే మంచి మొగుడొస్తాడ, గన్నేరు లా పూస్తే కలవాడు వస్తాడు, సింధూరం లా పూస్తే చిట్టి చేయ్యంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు అన్నారు. వేటూరి గారిక్కడ రాముడు మెచ్చిన, రాముడికి నచ్చిన సీతకి అరచేత గోరింటాకు పెడితే ఆ గోరింటాకు పండిన చెయ్యి మెరిసిపోతే చక్కని సీతకి మొగుడు గా ఎవరు వస్తారో అని అడుగుతూనే  రాముడు కాక ఇంకా ఎవరు వస్తారు అని చెప్పకనే చెప్తారు రామచక్కని సీత అంటూ. ఈ రెండు వాక్యాలతో సీత కళ్యాణం ముందు ఉన్న ఘట్టాలన్నీ అలాగే కల్యాణం ముందు సీత ఏమి ఊహించుకొని ఉంటుందో అన్న ఊహ లోకి తీసుకెళ్తారు వేటూరి గారు. ఈ పాట పాడిన గాయత్రి మొత్తం పాట అద్బుతం గా పాడినా అరచేత గోరింట అన్నప్పుడు గోరింట అన్నప్పుడు స్పష్టం గా ఉండదు. ఇంత చక్కని కవిత్వానికి చెయ్యగలిగిన న్యాయం ప్రతి మాట స్పష్టం గా వినపడేలా పాడటమే.

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో           || రామచక్కని సీతకి ||

వేటూరి గారి కల్పనా శక్తి కి హద్దు అంటూ ఉండదా? ఈ మూడు వాఖ్యాలు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. రాముడు అత్యంత బలవంతుడు, శక్తివంతుడు అని అందరికి తెల్సిందే. ఆ శక్తి ఎటువంటిదంటే సీతా స్వయంవరం అప్పుడు ప్రపంచం మొత్తం ఎవరు ఎత్తలేని శివ ధనుస్సుని  ఎడమ చేత్తో ఎత్తటం రాముని ప్రతాపానికి ప్రతీక. ఇంక రాముడు సీత కోసం లంక కి వెళ్ళేటప్పుడు సముద్రం మీద వంతెన కడ్తున్నప్పుడు అందరూ శక్తి వంచన లేకుండా రామకార్యం అని తలచి చేతనైన సహాయం చేసారు. ఆ క్రమంలో ఒక ఉడత కూడా సహాయం చెయ్యటం చూసి సంతోషంతో ఉప్పొంగిన రాముడు ఆ ఉడతని ఆప్యాయంగా చేత్తో తీసుకొని వీపు మీద వేళ్ళతో నిమురుతాడు. అప్పుడు పడిన గీతలు ఉడత జాతి మీద ఉండి పోతాయి. ఈ రెండు ఉదంతాలు ఎంత అద్బుతమైన పదాలతో చెప్తారో వేటూరి గారు. ఈ రెండు వాఖ్యాలకే కళ్ళు చమ్మగిల్లితే ముగింపు వింటే ఆయన కవితా పటిమకి అబ్బుర పడవలసిందే. శక్తి వంతమైన రాముని చెయ్యి ఎడమ చేత్తో శివధనస్సు ఎత్తుతాడు, ఉడత వీపున వేలు విడుస్తాడు, అటువంటి రాముడు సీతని పెళ్లాడతాడు అన్న అర్థం వచ్చేలా చెప్తారు పుడమి అల్లుడు రాముడే అని. సీత అమ్మ వారు భూదేవి కూతురు, భూమి నుంచి పుడ్తుంది కాబత్తి. సీతకి భర్త అయితే భూమాతకి అల్లుడే గా. కాని ఎడమ చేత్తో సీత జడను ఎత్తగలడా అన్న ప్రశ్న  సంధిస్తారు ఇదే అయన ఊహ శక్తికి నిదర్సనం. ఎందుకంటే తాళి కట్టటానికి రెండు చేతులు కావాలి, మరి తాళి కట్టేటప్పుడు తనంతట తానే జడని ఎత్తటం ఎవరికీ కుదరదు ఎంతటి బలవంతుడి కైనా శక్తిమంతుడి కైనా. ఉన్న రెండు చేతుల తో తాళి కడతే జడ ఎత్తటం ఎలా సాధ్యం? ఇటువంటి అద్భుతమైన ధర్మ సందేహం కలగటం వేటూరి గారి చమత్కారం అది కూడా నిఘూడం గా.

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపోశైనాడు దేవుడు నల్లని రఘురాముడు    || రామచక్కని సీతకి ||

ఇప్పుడు లంకకి ఇటువైపు రాముడు ఉంటె, అటువైపు సీతమ్మ వారు. రాముడి జాడ తెల్సినా ఎప్పుడు వస్తాడో తెలియదు, కాని వస్తాడని నమ్మకం. సీతమ్మ వారిని ఎర్ర జాబిలీ తో పోలుస్తారు, ఇది ఇంకో చమత్కారం. ఎర్ర జాబిలి  చెయ్యి గిల్లటం ఏమిటి అని అనిపించక మానదు. బాద తో కూడిన ఉక్రోషం తో కూడి ఎర్రగా కందిపోయిన ముఖం ఎరుపు గానే ఉంటుంది. జాబిలి లాంటి సీతమ్మని రాముడు ఏడి అని అడుగుతుంటే మాట ఒకటి అంటే కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. మనం ఏదైనా చెప్పొచ్చు కాని కళ్ళు అబద్దాన్ని దాచవు అంటారు. కళ్ళు ఏమి చెప్తున్నాయో చెప్తే మనం గమనించొచ్చు. ఇక్కడ రాముడి జాడ లేదు కనపడకుండా పోయాడు, ఆ మాట పెదవితో చూడలేదు అని చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తాయి రాముడు ఎక్కడున్నాడో తెలియదు అని. నల్ల పూసై నాడు దేవుడు నల్లని రఘు రాముడే. నీల మేఘ శ్యాముడు రాముడే గా అందుకని నల్లని రఘురాముడు అన్న ప్రయోగం అలాగే మనతో ఉండి కనపడకుండా పోయిన వాళ్ళని నల్ల పోశ అయ్యావు అంటారు. ఇది వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో బాగా ప్రయోగిస్తారు. అమావాస్య తరువాత చంద్రుడు వచ్చినా కనపడడు, అలాగే రాముడు ఉన్నాడు కాని కనపడడు అని సీతమ్మ అనుకుంటోంది అని అందం గా చెప్తారు 

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా  || రామచక్కని సీతకి ||

వేటూరి గారు చక్కని చుక్క అని సీతమ్మ వారిని అంటారు కానీ ఇక్కడ రాముడి కోసం సీత పడే తపన ఈ చరణం. చుక్కలని, దిక్కులని అడిగా రాముడు ఏడని, ఇంక బాధతో కూడిన కన్నులని అడిగితె అవి నీటి తో చెమ్మగిల్లాయి, వాటి నిండా కన్నీరే, ఏదైనా చెప్పటానికి ఆ కన్నీరే అడ్డుపడింది, మనసు నిండా ఉన్న రాముడుని చూసుకోవటానికి అడిగితె చెప్పటానికి రాముడు కనపడటం లేదని బాధ తో ఉన్న మనసు నుంచి మాటలు రావటం లేదుగా - ఎంతో ఆర్తితో రాసిన వేటూరి గారు, అంతే  ఆర్తి ధ్వనిస్తుంది ఈ చరణం లొ. 

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

వేటూరి గారు ఇందువదన కుందరదన అన్న పదాలతో ప్రయోగం చేసిన పాట ( చాలెంజ్ సినిమా లో ) వింటే ఆ పాట కి ఈ పాట కి ఎంత వ్యత్యాసమో కదా. మరల అవే పదాలు అటు ఇటు మార్చి ఒకసారి సీతని వర్ణిస్తే ఇంకో సారి ప్రశ్నిస్తారు ఎందుకమ్మా నీకు ఇంత  వేదన, ప్రేమ వలెనే కదా అని. అది పదాల మీద ఆయనకి ఉన్న పట్టు. సీతమ్మ వారిని చందమామ తో పోలుస్తారు ఒక సారి ఎర్ర జాబిలి  అంటారు ఇంకోసారి చంద్రుని వదనం కల దాన అంటారు ఒక సారి మంద గమన అంటారు ఇంకో సారి ఘన విచలన  అంటారు. అతిలోక సుందరి సీతమ్మ వారు నడిస్తే అత్యంత వయ్యారం గా ఉంటుంది, ఆ నడక చూస్తే కందిపోతుందేమో సీతమ్మ పాదం అన్నట్టు ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్న సీతమ్మ నీకు ఎందుకమ్మా ఇంట విచారం, రాముని మీద ప్రేమ వలెనే కదా? అయినా సీతమ్మని వర్ణించాలంటే ఒక జీవితం సరిపోతుందా? ఈ మాటల మాంత్రికుడి చేతిలో పదాలు మారి అర్థం మారేది శ్రోతల్ని అలరించటానికే సుమీ అన్నట్టు ఉంటాయి.

కొసమెరుపు: వేటూరి గారు శేఖర్ కమ్ముల కి ఎంత సహాయ పడ్డారో శేఖర్ కమ్ముల సినిమాలు చూస్తె తెలుస్తుంది, ఆనంద్ కాని, గోదావరి కాని, లీడర్ కాని, హ్యాపీ డేస్ కాని. ప్రతి సినిమాలో అద్బుతమైన పాటలని ఇచ్చారు. ఉప్పొంగెలే గోదావరి పాట గోదావరి అభిమానులకి కన్నుల పండుగ.

ఈ సినిమాకి మొదట మాధవన్ హీరో గా అనుకున్నారు శేఖర్ కాని, ఆయన లభ్యం కాకపోవటం తో సుమంత్ హీరోగా నటించటమే కాకుండా మంచి విజయం సాధించాడు. గోదావరి లో సినిమా తీయటం ఎంత కష్టం అయ్యిందో శేఖర్ కమ్ముల చాల సార్లు వివరించారు. డీజిల్ కి, జెనరేటర్ కి అనుకున్న దానికంటే ఖర్చు అయ్యింది అని చెప్తారు. గోదావరి ప్రవాహం బట్టి రంగు మారుతుంది ఆ రంగులు సినిమాలో చూపించాలంటే అన్ని రోజులు ఆగాల్సిందే. ఇంక లాంచి  సినిమా కోసం చేసిందే. తనికెళ్ళ భరణి పాత్ర కీలకమైన పాత్ర లాంచి మీద ఉన్నంత వరకు. ఇంక కుక్కలు  animation  అయినా  చిన్న తో మనల్ని అలరిస్తాయి. 

Thursday, April 17, 2014

Song of the Week - Siva Poojaku Chivurinchina

Song of the week -  శివ పూజకు చివురించిన (Siva poojaku Chivurinchina)

ముందు మాట : What inspired me to write this series - Instead of posting same matter every time, providing the link to one of the earlier posts :)
Movie Name:         స్వర్ణ కమలం  
Song Name :         శివ పూజకు చివురించిన
Music Director:      ఇళయరాజా  
Singer(s):             SP  బాలసుబ్రహ్మణ్యం , సుశీలమ్మ 
Lyrics:                  'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి 
Director:               K . విశ్వనాథ్
Producer :             K.S . రామారావు (క్రియేటివ్ కమర్షల్స్)
Year of Release:    1988



సిరివెన్నెల గారు స్వర్ణ కమలం సినిమాలో మనకి వజ్రాల్లాంటి పాటలు ఇచ్చారు. ఒక్కో పాట ఒక్కో అనుభూతి మిగులుస్తుంది. అందులో ఈసినిమా ఆయన సినీ జీవితం లో అత్యంత ఉన్నతమైన పాటలు కలిగిన సినిమాగా మిగిలిపోతుంది. ఈ పాట అయన రాసిన అన్ని పాటల్లో మొదటి పది వరుస క్రమం లో తప్పకుండ ఉండే పాట. ఇలాంటి పాట వింటుంటే అనిపిస్తుంది, ఒక పాటలో ఇంతో లోతైన భావం, సినిమాలోని పాత్రల ఆలోచనా సరళి, సందర్భోచితమైన సంఘర్షణ, నిగూఢమైన వేదాంతం, అనంత పద సౌందర్యం, అనిర్వచనీయమైన అనుభూతి మరల ఇంక తెలుగు శ్రోతకి ఉండవేమోఅని. శ్రోత మనసుకి, హృదయానికి, మెదడుకి పని కల్పించే పాట సిరివెన్నెల గారి తో అంతమైపోతుందేమో అని కూడా అనిపించటం సహజం.

విశ్వనాథ్ గారు కళా తపస్వి బిరుదుకి పూర్తి న్యాయం చేసిన సినిమాలలో ఇది ఒకటి అంటే మనకి ఆయన గురించి అర్థం అవ్వనట్టే. ఎంత ఐశ్వర్యం సంపాదించినా మనసు లగ్నం చేసి ఒక కళని నేర్చుకొని ఆస్వాదించి అనుభవిస్తే వచ్చిన ఆనందం,సంతృప్తి ఇంక ఎందులోనూ లభించదు అని నిరూపించిన చిత్రం.  ఈ సినిమా కథ మనకి అర్థం అవ్వాలంటే కథానాయకుని మనసు ద్వారా ఆలోచిస్తే మాత్రమే ఈ కథ అర్థం అవుతుంది. లేదంటే ఈ కథ ఒక సాధారణ కథగా మిగిలి పోతుంది. అలాగే కథానాయిక పొందిన అనుభవం, ఆలోచనలో మార్పు మనం లీనమైతే కాని అర్థం అవ్వదు. చాల మందికి ఈ సినిమాలో విదేశి వనిత (Sharon Lowen) ఉన్న సన్నివేశాలు కొంచెం అసహనానికి గురి చేస్తాయి అవి అర్థం కాకే అని అనుకోవచ్చు. కాని ఆమె ఈ సినిమాకి ప్రాణం, ఎందుకంటే దర్శకుడు ఆమె ద్వారా తను చెప్పదల్చుకున్నది చెప్పించారు.

ఈ  సందేశం కూడా ప్రతి మనిషి తను అనుభవిస్తే కాని అర్థం కాని విషయం. ప్రేక్షకులకి తేర మీద అర్థం అయ్యేలాగ చెప్పటం చాల చాల కష్టం. అది చెప్పటంలో సఫలీకృతం అవ్వటం విశ్వనాథ్ గారు దానికి పడ్డ తపన కష్టానికి తార్కాణం. అందుకనేనేమో ఈ సినిమా సినీ జీవిత చరిత్రలో చిరకాలం నిలచిపోయే సినిమాగా మిగిలిపోయింది.  ఈ సినిమాకి కళాభిరుచి కలిగిన నిర్మాత దొరకటం చాల అరుదు. సినిమా ని వ్యాపారం గా చూసే నిర్మతలున్న రోజుల్లో. కమర్షియల్ సినిమాలు తీసే కె ఎస్ రామారావు గారికి ఈ అవకాశం దొరకటం ఆయన చేసుకున్న అదృష్టం.

ఇళయరాజా సంగీతం ఈ సినిమాని ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లిందో మనం ప్రత్యక్షంగా చూస్తాము. ప్రతి పాటలో సంగీతం పాత్రలకి అనుగుణంగా ఉంటుంది. సిరివెన్నెల గారి ప్రతి పదానికి సరి అయిన న్యాయం చేకూర్చారు ఇళయరాజా. అందులో ఈ "శివ పూజకు" పాటని "కళావతి" రాగం లో సమకూర్చారు. ఇంతకన్నా సందర్భోచితం ఇంకేదైనా ఉంటుందా? ప్రతి సన్నివేశంకి అనుగుణంగా సంగీతం సమకూర్చటం ఇళయరాజా గారికే సాధ్యమేమో అనిపిస్తుంది. పాటలు మాత్రమే కాదు నేపధ్య సంగీతం కూడా అత్యంత ఉన్నతం గా ఉంటుంది. ఉదాహరణకి సావిత్రి అప్పడాలు ఎండ పెడ్తున్నప్పుడు ఆమె ప్రేమికుడు వస్తాడు, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, పని మనిషి చేసే సరసమైన సంభాషణలు జరుగుతున్న నేపధ్యం లో వచ్చే సంగీతం ప్రణయాన్ని సూచిస్తుంది ఆ తరువాత మీనాక్షి ( భానుప్రియ ) స్నానం ముగించి తన గది లోకి వచ్చినప్పుడు చేసే పనుల మీదకి కెమెరా మారుతున్నప్పుడు సంగీతం అలా చక్కగా మారిపోతుంది. ఒక సంగీత దర్శకుడుకి ఉన్న పట్టు మనకి స్పష్టం గా కనపడుతుంది. ఇంక ఇలాంటి సన్నివేశాలు అనేకం ఈ సినిమాలో, తన సంగీతం తో మనకి ఆ అనుభూతి కలుగచేస్తారు ఇళయరాజా గారు

ఇంక సిరివెన్నెల గారి పదవిన్యాసం అత్యంత ఉన్నతం. ఆయన గురించి ఎలాగో మనము పాటలోమాట్లాడుకుంటాం. ఈ పాటకి, సంగీతానికి బాలు గారి గళం, ఆ గళం గురించి చెప్పాలనుకోవటం సముద్రం లోతు తెల్సుకోవాలని అనుకోవటమే. ఇలాగ ఈ నలుగురు బ్రహ్మ నాలుగు తలలుగా మారి సుశీల అమ్మవారితో కలిసి సృష్టించిన అద్బుతమే ఈ పాట.

విశ్వనాద్ గారు ఈ సినిమాలో కొన్ని శ్లోకాలు అర్థవంతంగా చొప్పిస్తారు సన్నివేశానికి అనుగుణంగా. విశ్వనాథ్ గారి దర్సకత్వ ప్రతిభ చెప్పే సన్నివేశాలు చాల ఉన్నా, ఈ సన్నివేశంలో ఆయన ఉపయోగించుకున్న శ్లోకం మనల్ని అలోచింపచేసి ఆనందపరుస్తుంది.

ప్రతి రోజు రాత్రి ఒక పాట పాడటం సావిత్రి ( కధానాయకురాలి అక్క ) అలవాటు. పక్కింటి ఆయన ఆ పాట  వినటం కోసం రావటం ఆ పాట గొప్పతనం చెప్పిస్తారు. విశ్వనాథ్ గారు. అక్కడ ఆయన ఎన్నుకున్న శ్లోకం దర్శకుని పరిణితి కి నిదర్సనం. ఆది శంకరాచార్య విరచితమైన ఈ శివ మానస పూజ నుంచి తీసుకున్న శ్లోకం, ఈ శ్లోకం అర్థం తెలిస్తే ఆ సన్నివేశానికి ఎంత ఉన్నతమైన ఎంపిక అనేది మనకి అర్థం అవుతుంది. సావిత్రి పాత్ర ఎంత చక్కగా రచించారో విశ్వనాథ్ గారు మనం సినిమా లో చూస్తాం.

ఆత్మా త్వం గిరిజా మతిహ్ పరిజనాహ్ ప్రాణాహ్ శరీరం గౄహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితిహ్
సంచారహ్ పదయోహ్ ప్రదక్షిణ విధిహ్ స్తోత్రాణి సర్వా గిరహ్
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం

ఇంకో శ్లోకం శివపూజకు పాట  చివర్లో వస్తుంది

శ్రేయాన్ స్వధర్మో  విగుణః  పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!! 

భగవద్గీత లోని శ్లోకం ఆధారం గా సినిమా వచ్చిందా లేక సినిమా కి ఈ శ్లోకం సరిగ్గా సరిపోయిందా అన్నది సగటు ప్రేక్షకునికి ప్రశ్నగా మిగులుతున్ది.  సినిమాలోని కథ నాయికకి, కథా నాయకుడు  ఈ సందేశం  అడుగడుగునా ఇస్తాడు. అసలు ఈ శ్లోకం ఒకటి ఉందనీ అది ఈ పాట  ద్వారా రెండు పాత్రల మధ్య కలిగే ఆలోచనల సంఘర్షణ కి అన్వయించవచ్చు అని తట్టడం దర్శకుని ఆలోచనా ప్రతిభకి తార్కాణం. అదే సమయంలో ఇలాంటి సినిమాలు మనకి ఎందుకు కరువు అవుతున్నాయో అర్థం కాని ప్రశ్న ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఇప్పటికి 26 సంవత్సరాలు మరి.

ఈ శ్లోకానికి అర్థం కొన్ని వందల రకాలుగా చెప్తారు వేదాంత పండితులు. అంతటి అర్థవంతమైన శ్లోకాన్ని ఒక పాటలో తద్వారా సినిమాలో చొప్పించడం ఇంక మన తెలుగు సినిమాలో చూడలేమేమో. ఈ శ్లోకం గురించి విశ్లేషణ పాటలోకి వెళ్ళినప్పుడు చూద్దాం.

అలాగే విశ్వనాధ్ గారి సినిమాల్లో మాటలు అత్యంత అర్థవంతంగా ఉంటాయో ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం  నిరూపిస్తుంది. మాటలు రాసిన సాయినాధ్ గారి జన్మ ధన్యం. పాత్ర గొప్పతనం మాటల్లోంచి వస్తుంది వాళ్ళ హావ భావల్లోంచి వస్తుంది, నేపధ్య సంగీతం లో వస్తుంది, ఇంకా అలా చెప్తూ ఉంటె అంతం కాని గొప్పతనం కలిగిన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి.

ఈ పాట గురించి మాట్లాడుకునే ముందర అక్కడి వరకు జరిగిన కథ, సన్నివేశాలు స్పర్సించుకోవటం సమంజసం. ఈ సినిమా అందరు చూసినదే అయినా ఒక సారి ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకుంటే ఈ పాట వివరణకి సహాయ పడతాయి. కథానాయకుడు ఒక అనాధ చిత్రకారుడు. ఇంకో చిన్న కుర్రాడి తో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి మీనాక్షి అనుకోని విధం గా కలవటం, అతను  ఆమె ఇంటి పక్కనే అద్దెకు రావటము, ఆమెలో నిక్షిప్తమైన సజీవ కళని  గుర్తించి ఆరాధించటం, తరువాత అవకాశం  దొరికినప్పుడు ప్రోత్సహించటం జరుగుతుంది. అలాగే ఆమె కుటుంబానికి దగ్గర అవ్వటం జరుగుతుంది. అలా ఆమెకి ఇష్టం లేకపోయినా ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చెయ్యటం. ఇష్టం లేని పని చేసాడని కోపం తో గజ్జెలు తెమ్పటం, అప్పుడు ఆ అవమానం తట్టుకోలేక చాల కాలం తరువాత శర్మ గారు నాట్యం చేస్తూ హఠాత్తు గా ప్రాణం విడవటం జరుగుతుంది. ఆ తరువాత మీనాక్షి బాధ పడుతుంటే అక్క సావిత్రి మీనాక్షి కి నచ్చ చెప్తూ ఇంక ఎవరు నాట్యం చెయ్యమని అడగం కాబట్టి ఎవరో గజ్జెలు కావలి అన్నారు ఇచ్చేసి రా అని పంపుతుంది. మీనాక్షి అక్కడికి వెళ్ళకుండా చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుంది హోరు వానలో తడుస్తూ. చందు అప్పుడు ఏదో గీస్తూ ఉంటాడు మీనాక్షి వచ్చిన విషయం గమనించడు. అతను తన వైపు చూడటం కోసం ఒక్కో మువ్వ తెంపి విసిరేస్తుంది. అయినా చంద్రం ఒక్క మాట కూడా అనకుండా, తుడుచుకోవటానికి ఒక టవల్ ఇచ్చి టీ  తాగుతారా అని కప్పు లో టీ  పోస్తాడు అన్ని వద్దు అంటూ, "ఈ మర్యాదలు కాదండి కావాల్సింది, ఒక మనిషిని మనిషి గా గౌరవించటం కావలి, వాళ్ళ ఇష్టా ఇష్టాలు తెలియాలి" అని అంటూ వెళ్ళ బోతుంది. చంద్రం ఆగమని తన రైన్ కోటు కప్పుతాడు, అప్పటి వరకు అన్ని విసిరి కసిరిన మనిషి ఆ కోటుని ఉంచుకొని మౌనం గా వెళ్ళటం రాబోయే రోజులకి, జరిగే పరిణామాలకి చిహ్నమా?? అవుననే చెప్తారు విశ్వనాధ్ గారు తన సినెమా ద్వారా.

ఇంక పాటలోకి వెళ్దాము 

అతడు: శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ.. (2)
సిరి సిరి మువ్వ..(2)
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా..
సిరి సిరి మువ్వ..(2)

సిరివెన్నెల గారు చాల సార్లు తన సినీ జీవితం లో అత్యంత కష్టపడి రాసిన పాట ఏది అంటే ఈ పాటే అని చెప్తారు. ఈ పల్లవి వింటేనే మనకి అర్థం అవుతుంది. ఇంతటి భావుకత ఉన్న పాట అత్యంత అరుదుగా ఉంటాయి.  సినెమా లోని సన్నివేశం చూస్తె ఈ పాట పల్లవి ఎంత అద్బుతమో మనకి అర్థం అవుతుంది. అది ఎందుకో ఎందుకో చూద్దాం. మీనాక్షి గజ్జెలు తెంపి వాటిని విసిరేసి వెళ్ళిపోయినప్పుడు అవి అన్ని ఏరి గజ్జలు చేతిలో పట్టుకొని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు విశ్వనాధ్ గారు చంద్రశేఖర్ మనసులోని భావాల్ని పాట రూపం లో మనకి అందిస్తారు. ఇటువంటి సందర్భాన్ని ఇచ్చి ఎటువంటి హద్దులు లేకుండా కవికి పాట రాయమంటే ఆ కవి ఎలా చెలరేగి పోతాడో ఈ పల్లవి మనకి నిదర్సనం. ఈ చరణం కాని పాట కాని చాల రకాలుగా రచన చెయ్యొచ్చు. కాని మనకు చరణం విన్నప్పుడు కలిగే అనుభూతి  అనిర్వచనీయం. ఒక్కో పదం ఒక్కో నిర్దిష్ట మైన భావం, అర్థం కలిగి ఉన్నాయి. 

చంద్రశేఖర్చే చేతిలో గజ్జెల మువ్వలు ఉన్నాయి, ఆ మువ్వలు దేనికోసం, నాట్యం కోసం. ఆ నాట్యం ఎవరికీ అంటే అత్యంత ప్రీతి శివునికంటే వేరే వారు లెరు. శివుణ్ణి ఎలాగ పూజించటం అంటే నాట్యం తోనే, ఆ నాట్యానికి గజ్జెలు ఆ గజ్జేలకి మువ్వలు తప్పక ఉండాలిగా. ఇక్కడ గజ్జెల మువ్వలు అని అన్నా నిజానికి ఆ మువ్వ మీనాక్షి. తన నాట్యం తో నటరాజుని పూజించటానికి పుట్టిన మువ్వ మీనాక్షి అని. అటువంటి మీనాక్షి నాట్యం ఎలా ఉంటుంది అంది చంద్రశేఖర్ భావం? మృదువు గా అత్యంత అందంగా పాదాల కలయిక ఒక అందమైన పువ్వు గా ఉంటుంది. పదం అంటే అడుగు లేదా మాట. మంజరి అంటే కూడిక, లేక పువ్వు. పువ్వు వాఖ్యం చివరన ఉంది కాబట్టి మీనాక్షి పాదాలతో చేసే నాట్యం మృదువైన అందమైన పువ్వు లాగ ఉంటుంది అని. ఆ పువ్వు ఇందుకోసం అంటే శివుని పూజ కోసం అని ఎంత అందం గా చెప్పారో సిరివెన్నెల గారు. అదే మాట విశ్వనాథ్ గారు సినిమా మొదట్లో చెప్తారు   " ఈ కళలన్నీ ఆ పరమేశ్వరుని పాదాలని అలంకరించిన స్వర్ణ కమలాలు" 

మీనాక్షి నాట్యం కోసమే పుట్టింది అన్న నమ్మకం చంద్రశేఖర్ కి కలిగి ఉండటం అడుగు అడుగునా చూస్తాం సినిమాలో అదే భావం పాట  లోని మొదటి రెండు పంక్తులలో చెప్తారు సిరివెన్నెల గారు. ఎంత చక్కని వివరణ??

యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా..
సిరి సిరి మువ్వ..(2)
నటనాంజలితో బ్రతుకును తరించనీవా..
సిరి సిరి మువ్వ..(2)

యతి రాజు అంటే శివుడే. శివుడు నిర్వ్యామోహి, దేని మీద వ్యామోహం లేని  వాడు. సన్యాసుల లో రారాజు శివుడు. వైరాగ్యానికి మారు పేరు శివుడు. బూడిద పూసుకొని స్మశానం లో తపస్సు చేసే అటువంటి శివుడికి దేని మీద ఇష్టం అంటే అది నాట్యమే. ఇక్కడ  యతిరాజు అనే పదం వాడటం వల్ల  ఎంత అందం వచ్చిందో ఈ వాఖ్యానికి మనం చెప్పలేం. ఏ పరిమళాలకి లొంగని శివుడు లొంగేది జతి స్వరాల తో కూడిన నాట్యానికే అని ఎంత అందం గా చెప్పారో కదా. ఓ మీనాక్షి నీకు సహజ సిద్దం గా వచ్చిన నాట్య ప్రతిభ తో, మీ తండ్రి గారి అత్యంత ప్రతిభ తో కూడిన విద్య నీకు నేర్పారు, భగవంతుడు నీకు అత్యంత అరుదైన అవయవ సౌష్టం ఇచ్చాడు, అటువంటి ఎవరికీ దక్కని వరం పొందిన నీవు నీ నాట్యం తో భగవంతుడికి పూజించి నీ బ్రతుకును తరింప చేసుకోవచ్చు కదా, అని అనుకుంటాడు చంద్రశేఖర్. బ్రతుకు తరించటం అని ఎందుకు అన్నారంటే, కళలు భగవంతుడిని ఆరాధించటానికి ఉపయోగించాలి, అది మనిషి ముక్తి పొందటానికి ఒక మార్గం అని మనకి చాల ఉదాహరణాలు ఉన్నాయి. 

అదే మాట విశ్వనాథ్ గారు ఈ సినిమాలో త్యాగరాజ అరాధనోత్సవానికి ఎడ్ల బండి లో వెళ్తుంటే మీనాక్షి సావిత్రి తో మన తోటి వాళ్ళందరూ BA లు , MAలు చదువుకొని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటి అక్క కూపస్థ మండూకాల్ల లాగ" అంటే అప్పుడు సావిత్రి " నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా" అని జవాబిస్తుంది, అప్పుడు శర్మ గారిని "ఈ కళ నే నమ్ముకొని జీవితాన్ని ధారా పోస్తున్నావు కదా, తిరిగి ఈ కళ  నీకేమి ఇచ్చింది నాన్న" అని అడిగితె ఆయన "ఈ కళలన్నీ ఇహం లోనే మోక్షం ప్రసాదించే సాధనాలమ్మా " అని క్లుప్తం గా ఈ సినిమా సారంశాన్ని చెప్తారు. సిరివెన్నెల గారు ఆ సందేశం ఇక్కడ నొక్కి  వక్కాణిస్తారు. 

ఈ పాట లో సిరివెన్నెల గారు మనకి మీనాక్షి, చంద్రశేఖర్ ఏమి అనుకుంటున్నారో చంద్రశేఖర్ మనస్సు లోంచి చెప్తారు. ఇద్దరి వాదనలు విన్న ప్రేక్షకుడు నిజమే కదా ఇద్దరు చెప్పేది అనుకుంటాం. ఇక్కడ ఒకరి ఆలోచన సరి ఇంకొకరి ఆలోచన తప్పు అనే భావం కలుగ నివ్వరు. చివరి నిర్ణయం మనకి తద్వారా దర్శకునికి వదిలేస్తారు, అదే సిరివెన్నెల గారి ప్రతిభ. 

ఆమె: పరుగాపక పయనించవె తలపుల నావ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!
పరుగాపక పయనించవె తలపుల నావ ..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..

చంద్రశేఖర్ మీనాక్షి గురించి ఏమి అనుకుంటున్నాడో విన్నాం ఇంక అతని ద్వారా మీనాక్షి భావాలలోకి వెళ్దాము. అనేక సందర్భాల్లో అనేక పాత్రల ద్వారా మనకి చెప్తారు విస్వనాధ్ గారు. మీనాక్షి ఈ కళలు ఇహం లో ఎందుకు పనికి రావు. కడుపుకి ఇంత అన్నం కూడా పెట్టలేని ఈ కళల మీద సమయం ఎందుకు వృధా చెయ్యటం అని. మీనాక్షి కి ఏదో ఇష్టమో, దేనికి గంతులు వేస్తుందో, అని ఆమె స్నేహితురాలి ద్వారా చెప్పిస్తారు కూడా. అలాగే ఆమె కోరికలు ఎలాంటివో అనేక సందర్భాల్లో చెప్తారు. మీనాక్షి గురించి ఈపాటికి మనకి తెలిసి పోతుంది. 

చంద్రశేఖర్ చెప్పినదానికి పాటలో మీనాక్షి ఏమి అనుకుంటుందో ఆమె మనసు ద్వార చూస్తాం. ఆలోచనల్ని నావ తో పోల్చటం చాల సార్లు చూస్తాం. ఆలోచనలు ఎప్పుడు ఆపినా ఆగవు, అవి ఆలోచన యొక్క ధర్మము. అవి అలా పరిగెడుతూనే ఉంటాయి. మీనాక్షి తనలో తాను  అనుకుంటోంది అదే. తనకి తానూ నచ్చ చెప్పుకుంటోంది అదే. ఆమె ఆలోచన అంతా తన జీవితం ఎలా సుఖంగా ఉండాలా, తను ఎలా గొప్పగా జీవించాలి అనే. ఏమి చేస్తే జీవితం చక్కగా ఉంటుందో తెలియక పోయినా తన జీవితం ఎలా ఉండాలో నిర్దిష్టం గా తెలుసు, తన సోదరి, స్నేహితురాళ్ళతో చాల సార్లు చెప్తుంది. నావ ప్రయాణం ముందుకి జరగాలి అంటే ఎన్నో ఆటు పోట్లని జయించాలి, వచ్చే ప్రతి కెరటం నావ ప్రయాణానికి అడ్డే . వచ్చే అడ్డంకులకి తల ఒగ్గితే ప్రయాణం సంగతి సరే, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మీనాక్షి జీవితం కూడా నాట్యం చెయ్యాలి అనే అడ్డంకి  తన ప్రతి కలకి అడ్డమే. తన తండ్రి కాని, సోదరి కాని, చుట్టు  పక్కల వాళ్ళు కాని, ఆఖరికి చంద్రశేఖర్ కాని, ప్రతి ఒక్కళ్ళు సూచించేది నాట్యం గురించె. కాబట్టి ఇలాంటి అడ్డంకుల్ని దాటుకుంటూ తనకి కావాల్సింది దక్కించుకోవాలి అనుకోవటం మీనాక్షి ఆంతర్యం 

సిరివెన్నెల గారు మీనాక్షి కి కంటే  చంద్రశేఖర్ కి వాడిన గంభీరమైన పదాలు, భాష లోతు,  వాళ్ళ ఆలోచన అంతర్యానికి చిహ్నాలు. అందుకనే ఈ పాట అంత ప్రాచుర్యం పొందింది 

అతడు: పడమర పడగలపై మెరిసే తారలకై.. (2)
రాత్రిని వరించకే సంధ్యా సుందరి!!
తూరుపు వేదికపై, వేకువ నర్తకివై, (2)
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ!!
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ..(2)
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ!! || శివపూజకు ||

మీనాక్షికి అమెరికా లాంటి పరాయి దేశాలు వెళ్ళాలి అని కోరిక. అందుకేనేమో సిరివెన్నెల గారు, భారత దేశం తూర్పు వైపు ఉంటె అమెరికా పడమరన ఉంటుంది కాబట్టి పడమర పదం వచ్చే విధం గా రాసారేమో. అలాగ తూర్పు వేదిక అనే ప్రయోగం కూడా. అసలు ఈ చరణం వింటే ఒళ్ళు పులకరించ మానదు  ఎంత గొప్ప పదాలు వాడారు సిరివెన్నెల గారు. అందులో ఎంత లోతైన భావం ఉంది, నిఘూడమైన సందేశం ఉంది, వేదాంతం ఉంది, ఒక మనిషి కిఇంత కన్నా గొప్ప సందేశం ఉంటుందా?

ఓ మీనాక్షి నువ్వు పైపైన కనిపించే తలుక్కు లను, మెరుపులను చూసి మోహించి నక్షత్రాల కోసం ఎందుకు వెంట పడతావు? నువ్వే స్వయం గా ఆ నక్షత్రాలకి వెలుగునిచ్చే సూర్యుడి లాంటి దానివి. తూర్పున ఉదయించే సూర్యుడి కాంతి భూమి ని ఎలా మురిపిస్తుందో, ప్రతి సూర్య కిరణం ఒక్కో చైతన్యానికి ఎలాగ స్ఫూర్తి ఇస్తుందో, నిద్రించిన జీవ కోటికి ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుందో, అలాంటి సూర్య కాంతి లాంటి నీ నాట్యాన్ని వదిలేసి, చీకటి పడేటప్పుడు వచ్చే నక్షత్రాల కోసం రాత్రిని ఎందుకు ఎన్నుకుంటావు? శివుడి నాట్యానికి పరవసించని ప్రాణి ఉంటుందా? అలాగే నువ్వు ఎన్నుకునే దారి అంతా, నీ కోరికలన్నీ  పై పైన ఆనందం, క్షణిక ఆనందాన్ని ఇచ్చేవే కాని, శాశ్వత ఆనందాన్నిచ్చేవి కావు. నువ్వు చెయ్యల్సింది నీ జన్మ సార్ధకత చేస్కోవటం. నీలోని అత్యంత అమితమైన విద్యని నిరుపయోగం చెయ్యకు. ఎంత గొప్ప భావం ఇది? ఇటువంటి నిష్కల్మషమైన భావం ఒక మనిషికి కలగటం విశ్వనాథ్ గారి సినిమాల లోనే చూస్తాం. అందుకనేనేమో మీనాక్షి తండ్రి, తనకు కళ్ళు వచ్చిన తరువాత మీనాక్షి posters చూసి ఆనందం తో చంద్రశేఖర్ ని చూసి అంటాడు " అందరి లాగానే నువ్వు కూడా మా మీనాక్షి లోని చిలిపితనాన్నే చూస్తావనుకున్నాను కాని చాల అందంగా చూపించవయ్య ఆమెలోని నాట్య కళని " అని. 

ఆమె: తన వ్రెళ్ళే  సంకెళ్ళై కదలలేని మొక్కలా..
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా..
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా..
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా..
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా..
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా!!  || పరుగాపక పయనించవె || 

ఇప్పటి వరకు చూసింది చాలా ఉన్నా సిరివెన్నెల గారు మనల్ని తన పదాలతో ఆనంద పరవశులని చేసే పని ఆపరు. అప్పుడేనా ఇంకా చాల ఉంది అన్నట్టు ఈ చరణం లోని ఒక్కో పదం ఒక్కో అనుభూతి  ఇస్తుంది. యతి ప్రాసలు ఇష్టం వచ్చినట్టు వాడుతున్న ఈ కాలం లో ఇటువంటి పద ప్రయోగం అరుదుగా చూస్తూ ఉంటాము. "తన వ్రేళ్లు సంకెళ్ళు" , "అవధి లేని అందము ", "అవనికి నలుదిక్కులా", "ఆనందపు గాలి వాలు", "వెన్నెల కిన్నెర గానం" అనేవి అత్యంత అద్భుతమైన ప్రయోగాలు. 

ఒక మొక్క ఎందుకు కదల లేదు అన్న విషయం వేరే విధం గా ఎలా చెప్పారో ఇక్కడ చూస్తాము. వ్రేళ్లు సంకెళ్ళ గా మారితే ఇంక ఎక్కడకి వెళ్తుంది మొక్క, అయినా కాని ఎదగటం మానుతుందా? మానదు. అలాగే ఆమని ( ఆకులు చిగుర్చే కాలం) కోసం ఆగదు కదా. మనము చూడాలి కాని సరి అయిన కళ్ళతో చూస్తే ప్రక్రుతిలో అణువు అణువునా అందమే. ఆ అందానికి పరిధి పరిమితి లేదు, ఈ భూమి మీద అందం అనంతం. అట్లాంటి అందాల నుంచి వచ్చే ఆనందం మనిషి లో ఎంత ఉత్తేజం ఇస్తుందో చెప్పలేము,ఆ ఆనందపు ఆలోచనలు నడుపుతూ ఉంటె ప్రతి రోజు ఒక నవ చైతన్య వంతమైన రోజు కాదా, వెన్నెల్లో కిన్నేరుల గానం వింటే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి జీవితం కోసం నీ ప్రయాణం ఆపకుండా చూసుకో అని మీనాక్షి ద్వారా చెప్తారు. 

ఈ చరణం మళ్లీ  మళ్లీ  వినాలనుకోవటం లో తప్పులేదు. 

అతడు:   చలిత చరణ జనితం నీ సహజ విలాసం!!
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం..
నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం.. (2)
గగన సరసి హృదయంలో..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం!! 

ఇంక సిరివెన్నెల గారు పతాకానికి చెరుతారు. ఈ చరణం ఈ పాటని ముగించటానికి ఆయన ఎన్నుకున్న పదాలు మనల్ని అబ్బుర పరుస్తుంది. చంద్రశేఖర్ ఇంక మీనాక్షి గురించి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆమె కళ  గురించి ఊహించుకోవటంలొ. ఆమె నాట్యం ఎటువంటిదంటే చలించే చరణాలు ( పాదాలు) నుంచి ఉద్భవించిన, సహజసిద్ధమైనటువంటిది  ఆమె నాట్య విలాసం. ఇంక ఆమె సౌందర్య వికాసం జ్వలించే కిరణాలతో కూడినటు వంటిది, ఆమె అభినయం ఉషోదయం లాంటిది. అలాంటి నాట్యం చూసిన సూర్యుడి కన్నుల నుంచి వచ్చిన కాంతి తో ఆకాశం లోని సరస్సు హృదయం లో వికసించిన నూరు దళాలున్న స్వర్ణ మయమైన కమలం అని. ఇది పైకి చూసే అర్థం అయినా, ఇందులో నిఘూడమైన అర్థం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి కళ పరమేశ్వరుని పాదాలు అలంకరించటానికి అందించే స్వర్ణకమలాలే. ఇక్కడ మీనాక్షి తన నాట్యాన్ని రవి చూస్తె ఆ ఉత్తేజిత సూర్య కిరణాల నుంచి మరల గగన సరస్సులో కమలం వికసిస్తుంది అనేది  అధ్బుతమైన ఊహ. 

ఈ చరణం లో భానుప్రియ అభినయం అత్యంత అద్భుతం. ఆమె ప్రదర్శించిన హావ భావాలు, అభినయ సౌందర్యం, నాట్య ముద్రలు, ఇవన్ని చూడ చక్కగా ఉండటమే గాక చరణం లోని ప్రతి పదం అభినయించి చూపారు. వేరు వేరు రకాల ఆహార్యం దరించటం కూడా అభినందనీయం ( కూచిపూడి, ఒడిస్సీ, మోహిని ఆట్టం నాట్య శాస్త్రానికి సరిపడా దుస్తులు వాడటం ). ఈ నాట్యాన్ని రచించటానికి కారకులైన వాళ్ళు అభినందనీయులు. ఈ పాట లోని దృశ్యాలు తీసిన ప్రదేశాలు కూడా చాల హృదయం గా ఉంటాయి. ఒరిస్సా లో ఈ పాట చిత్రీకరణం ఎక్కువగా జరిగింది. 

పరుగాపక పయనించవె తలపుల నాన..
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ..
ఎదిరించిన సుడిగాలిని జయించినావా..
మది కోరిన మధుసీమలు వరించి రావా!!

ఇలా మీనాక్షి పాడుతుంటే ఈ క్రింది శ్లోకం వస్తుంది ఈ శ్లోకం ముగియటం తో పాట కూడా ముగిస్తుంది. చంద్రశేఖర్, మీనాక్షి ని తన దారి వైపు తీసుకు వెళదామనుకుంటే మీనాక్షి చెయ్యి విడిపించుకొని తనకు నచ్చిన దారిలో వెళ్ళిపోతుంది. ఇది విశ్వనాథ్ గారు అద్భుతం గా చూపించారు. చూడటానికి మామూలు గా ఉన్నా ఎంతో నిగూఢమైన అర్థం చూపిస్తుంది. 

శ్రేయాన్ స్వధర్మో  విగుణః  పరధర్మా స్త్వనుస్థాత్
స్వధర్మేని ధనం శ్రేయః పర ధర్మో భయావహః!!

భగవద్గీత లోని ఈ శ్లోకం ముఖ్య సారంశం ఏమిటంటే ప్రతి మనిషి తన కోసం విదించిన ధర్మమే చెయ్యటం ఉత్తమం. ఎంతటి చిన్నదైన తన ధర్మమే ( కర్మ) చెయ్యటమే శ్రేయస్సు కరం. ఎంతటి గొప్పదైన పరుల ధర్మం వైపు వెళ్ళటం హానికరం. ఈ శ్లోకం క్షత్రియుడైన అర్జునుడు తను చెయ్యవలసిన పని వదిలేసి నేను  ప్రశాంతము గా అడవిలో బ్రాహ్మణుని వలె జీవిస్తాను అని శ్రీ కృష్ణుని తో అంటే అతనికి ఉపదేశించిన శ్లోకం. ఇక్కడ కృష్ణుడు చెప్పింది క్షత్రియ ధర్మం యుద్ధం చెయ్యటం, ధర్మాన్ని కాపాడటం అది వదిలేసి వేరే వాళ్ళ పని చెయ్యటం చాల హాని కరం. ఎంత కష్టమైనా, ప్రాణ హాని అయినా స్వధర్మం వీడకూడదు. పరాయి ధర్మం ఎంత  ఆకర్షించినా అది భయొత్పాతమైనది . ఇక్కడ మీనాక్షికి కూడా సహజ సిద్దమైన ధర్మం నాట్యం, అది వదిలేసి బయట ప్రపంచం లోని ఆకర్షణలకు లోనయ్యి నాట్యం వదిలెయ్యటం ఎంత హాని కరమో అని చెప్పటం చంద్రశేఖర్ ద్వారా ఈ పాట ద్వారా, దర్శకులు మనకి తెలియ చేస్తారు. 

కొసమెరుపు: 

ఈ సినిమా లో ప్రసిద్ధి పొందిన "అర్థం చేసుకోరు" అన్న డైలాగ్ అప్పటికి అప్పుడు మీనాక్షి సినిమా కోసం క్యూ లో నిల్చొని స్నేహితురాలితో మాట్లాడేటప్పుడు యాదృచ్చికం గా కుదిరినది అని విశ్వనాథ్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు . మీనాక్షి తండ్రి గా వేసిన నటుడు స్వతహా గా నాట్యాచార్యులు, అలాగే మీనాక్షి బావగా వేసిన అయన కూడా వయోలిన్ వాద్యకారుడే. అందుకే వాళ్ళిద్దరూ సరిగ్గా సరిపోయారేమో. ఇంక మీనాక్షి అక్క సావిత్రికి గాత్ర సహాయం అందించింది SP శైలజ, మీనాక్షి బావగారికి గాత్రం అందించింది శుభలేఖ సుధాకర్. అప్పటికి సుధాకర్ కి శైలజకి వివాహం కాలేదు. బావి లో గజ్జెలు పడిపోయే సీన్ లోని బావి సహజమైన బావి కాదు, అది సినిమా కోసం చేసింది. అలాగే తొండం, కాదు తోక అన్న సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంకా ఇలాంటివి అనేకం.ఏది  ఏమైనా ఈ సినిమా చూసిన ప్రతి సారి ప్రేక్షకుడిని కట్టి పడేసి చివరి వరకు లీనం చేసే సినిమా. ఇది చదివిన తరువాత సినిమా కాని పాట  కాని చూడాలనిపిస్తే  రాసిన రాతకి సార్ధకం చేకురినట్టే. :) 

సిరివెన్నెలగారు చెప్పినట్టే ఈ మధ్య కాలంలో పాటలలో సాహిత్యం ఒక సంగీత వాయిద్యం గా మారిపోయింది. ఎందుకంటే పాట సమకూర్చే వాళ్ళు పదాలు కూరుస్తున్నారు కాని అర్థం మర్చి పోతున్నారు. పాట పదాల అల్లిక  అవుతోందే తప్ప అర్థవంతమైన హారం అవ్వటం లేదు. పాట ఆలోచనలు మాత్రమె కాదు భావాల్ని కూడా తెలియచెయ్యాలి. ఎందుకో ఇవి అన్ని లేని పాటలు వింటున్నాం. పాట బ్రతకాలి అంటే పాట జీవితం అవ్వాలి. విన్న ప్రతి శ్రోత తనకి అన్వయించుకోవాలి. అప్పుడే పాట జీవిస్తుంది, లేక పొతే ధ్వని లో తన ఉనికి కోల్పోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. 

PS: నేను విన్న అనేక సంఖ్య లోని పాటలలో ఎక్కువసార్లు విన్న పాట  ఇదేనేమో. విన్న ప్రతి సారి ఒక్కో అనుభూతి ఒక్కో అర్థం స్పురించటం ఈ పాట గొప్పతనం.  అందుకేనేమో అన్ని సార్లు వినగలగటము. విన్నప్పుడు తట్టిన భావాల్ని అక్షర రూపం కలిగించటమే నా ఈ రాత ఒక్క లక్ష్యం. అంతే  కాని దీన్ని అర్థం చెప్పాలనో, ఈ పాటని విశ్లేషించాలనో తాపత్రయం కాదు. ఎందుకంటే ఆ శక్తి నాకు లేదు అనే భావన. ఇందులో తప్పులు దొర్లితే పెద్ద మనస్సుతో సరిదిద్ద వలసినది  వినమ్ర ప్రార్ధన.